ETV Bharat / state

బెయిల్​పై తిరిగొచ్చి బాలికను హతమార్చాడు- ప్రేమోన్మాది ఘాతుకం - MINOR GIRL murder

Minor Girl Stabbed to Death in Anakapalli District : అనకాపల్లిలో ఓ ప్రేమోన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె ఇంట్లో చెప్పి, తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు ఈ మధ్యనే బెయిల్​పై వచ్చి బాలికను అతి కిరాతకంగా హత్య చేశాడు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 7, 2024, 8:20 AM IST

Updated : Jul 7, 2024, 9:45 AM IST

girl_killed_young_man
girl_killed_young_man (ETV Bharat)

Minor Girl Stabbed to Death in Anakapalli District : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ఏడాదిగా వెంటపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్టు చేశారు. బాలికపై కక్ష పెంచుకున్న ఉన్మాది ఇటీవల బెయిల్‌పై విడుదలై ఆమె ఇంటిలోనే కత్తితో కిరాతంగా హత్య చేశాడు.

అత్తతో వివాహేతర సంబంధం- మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Young Man Killed The Uncle

బాలిక దారుణ హత్య : అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో చదువుతున్న ఓ బాలిక యువకుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. రాంబిల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను సురేష్ అనే యువకుడు ఆమె ఇంట్లోనే కత్తితో కిరాతకంగా పీక కోసి హత్య చేశాడు. బాలిక ఇంట్లోంచి యువకుడు బయటికి రావడాన్ని ఆమె నానమ్మ చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్తపు మడుగులో ఉన్న మనవరాలిని చూసి కేకలు వేశారు. చుట్టుపక్కలవారు వచ్చి బాలికను పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కశింకోటకు చెందిన సురేష్‌కు ఆ గ్రామంలో బంధువులు ఉన్నారు. ఏడాదిగా బాలిక వెంట పడుతున్న ఉన్మాదిపై ఆమె తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన యువకుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను హతమార్చాడు. బిడ్డ హత్యతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఏపీకి చెందిన సినిమా ఆర్టిస్ట్​ ఆత్మహత్య


నిందితుడు సురే బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆమె తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి రారని గమనించే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నిందితుణ్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణను ఆదేశించారు. దీంతో పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

దంపతుల మధ్య గొడవ - క్షణికావేశంలో భర్తను చంపిన భార్య

Minor Girl Stabbed to Death in Anakapalli District : అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ఏడాదిగా వెంటపడుతుండటంతో బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద యువకుడిని అరెస్టు చేశారు. బాలికపై కక్ష పెంచుకున్న ఉన్మాది ఇటీవల బెయిల్‌పై విడుదలై ఆమె ఇంటిలోనే కత్తితో కిరాతంగా హత్య చేశాడు.

అత్తతో వివాహేతర సంబంధం- మేనమామను హత్య చేసిన మైనర్ బాలుడు - Young Man Killed The Uncle

బాలిక దారుణ హత్య : అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో చదువుతున్న ఓ బాలిక యువకుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. రాంబిల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలికను సురేష్ అనే యువకుడు ఆమె ఇంట్లోనే కత్తితో కిరాతకంగా పీక కోసి హత్య చేశాడు. బాలిక ఇంట్లోంచి యువకుడు బయటికి రావడాన్ని ఆమె నానమ్మ చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్తపు మడుగులో ఉన్న మనవరాలిని చూసి కేకలు వేశారు. చుట్టుపక్కలవారు వచ్చి బాలికను పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. కశింకోటకు చెందిన సురేష్‌కు ఆ గ్రామంలో బంధువులు ఉన్నారు. ఏడాదిగా బాలిక వెంట పడుతున్న ఉన్మాదిపై ఆమె తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన యువకుడు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలికను హతమార్చాడు. బిడ్డ హత్యతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఏపీకి చెందిన సినిమా ఆర్టిస్ట్​ ఆత్మహత్య


నిందితుడు సురే బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆమె తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి రారని గమనించే నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నిందితుణ్ని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణను ఆదేశించారు. దీంతో పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

దంపతుల మధ్య గొడవ - క్షణికావేశంలో భర్తను చంపిన భార్య

Last Updated : Jul 7, 2024, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.