ETV Bharat / state

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ మాతో టచ్​లో ఉన్నారు : మైనంపల్లి - Mynampally Hanumantha Rao Comments

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Mynampally Hanumantha Rao Comments on BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్​లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్​లోకి వస్తానన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు రాద్ధాంతం చేయడం సరికాదని అనవసరంగా తమను రెచ్చగొట్టద్దని హెచ్చరించారు.

Mynampally Hanumantha Rao Comments
Mynampally Hanumantha Rao Comments on BRS (ETV Bharat)

Mynampally Hanumantha Rao Comments on BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారనీ రెండు మంత్రి పదవులు ఇస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్​లోకి వస్తానన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో నమ్మకం లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

అనవసరంగా తమను రెచ్చగొట్టి మిమ్మల్ని మీరే బొంద పెట్టుకోకండనీ హెచ్చరించారు. కాంగ్రెస్ ఒక్కసారి గేట్లు తెరిస్తేనే మీరు తట్టుకోలేకపోయారని ఇక పూర్తిగా తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. కేటీఆర్,హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక నుంచి వాళ్లే తమ టార్గెట్ అని అన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాళ్లవి క్రిమినల్ మైండ్లు అని, విద్యుత్ అధికారులు కొందరు వాళ్లకి సహకరిస్తూ రైతులకు కరెంటు కోతలు విధిస్తున్నారని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడ్డ అధికారులు సస్పెండ్ కాక తప్పదని హెచ్చరించారు.

"గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదు. ఆయన కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేయాలని చూస్తున్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారు. రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్​లోతు వస్తానని అంటున్నారు." -మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే

Attack on Narsapur MLA Sunitha's House : మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలోని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై దాడి ఘటన విషయం తెలిసిందే. వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా సునీతా ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు బాణా సంచా పేల్చడాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఇంట్లో సునీతా లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు లేరు. వెంటనే పోలీసులు రంగలోకి దిగి, ఇరువర్గాల కార్యకర్తలకు నచ్చచెప్పి పంపించారు. కాంగ్రెస్‌ శ్రేణులు ఇంట్లోకి వచ్చి తమపై దాడి చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శివంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

'హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్​ పగబట్టారు - అందుకే టార్గెట్​ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారు' - KTR On Hydra

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి - తీవ్రంగా ఖండించిన బీఆర్‌ఎస్‌ - MLA Sunita House Attack Controversy

Mynampally Hanumantha Rao Comments on BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారనీ రెండు మంత్రి పదవులు ఇస్తే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్​లోకి వస్తానన్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్​ఎస్​ అధినేతపై ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో నమ్మకం లేదన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదన్నారు.

అనవసరంగా తమను రెచ్చగొట్టి మిమ్మల్ని మీరే బొంద పెట్టుకోకండనీ హెచ్చరించారు. కాంగ్రెస్ ఒక్కసారి గేట్లు తెరిస్తేనే మీరు తట్టుకోలేకపోయారని ఇక పూర్తిగా తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. కేటీఆర్,హరీశ్ రావు కావాలనే కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఇక నుంచి వాళ్లే తమ టార్గెట్ అని అన్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాళ్లవి క్రిమినల్ మైండ్లు అని, విద్యుత్ అధికారులు కొందరు వాళ్లకి సహకరిస్తూ రైతులకు కరెంటు కోతలు విధిస్తున్నారని అన్నారు. అలాంటి చర్యలకు పాల్పడ్డ అధికారులు సస్పెండ్ కాక తప్పదని హెచ్చరించారు.

"గోమారంలో జరిగిన చిన్న ఘటనను హరీశ్ రావు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదు. ఆయన కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు చేయాలని చూస్తున్నారు. తమ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారు. రెండు మంత్రి పదవులు ఇస్తే బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్​లోతు వస్తానని అంటున్నారు." -మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే

Attack on Narsapur MLA Sunitha's House : మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలోని నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై దాడి ఘటన విషయం తెలిసిందే. వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా సునీతా ఇంటి వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు బాణా సంచా పేల్చడాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఇంట్లో సునీతా లక్ష్మారెడ్డితో పాటు కుటుంబసభ్యులు లేరు. వెంటనే పోలీసులు రంగలోకి దిగి, ఇరువర్గాల కార్యకర్తలకు నచ్చచెప్పి పంపించారు. కాంగ్రెస్‌ శ్రేణులు ఇంట్లోకి వచ్చి తమపై దాడి చేశారని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు శివంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

'హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్​ పగబట్టారు - అందుకే టార్గెట్​ చేస్తూ బుల్డోజర్లు పంపుతున్నారు' - KTR On Hydra

ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి - తీవ్రంగా ఖండించిన బీఆర్‌ఎస్‌ - MLA Sunita House Attack Controversy

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.