ETV Bharat / state

రామోజీరావు అస్తమయం - ప్రముఖుల దిగ్భ్రాంతి - Cm Revanth On Ramoji Rao Demise

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 9:20 AM IST

Updated : Jun 8, 2024, 10:24 AM IST

Modi On Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

CM Revanth Reddy On Ramoji Rao Demise
Modi On Ramoji Rao Demise (ETV Bharat)

Modi On Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ రావు అని అన్నారు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని అన్నారు. మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని పేర్కొన్నారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని తెలిపారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తు చేశారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాని తెలిపారు. రామోజీరావు కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు మోదీ సానుభూతి తెలిపారు.

CM Revanth Reddy On Ramoji Rao Demise: రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని తెలిపారు. తెలుగు పారిశ్రామికరంగానికి రామోజీ విలువలు జోడించారని తెలిపారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయం - Ramoji Rao Passes Away

Chandrababu Naidu On Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని పేర్కొన్నారు. ఈనాడు గ్రూపు సంస్థలు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.

'మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు'- రామోజీ అస్తమయంపై మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - Modi On Ramoji Rao Demise

Modi On Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ రావు అని అన్నారు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని అన్నారు. మీడియాలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని పేర్కొన్నారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని తెలిపారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని గుర్తు చేశారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాని తెలిపారు. రామోజీరావు కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు మోదీ సానుభూతి తెలిపారు.

CM Revanth Reddy On Ramoji Rao Demise: రామోజీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని తెలిపారు. తెలుగు పారిశ్రామికరంగానికి రామోజీ విలువలు జోడించారని తెలిపారు. మీడియా రంగంలో రామోజీరావు లేని లోటు పూడ్చలేనిదన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నామన్నారు. రామోజీరావు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు అస్తమయం - Ramoji Rao Passes Away

Chandrababu Naidu On Ramoji Rao Demise : ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ రావు తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేసిన రామోజీరావు తెలుగు ప్రజల ఆస్తి అని.. ఆయన మరణం రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా తీరని లోటని చంద్రబాబు అన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం అని పేర్కొన్నారు. ఈనాడు గ్రూపు సంస్థలు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. మీడియా రంగంలో రామోజీరావుది ప్రత్యేకమైన శకం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి ఎక్కడా తలవంచకుండా విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.

'మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు'- రామోజీ అస్తమయంపై మోదీ తీవ్ర దిగ్భ్రాంతి - Modi On Ramoji Rao Demise

Last Updated : Jun 8, 2024, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.