ETV Bharat / state

18 రోజుల్లోనే పింఛన్ల హామీని నెరవేర్చిన ప్రభుత్వం - లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు - Pension Distribution in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 7:25 AM IST

61.95 Lakh Beneficiaries Receive NTR Bharosa Pension in AP : రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. ఒకే ఒక్క రోజులో 95.05శాతం లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. జులై 1వ తేది రాత్రి 10గంటల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 61.95 లక్షల మందికి ఇంటి వద్దనే పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పంపిణీలో క్రియాశీలంగా పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వరకు అందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

new pensions celebrations
new pensions celebrations (ETV Bharat)
ఫించన్‌ పంపిణీలో సరికొత్త రికార్టు - ఒకే ఒక్క రోజులో 95.05శాతం లబ్ధిదారులకు అందజేత (ETV Bharat)

Pension Distribution in AP : రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. రాష్ట్రంలో పింఛన్ దారులకు గత నెల వరకు 3 వేల రూపాయల చొప్పున అందుతుండగా కొత్త ప్రభుత్వం ఒకేసారి 1000 పెంచి, 4 వేల రూపాయలు చేసింది. పైగా దాన్ని ఏప్రిల్‌ నెల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించి, మూడు నెలల బకాయిలు కలిపి 7 వేల రూపాయల చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే కీలక హామీని నెరవేర్చింది. లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు పూయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాల వారు పింఛను సొమ్మును చూసి మురిసిపోయారు.

61.95 లక్షల మందికి పంపిణీ : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. పలుచోట్ల వారు వినూత్న రీతిలో పంపిణీ చేశారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. జులై 1వ తేదీ రాత్రి 10 గంటలకల్లా 95.05 శాతం అనగా 61.95 లక్షల మందికి పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మిగిలిన వారికి నేడు వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నారు.

పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ - ఇంటింటికీ వెళ్లి స్వయంగా నగదు అందజేసిన మంత్రులు - Ministers Distributed Pensions

ఉద్యోగులకు చంద్రబాబు అభినందనలు - వారిపై చర్యలు : రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒకేరోజులో రికార్డు స్థాయిలో 95.05 శాతం పింఛన్లు పంపిణీ చేసిన అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో పించన్ల పంపిణీ జరగలేదని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరనేది పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువైందన్నారు.

పంపిణీలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి సీఎం అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.7 వేల పింఛను అందిస్తుండటంతో కొంత మొత్తాన్ని మినహాయించుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై పింఛనుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పండుగ - స్వయంగా పంపిణీ చేసిన నేతలు - pension distribution in ap

ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ : కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అందరూ భావిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పింఛన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం సారథ్యంలో 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం విశేషమని, సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని ఆయన కొనియాడారు.

New Pension in AP: మీకూ పెన్షన్​ కావాలా? అయితే దరఖాస్తు చేసుకోండిలా! - HOW TO APPLY FOR NEW PENSION in AP

ఫించన్‌ పంపిణీలో సరికొత్త రికార్టు - ఒకే ఒక్క రోజులో 95.05శాతం లబ్ధిదారులకు అందజేత (ETV Bharat)

Pension Distribution in AP : రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల సంబరం హోరెత్తింది. సామాజిక భద్రత పింఛనుదారుల ఇంట పండుగ వాతావరణం వెల్లివిరిసింది. రాష్ట్రంలో పింఛన్ దారులకు గత నెల వరకు 3 వేల రూపాయల చొప్పున అందుతుండగా కొత్త ప్రభుత్వం ఒకేసారి 1000 పెంచి, 4 వేల రూపాయలు చేసింది. పైగా దాన్ని ఏప్రిల్‌ నెల నుంచే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించి, మూడు నెలల బకాయిలు కలిపి 7 వేల రూపాయల చొప్పున అందించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 18 రోజుల్లోనే కీలక హామీని నెరవేర్చింది. లబ్ధిదారుల మోముల్లో చిరునవ్వులు పూయించింది. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు తదితర వర్గాల వారు పింఛను సొమ్మును చూసి మురిసిపోయారు.

61.95 లక్షల మందికి పంపిణీ : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేశారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పాల్గొన్నారు. పలుచోట్ల వారు వినూత్న రీతిలో పంపిణీ చేశారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు. జులై 1వ తేదీ రాత్రి 10 గంటలకల్లా 95.05 శాతం అనగా 61.95 లక్షల మందికి పంపిణీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మిగిలిన వారికి నేడు వారి ఇళ్ల వద్దే నగదు అందించనున్నారు.

పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ - ఇంటింటికీ వెళ్లి స్వయంగా నగదు అందజేసిన మంత్రులు - Ministers Distributed Pensions

ఉద్యోగులకు చంద్రబాబు అభినందనలు - వారిపై చర్యలు : రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఒకేరోజులో రికార్డు స్థాయిలో 95.05 శాతం పింఛన్లు పంపిణీ చేసిన అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఇంత భారీ స్థాయిలో పించన్ల పంపిణీ జరగలేదని పేర్కొన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేయగలరనేది పింఛన్ల పంపిణీతో మరోసారి రుజువైందన్నారు.

పంపిణీలో పాల్గొన్న ప్రతి ఉద్యోగికి సీఎం అభినందనలు తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో కొన్ని చోట్ల సచివాలయ ఉద్యోగులు చేతివాటాన్ని ప్రదర్శించారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రూ.7 వేల పింఛను అందిస్తుండటంతో కొంత మొత్తాన్ని మినహాయించుకునేందుకు ప్రయత్నించారు. దీనిపై పింఛనుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పండుగ - స్వయంగా పంపిణీ చేసిన నేతలు - pension distribution in ap

ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ : కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అందరూ భావిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పింఛన్ల పంపిణీ కూటమి ప్రభుత్వం సారథ్యంలో 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం విశేషమని, సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు, ఉద్యోగులు ఎంత అద్భుతంగా పని చేస్తారో చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని ఆయన కొనియాడారు.

New Pension in AP: మీకూ పెన్షన్​ కావాలా? అయితే దరఖాస్తు చేసుకోండిలా! - HOW TO APPLY FOR NEW PENSION in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.