ETV Bharat / state

చదువుకున్నవారే ఎక్కువ మోసపోతున్నారు- 'సైబర్​ సిటిజన్ల' రూపకల్పన అభినందనీయం - Cyber crime Awareness Walkathon

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 12:17 PM IST

Minister Valagapudi Anita In Cyber crime Awareness Walkathon in Vijayawada : అనేక సామాజిక మాధ్యమాలు, యాప్‌లకు పౌరులు అందిస్తున్న వారి వ్యక్తిగత సమాచారమే సైబర్​ మోసాలకు కారణమవుతోందా? స్మార్ట్‌ఫోన్ల వినియోగం సమయంలో ఫింగర్‌ ప్రింట్‌ ఉపయోగిస్తే స్క్రీన్‌పై పడే రేఖల ఆధారంగా కూడా మోసాలు చేస్తున్నారన్నారు. లోన్‌యాప్‌లు, హనీట్రాప్‌లు ఇతర యాప్‌ల ఊబిలో పడి చివరికి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సైబర్​ నేరాల సంఖ్య పెరిగిపోతుంది. అందుకే దీనిపై అందరికీ అవగాహన తప్పనిసరి.

Minister Valagapudi Anita In Cyber crime Awareness Walkathon in Vijayawada
Minister Valagapudi Anita In Cyber crime Awareness Walkathon in Vijayawada (ETV Bharat)

Minister Valagapudi Anita In Cyber crime Awareness Walkathon in Vijayawada : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్‌ సెల్‌ పనితీరు మెరుగుపరచడమే కాకుండా- రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతున్న సైబర్‌ మోసాల బారినుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర స్థాయిలోనూ సైబర్‌ కో ఆర్డినేషన్‌ టీం ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన వాక్‌థాన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

16 రకాల సైబర్‌ మోసాల గురించి ప్రజలకు వివరించి- వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్‌యాప్‌ను మంత్రి అనిత, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజిసర్కిల్‌ వరకు వాక్‌థాన్‌ చేశారు. బెంజిసర్కిల్‌ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ నగర పరిధిలో సాంకేతికపై అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారిని సైబర్‌ సైనికుల ద్వారా నియమించి- ఒక్కొక్కరు వంద మంది నగర పౌరులకు ఈ మోసాల గురించి తెలియజేసి వారిని అప్రమత్తం చేయడం ద్వారా పౌరులను సైబర్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా చూడడమే ప్రధాన లక్ష్యంగా విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ తీసుకొన్న చొరవ ప్రశంసనీయమని మంత్రి అనిత అన్నారు.

'పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని- మనుగడనే ప్రశ్నార్ధకం చేసేలా జరుగుతున్న కొత్త తరహా మోసాలకు ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చింది. నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా 1730 కోట్ల రూపాయలు సైబర్‌ నేరగాళ్ల ద్వారా చేతులు మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం ఇదే . ఈ మోసాల బారినపడుతోంది ఎక్కువగా ఉన్నత విద్యావంతులే. 24 శాతం సైబర్‌ క్రైం రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.' -హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

పెరుగుతున్న సైబర్ మోసాలు - మూడేళ్లలో రూ.940 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు - Cyber ​​Frauds in AP

అనేక సామాజిక మాద్యమాలు, యాప్‌లకు పౌరులు అందిస్తున్న వారి వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతోందని స్మార్ట్‌ఫోన్ల వినియోగం సమయంలో ఫింగర్‌ ప్రింట్‌ ఉపయోగిస్తే స్క్రీన్‌పై పడే రేఖల ఆధారంగా కూడా మోసాలు చేస్తున్నారన్నారు. లోన్‌యాప్‌లు, హనీట్రాప్‌లు ఇతర యాప్‌ల ఊబిలో పడి చివరికి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మూడునెలల్లో రెండు లక్ష మంది పౌరులను సైబర్‌ సిటిజన్లుగా తయారు చేయాలనేది తమ లక్ష్యమని సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ఆర్ధిక మోసం జరిగిన క్షణాల్లోనే జాతీయ స్థాయిలో రూపొందించిన 1930 పోర్టల్‌కు ఫిర్యాదు చేస్తే 98 బ్యాంకులు ఆ పోర్టల్‌తో అనుసంధానం అయి ఉన్నాయని- సైబర్‌ నేరగాళ్ల ఆర్ధిక లావాదేవీలను వెంటనే నిలిపివేసేందుకు వీలుంటుందని చెప్పారు.

సాంకేతిక వినియోగంపై అవగాహన పెంచుకుంటున్న పౌరులు- వాటి వల్ల జరిగే మోసాల గురించి అవగాహన లేకపోవడం ద్వారానే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు డాక్టరు జి.సృజన తెలిపారు. సైబర్‌ మోసాలపై అప్రమత్తత, అవగాహన చాలా అవసరమని చెప్పారు. విజయవాడ నగర పోలీసులు రూపొందించిన ఈ యాప్‌పై ప్రజల్లో జాగురూకత తీసుకొచ్చేందుకు ప్రజాప్రతినిధులుగా తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర, విజయవాడ నగర డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై విజయవాడ సీపీ ప్రత్యేక దృష్టి - నగర వ్యాప్తంగా కమాండోలు ఏర్పాటు - CP Formed Commandos on Cyber Crimes

Minister Valagapudi Anita In Cyber crime Awareness Walkathon in Vijayawada : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్‌ సెల్‌ పనితీరు మెరుగుపరచడమే కాకుండా- రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతున్న సైబర్‌ మోసాల బారినుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర స్థాయిలోనూ సైబర్‌ కో ఆర్డినేషన్‌ టీం ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏర్పాటు చేసిన వాక్‌థాన్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

16 రకాల సైబర్‌ మోసాల గురించి ప్రజలకు వివరించి- వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో రూపొందించిన మొబైల్‌యాప్‌ను మంత్రి అనిత, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ఆవిష్కరించారు. ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజిసర్కిల్‌ వరకు వాక్‌థాన్‌ చేశారు. బెంజిసర్కిల్‌ వద్ద మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. విజయవాడ నగర పరిధిలో సాంకేతికపై అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని వారిని సైబర్‌ సైనికుల ద్వారా నియమించి- ఒక్కొక్కరు వంద మంది నగర పౌరులకు ఈ మోసాల గురించి తెలియజేసి వారిని అప్రమత్తం చేయడం ద్వారా పౌరులను సైబర్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా చూడడమే ప్రధాన లక్ష్యంగా విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ తీసుకొన్న చొరవ ప్రశంసనీయమని మంత్రి అనిత అన్నారు.

'పెరుగుతున్న సాంకేతికతను ఆధారంగా చేసుకుని- మనుగడనే ప్రశ్నార్ధకం చేసేలా జరుగుతున్న కొత్త తరహా మోసాలకు ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చింది. నాలుగు నెలల్లో దేశవ్యాప్తంగా 1730 కోట్ల రూపాయలు సైబర్‌ నేరగాళ్ల ద్వారా చేతులు మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి ప్రజలంతా ఆలోచించాల్సిన సమయం ఇదే . ఈ మోసాల బారినపడుతోంది ఎక్కువగా ఉన్నత విద్యావంతులే. 24 శాతం సైబర్‌ క్రైం రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.' -హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత

పెరుగుతున్న సైబర్ మోసాలు - మూడేళ్లలో రూ.940 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు - Cyber ​​Frauds in AP

అనేక సామాజిక మాద్యమాలు, యాప్‌లకు పౌరులు అందిస్తున్న వారి వ్యక్తిగత సమాచారమే ఈ మోసాలకు కారణమవుతోందని స్మార్ట్‌ఫోన్ల వినియోగం సమయంలో ఫింగర్‌ ప్రింట్‌ ఉపయోగిస్తే స్క్రీన్‌పై పడే రేఖల ఆధారంగా కూడా మోసాలు చేస్తున్నారన్నారు. లోన్‌యాప్‌లు, హనీట్రాప్‌లు ఇతర యాప్‌ల ఊబిలో పడి చివరికి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మూడునెలల్లో రెండు లక్ష మంది పౌరులను సైబర్‌ సిటిజన్లుగా తయారు చేయాలనేది తమ లక్ష్యమని సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ఆర్ధిక మోసం జరిగిన క్షణాల్లోనే జాతీయ స్థాయిలో రూపొందించిన 1930 పోర్టల్‌కు ఫిర్యాదు చేస్తే 98 బ్యాంకులు ఆ పోర్టల్‌తో అనుసంధానం అయి ఉన్నాయని- సైబర్‌ నేరగాళ్ల ఆర్ధిక లావాదేవీలను వెంటనే నిలిపివేసేందుకు వీలుంటుందని చెప్పారు.

సాంకేతిక వినియోగంపై అవగాహన పెంచుకుంటున్న పౌరులు- వాటి వల్ల జరిగే మోసాల గురించి అవగాహన లేకపోవడం ద్వారానే అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు డాక్టరు జి.సృజన తెలిపారు. సైబర్‌ మోసాలపై అప్రమత్తత, అవగాహన చాలా అవసరమని చెప్పారు. విజయవాడ నగర పోలీసులు రూపొందించిన ఈ యాప్‌పై ప్రజల్లో జాగురూకత తీసుకొచ్చేందుకు ప్రజాప్రతినిధులుగా తమవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోండా ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్‌ ధ్యానచంద్ర, విజయవాడ నగర డీసీపీలు, ఇతర పోలీసు అధికారులు, విద్యార్ధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపై విజయవాడ సీపీ ప్రత్యేక దృష్టి - నగర వ్యాప్తంగా కమాండోలు ఏర్పాటు - CP Formed Commandos on Cyber Crimes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.