ETV Bharat / state

చనిపోయాడనుకున్న వ్యక్తి నుంచి ఫోన్ కాల్! అవాక్కైన బంధువులు- ఉలిక్కిపడ్డ పోలీసులు!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 5:35 PM IST

Murder Mystery In East Godavari District చనిపోయాడనుకొని కర్మకాండలకు సిద్ధం చేశారు. మృతదేహాం కోసం ఎదురుచూసే సమయంలో వచ్చిన ఫోన్ కాల్​తో కుటుంబ సభ్యులు అవాక్కాయ్యారు. అయితే, పోస్టుమార్టం జరిగిన మృతదేహం ఎవరిదని పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

murder_mystery_in_east_godavari_district
murder_mystery_in_east_godavari_district

Murder Mystery In East Godavari District : తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి కేతమల్ల పూసయ్య అలియాస్ వెంకటేశ్వరరావు ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లారు. కొంత సేపటికి పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అకస్మాత్తుగా మంటలు రావడంతో గమనించి స్థానికులు అక్కడికి వెళ్లారు. అక్కడ మంటల్లో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృత దేహం కనిపించింది. అక్కడే పూసయ్య చెప్పులు, బైక్ గమనించి కరెంట్ షాక్ తో ఆయన చనిపోయాడని గ్రామస్థులు భావించారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా గ్రామస్థుల వాదనతో ఏకీభవించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియలో మునిగిపోయారు.

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా కనిపెట్టారు​ సార్​..!'

Three Persons Killed Unknown Person in AP : పూసయ్య బంధువులు, ఇరుగుపొరుగు అంతా అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. పోస్టుమార్టం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి మృతదేహం ఇంటికి చేరడమే ఆలస్యంగా ఉంది. ఇంతలో పూసయ్య ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను పూసయ్యను మాట్లాడుతున్నానని, తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి, ఆటోలో తరలించి, రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో పడేశారని పేర్కొన్నాడు. తీవ్ర గాయాలతో అవస్థ పడుతున్నానని, తనను తీసుకెళ్లాలని అభ్యర్థించాడు. ఈ ఫోన్​ కాల్​తో ఒక్కసారిగా ఖిన్నులైన కుటుంబ సభ్యులు, ఫోన్ లో మాట్లాడుతుంది పూసయ్యేనని నిర్ధారించుకుని, సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ సమాచారంతో ఈ సారి అవాక్కవడం పోలీసుల వంతైంది. పూసయ్య చనిపోలేదని నిర్ధారించుకున్న వారికి, మరి చనిపోయిన మృతదేహం ఎవరిదని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో చనిపోయిన వ్యక్తి మృతదేహం ఎవరిదనే దానిపై దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు క్లూస్ టీం డాగ్ టీంలను రంగంలోకి దించారు. చనిపోయాడని భావించిన వ్యక్తి బతికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు తగలబెట్టిన మృతదేహం మిస్టరీ తేలాల్సి ఉంది.

రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం, కుటుంబ కలహాలతో భార్య సూసైడ్ - భర్తను కొట్టిచంపిన బంధువులు!

Person Killed by Burned with petrol : అసలేెం జరిగిందంటే.. దినచర్యలో భాగంగా ఎప్పటిలాగే పొలానికి వెళ్ళిన పూసయ్యకు దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు రావడం గమనించాడు. అక్కడే ముగ్గురు గుర్తుతెలియని యువకులను గమనించడంతో ట్రాన్స్ ఫార్మర్‌ వైర్లు నిప్పంటించారని భావించిన పూసయ్య యువకులను వెంబడించి ఒకరిని పట్టుకోగా మిగతా ఇద్దరూ ఆయనపై దాడి చేశారు. ఏం చేస్తున్నారని పూసయ్య నిలదీయడంతో తనపై దాడి చేసి, తీవ్రంగా కొట్టి, ఆటోలో తరించాడని పూసయ్య చెప్పాడు. వారు కొట్టిన దెబ్బలకు తాను స్పృహ కోల్పోయినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తన చెప్పులు, బైక్ ను అక్కడే ఉండిపోయాయని తెలిపాడు. కళ్లు తెరచి చూస్తే తాను రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో ఉన్నట్లు గమనించానని వివరించారు. నెమ్మదిగా తాను ఓ వ్యక్తి ఫోన్ సాయంతో తన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు పూసయ్య చెప్పాడు.

మొత్తంగా ఈ ఘటనపై పూర్తి వివరాలు మిస్టీరియస్ ఉన్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని రంగంపేట ఎస్సై పి.విజయ్‌కుమార్‌ తెలిపారు. ఇంతకీ పూసయ్య పొలంలో హత్యకు గురైంది ఎవరు? ఆ ముగ్గురు హంతకులు ఎవరు? మృతదేహాన్ని పెట్రోలుతో కాలిస్తే, విద్యుదాఘాతానికి గురై మరణించినట్టు ప్రాథమికంగా పోలీసులు ఎందుకు నిర్ధారించారన్నది కూడా తేలాల్సి ఉంది.

హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

కర్మకాండకు సిద్ధమయ్యాక కాల్​ చేసి బతికున్నాన్న వ్యక్తి- ఆశ్చర్యంలో బంధువులు- అవాక్కైన పోలీసులు

Murder Mystery In East Godavari District : తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి కేతమల్ల పూసయ్య అలియాస్ వెంకటేశ్వరరావు ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లారు. కొంత సేపటికి పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అకస్మాత్తుగా మంటలు రావడంతో గమనించి స్థానికులు అక్కడికి వెళ్లారు. అక్కడ మంటల్లో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృత దేహం కనిపించింది. అక్కడే పూసయ్య చెప్పులు, బైక్ గమనించి కరెంట్ షాక్ తో ఆయన చనిపోయాడని గ్రామస్థులు భావించారు. తీవ్ర విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా గ్రామస్థుల వాదనతో ఏకీభవించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియలో మునిగిపోయారు.

'అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎలా కనిపెట్టారు​ సార్​..!'

Three Persons Killed Unknown Person in AP : పూసయ్య బంధువులు, ఇరుగుపొరుగు అంతా అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్నారు. అంత్యక్రియల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. పోస్టుమార్టం పూర్తయ్యాక ఆసుపత్రి నుంచి మృతదేహం ఇంటికి చేరడమే ఆలస్యంగా ఉంది. ఇంతలో పూసయ్య ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను పూసయ్యను మాట్లాడుతున్నానని, తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి, ఆటోలో తరలించి, రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో పడేశారని పేర్కొన్నాడు. తీవ్ర గాయాలతో అవస్థ పడుతున్నానని, తనను తీసుకెళ్లాలని అభ్యర్థించాడు. ఈ ఫోన్​ కాల్​తో ఒక్కసారిగా ఖిన్నులైన కుటుంబ సభ్యులు, ఫోన్ లో మాట్లాడుతుంది పూసయ్యేనని నిర్ధారించుకుని, సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. ఈ సమాచారంతో ఈ సారి అవాక్కవడం పోలీసుల వంతైంది. పూసయ్య చనిపోలేదని నిర్ధారించుకున్న వారికి, మరి చనిపోయిన మృతదేహం ఎవరిదని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో చనిపోయిన వ్యక్తి మృతదేహం ఎవరిదనే దానిపై దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసులు క్లూస్ టీం డాగ్ టీంలను రంగంలోకి దించారు. చనిపోయాడని భావించిన వ్యక్తి బతికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు వ్యక్తులు తగలబెట్టిన మృతదేహం మిస్టరీ తేలాల్సి ఉంది.

రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం, కుటుంబ కలహాలతో భార్య సూసైడ్ - భర్తను కొట్టిచంపిన బంధువులు!

Person Killed by Burned with petrol : అసలేెం జరిగిందంటే.. దినచర్యలో భాగంగా ఎప్పటిలాగే పొలానికి వెళ్ళిన పూసయ్యకు దగ్గర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద మంటలు రావడం గమనించాడు. అక్కడే ముగ్గురు గుర్తుతెలియని యువకులను గమనించడంతో ట్రాన్స్ ఫార్మర్‌ వైర్లు నిప్పంటించారని భావించిన పూసయ్య యువకులను వెంబడించి ఒకరిని పట్టుకోగా మిగతా ఇద్దరూ ఆయనపై దాడి చేశారు. ఏం చేస్తున్నారని పూసయ్య నిలదీయడంతో తనపై దాడి చేసి, తీవ్రంగా కొట్టి, ఆటోలో తరించాడని పూసయ్య చెప్పాడు. వారు కొట్టిన దెబ్బలకు తాను స్పృహ కోల్పోయినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో తన చెప్పులు, బైక్ ను అక్కడే ఉండిపోయాయని తెలిపాడు. కళ్లు తెరచి చూస్తే తాను రాజమహేంద్రవరం గ్రామీణ మండలం పిడింగొయ్యి వద్ద పొలాల్లో ఉన్నట్లు గమనించానని వివరించారు. నెమ్మదిగా తాను ఓ వ్యక్తి ఫోన్ సాయంతో తన సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు పూసయ్య చెప్పాడు.

మొత్తంగా ఈ ఘటనపై పూర్తి వివరాలు మిస్టీరియస్ ఉన్నాయి. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని రంగంపేట ఎస్సై పి.విజయ్‌కుమార్‌ తెలిపారు. ఇంతకీ పూసయ్య పొలంలో హత్యకు గురైంది ఎవరు? ఆ ముగ్గురు హంతకులు ఎవరు? మృతదేహాన్ని పెట్రోలుతో కాలిస్తే, విద్యుదాఘాతానికి గురై మరణించినట్టు ప్రాథమికంగా పోలీసులు ఎందుకు నిర్ధారించారన్నది కూడా తేలాల్సి ఉంది.

హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్

కర్మకాండకు సిద్ధమయ్యాక కాల్​ చేసి బతికున్నాన్న వ్యక్తి- ఆశ్చర్యంలో బంధువులు- అవాక్కైన పోలీసులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.