Musi Catchment Survey : చట్టానికి లోబడి హైడ్రా, అధికారులు పనిచేస్తున్నారని మూసీ ప్రాజెక్టు ఎండీ దాన కిశోర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడంలేదని ఆయన స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలిస్తున్నామని, నిర్వాసితుల్లో దాదాపు 90 శాతం మంది ఖాళీ చేసేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధర ఇస్తున్నట్లు తెలిపారు.
మూసీ నది పరిసరాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు దాన కిశోర్ వెల్లడించారు. 2026 జూన్లోపు మూసీలో మంచి నీళ్లు ప్రవహించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మూసీకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ.3800 కోట్ల వ్యయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
- హైడ్రాను ఏర్పాటు చేసి 2 నెలలైంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- పరిశుభ్రమైన వాతావరణం అనేది రాజ్యాంగంలో భాగం: రంగనాథ్
- పరిశుభ్రమైన వాతావరణం జీవించే హక్కులో భాగం: రంగనాథ్
- ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు: రంగనాథ్
- ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉంది: రంగనాథ్
- సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: రంగనాథ్
- కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారు
- అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- అమీన్పూర్లో ప్రభుత్వం భూములు పెద్దఎత్తున అన్యాక్రాంతం అయ్యాయి
- అమీన్పూర్లో గతంలో ఓ హాస్పిటల్ను కూల్చినా మళ్లీ నిర్మించారు
- అమీన్పూర్లో హాస్పిటల్ను కూల్చివేశారని ప్రచారం చేస్తున్నారు: రంగనాథ్
- అమీన్పూర్లో కూల్చిన ఆస్పత్రిలో రోగులెవరూ లేరు.. వీడియోరికార్డు కూడా చేశాం
- ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారు: రంగనాథ్
విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత: రంగనాథ్ - ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశాం.. దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదు
- ప్రజలు నివసిస్తున్న భవనాలను అసలు కూల్చలేదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- ఇటీవల కూకట్పల్లి నల్లచెరువులో ఆక్రమణలను కూల్చివేశాం
- ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదు: రంగనాథ్
- హైడ్రా మీద భయంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుంది
- బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి చాలా బాధపడ్డాను: రంగనాథ్
- బుచ్చమ్మను కొందరు భయపెట్టారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- హైడ్రా అంటే భరోసా, బాధ్యత... దీనిని బూచిగా చూపించవద్దు: రంగనాథ్
- ఇప్పుడు కాకపోతే... ఇంకెప్పుడు చెరువులు, నాళాలను కాపాడుకోలేం: రంగనాథ్
- సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూల్చివేస్తున్నాం
- పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదు: రంగనాథ్
- ఓవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయి
- విద్యా సంవత్సరం నష్టపోతుందనే వాటిపై చర్యలు తీసుకోలేదు
- అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- జన్వాడ ఫామ్హౌస్ 111 జీవో పరిధిలో ఉంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్
- 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్