ETV Bharat / state

ఐదేళ్లుగా తాటిపూడి ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం - తుప్పుపట్టిన ప్రధాన గేట్లు - no repair for Tatipudi project

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 5, 2024, 12:40 PM IST

No Repair For Tatipudi Project In YSRCP Government : రెండు జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించే విజయనగరం జిల్లా తాటిపూడి ప్రాజెక్టు గత ఐదేళ్లు మరమ్మతులకు నోచుకోక అధ్వాన్నంగా మారింది. నిర్వహణను గాలికొదిలేయడంతో ప్రాజెక్ట్ ప్రధాన గేట్లు తుప్పుపట్టిపోయాయి. ప్రాజెక్టు కాల్వలు చెప్పలేనంత దుస్థితికి చేరాయి. ఫలితంగా ఆయకట్టుకు నీరందని పరిస్థితి. గత ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడతామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రకటనతో అన్నదాతల మోముల్లో చిరునవ్వు కనిపిస్తోంది.

no_repair_for_tatipudi_project_in_ysrcp_government
no_repair_for_tatipudi_project_in_ysrcp_government (ETV Bharat)

ఐదేళ్లుగా తాటిపూడి ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం - తుప్పుపట్టిన ప్రధాన గేట్లు (ETV Bharat)

No Repair For Tatipudi Project in YSRCP Government : విజయనగరం జిల్లాలో సహజసిద్దంగా ఏర్పడిన ప్రాజెక్టు తాటిపూడి. ఈ జలాశయం కింద గజపతినగరం, జామి, శృంగవరపుకోట మండలాల పరిధిలో 20వేల ఎకరాల ఆయకట్టు ఉంది. విశాఖ, విజయనగరం సిటీలకు ఈ ప్రాజెక్టు నుంచే తాగునీరు వెళ్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచీ పూర్తి స్థాయి మరమ్మతులకు నోచుకోకపోవటంతో అధ్వాన్నంగా మారింది. ప్రధాన గేట్లు లీకులమయంగా మారాయి.

2011లో 29 కోట్ల రూపాయల జైకా నిధులతో తాటిపూడి ఆయకట్టు పనులు కొంతమేర జరిగాయి. నీరు-చెట్టు కార్యక్రమం కింద అప్పట్లో 19.8 లక్షల రూపాయలతో స్పిల్ వే మరమ్మతులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కనీసం చిన్నపాటి పనులు కూడా నిర్వహించలేదు.

'ప్రాజెక్టు ప్రధాన కాల్వల పూడికతీత పనులు గాలికొదిలేయటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బాణంగి నుంచి గోర్ధిమదుము వెళ్లే కాలువ, లంకోడి మదుము నుంచి వెళ్లే షేరీ కాలువ, ముఠా కాలువ నుంచి ఎద్దోడుమదుము వెళ్లే కాలువ పూడికతో నిండిపోయింది. వరదల సమయంలో పొలాల్లోకి నీళ్లు ప్రవహించి పంటలు దెబ్బతింటున్నాయి.' - వీర నాయుడు, ఎరిక నాయుడు, రైతులు

తాటిపూడిని పూర్తిస్థాయి సాగునీటి ప్రాజెక్టుగా మార్చాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి విశాఖ నగరానికి జులై 1 నుంచి నవంబర్ ఆఖరు వరకు ప్రతిరోజూ 11 ఎంజీడీ నీరు తాగునీటి కోసం తరలిస్తున్నారు. ఖరీఫ్ సాగు సమయంలోనే ప్రాజెక్టు నుంచి విశాఖకు నీటి తరలింపు వల్ల ఆయకట్టుకు నీరందటం లేదని రైతులు చెబుతున్నారు.

తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చే ఖరీఫ్‌కు కాలువతో పాటు జలాశయం మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బొండపల్లి మండలంలోని ఎం.ఎన్. ఛానల్, బీపీ ఛానల్ మరమ్మతులకు నిధులు విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టు సమర్థ నిర్వహణ, పంట కాల్వల మరమ్మతులతో పాటు జలాశయం వద్ద పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

జగన్‌ హయాంలో జలయజ్ఞం వైఫల్యం - ఆ ప్రాజెక్టులే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం - EX CM jagan on irrigation projects

కృష్ణా నదీ జలాల వివాదం- అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? - Krishna Water Dispute

ఐదేళ్లుగా తాటిపూడి ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం - తుప్పుపట్టిన ప్రధాన గేట్లు (ETV Bharat)

No Repair For Tatipudi Project in YSRCP Government : విజయనగరం జిల్లాలో సహజసిద్దంగా ఏర్పడిన ప్రాజెక్టు తాటిపూడి. ఈ జలాశయం కింద గజపతినగరం, జామి, శృంగవరపుకోట మండలాల పరిధిలో 20వేల ఎకరాల ఆయకట్టు ఉంది. విశాఖ, విజయనగరం సిటీలకు ఈ ప్రాజెక్టు నుంచే తాగునీరు వెళ్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచీ పూర్తి స్థాయి మరమ్మతులకు నోచుకోకపోవటంతో అధ్వాన్నంగా మారింది. ప్రధాన గేట్లు లీకులమయంగా మారాయి.

2011లో 29 కోట్ల రూపాయల జైకా నిధులతో తాటిపూడి ఆయకట్టు పనులు కొంతమేర జరిగాయి. నీరు-చెట్టు కార్యక్రమం కింద అప్పట్లో 19.8 లక్షల రూపాయలతో స్పిల్ వే మరమ్మతులు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కనీసం చిన్నపాటి పనులు కూడా నిర్వహించలేదు.

'ప్రాజెక్టు ప్రధాన కాల్వల పూడికతీత పనులు గాలికొదిలేయటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. బాణంగి నుంచి గోర్ధిమదుము వెళ్లే కాలువ, లంకోడి మదుము నుంచి వెళ్లే షేరీ కాలువ, ముఠా కాలువ నుంచి ఎద్దోడుమదుము వెళ్లే కాలువ పూడికతో నిండిపోయింది. వరదల సమయంలో పొలాల్లోకి నీళ్లు ప్రవహించి పంటలు దెబ్బతింటున్నాయి.' - వీర నాయుడు, ఎరిక నాయుడు, రైతులు

తాటిపూడిని పూర్తిస్థాయి సాగునీటి ప్రాజెక్టుగా మార్చాలని రైతులు కోరుతున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి విశాఖ నగరానికి జులై 1 నుంచి నవంబర్ ఆఖరు వరకు ప్రతిరోజూ 11 ఎంజీడీ నీరు తాగునీటి కోసం తరలిస్తున్నారు. ఖరీఫ్ సాగు సమయంలోనే ప్రాజెక్టు నుంచి విశాఖకు నీటి తరలింపు వల్ల ఆయకట్టుకు నీరందటం లేదని రైతులు చెబుతున్నారు.

తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్ సాగు కోసం నీటిని విడుదల చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వచ్చే ఖరీఫ్‌కు కాలువతో పాటు జలాశయం మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే బొండపల్లి మండలంలోని ఎం.ఎన్. ఛానల్, బీపీ ఛానల్ మరమ్మతులకు నిధులు విడుదల చేశామని చెప్పారు. ప్రాజెక్టు సమర్థ నిర్వహణ, పంట కాల్వల మరమ్మతులతో పాటు జలాశయం వద్ద పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడతామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

జగన్‌ హయాంలో జలయజ్ఞం వైఫల్యం - ఆ ప్రాజెక్టులే ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం - EX CM jagan on irrigation projects

కృష్ణా నదీ జలాల వివాదం- అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ఏ తీరాలకు చేర్చనుంది? - Krishna Water Dispute

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.