ETV Bharat / state

గిరిజన విద్యార్థి తండ్రి చొక్కా విప్పిన ఘటనపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం - తక్షణ చర్యలకు ఆదేశం - Sandhyarani on Tribal Insulting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 1:54 PM IST

Minister Sandhyarani Fire on Tribal Student Father Insulting Incident: పాఠశాల కమిటీ ఎన్నికల్లో ఓ గిరిజన విద్యార్థి తండ్రిని చొక్కా విప్పి అవమానించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన తన దృష్టికి రావటంతో పాఠశాల నిర్వహణపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Minister_Sandhyarani_Fire_on_Tribal_Student_Father_Insulting_Incident
Minister_Sandhyarani_Fire_on_Tribal_Student_Father_Insulting_Incident (ETV Bharat)

Minister Sandhyarani Fire on Tribal Student Father Insulting Incident: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్​లో ఓ గిరిజన విద్యార్థి తండ్రిని చొక్కా విప్పి అవమానించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణ చర్యలపై అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్​లో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్​లో ఇటీవల తనకు అవమానం జరిగిందని ఓ విద్యార్థి తండ్రి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల కమిటీ ఎన్నికల్లో తన చొక్కా విప్పి అవమానించారని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. రెండు గంటలపాటు చొక్కా విప్పతీసి నిలబెట్టారని, అందుకు హోంగార్డు కూడా సహకరించారని ఆవేదన వెలిబుచ్చాడు.

దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి ఓ గిరిజనుడిని చొక్కా విప్పదీసి రెండు గంటలపాటు నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుడిని నిలబెట్టిన సమయంలో హోంగార్డు సహకారం ఉందని సంబంధిత హెచ్ఎం హోంగార్డుపై చర్యలు తీసుకోవాలన్నారు.

Minister Sandhyarani Fire on Tribal Student Father Insulting Incident: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్​లో ఓ గిరిజన విద్యార్థి తండ్రిని చొక్కా విప్పి అవమానించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణ చర్యలపై అధికారులను ఆదేశించారు.

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కలెక్టరేట్​లో గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మక్కువ మండలంలోని మోడల్ స్కూల్​లో ఇటీవల తనకు అవమానం జరిగిందని ఓ విద్యార్థి తండ్రి వినతిపత్రం అందజేశారు. పాఠశాలల కమిటీ ఎన్నికల్లో తన చొక్కా విప్పి అవమానించారని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. రెండు గంటలపాటు చొక్కా విప్పతీసి నిలబెట్టారని, అందుకు హోంగార్డు కూడా సహకరించారని ఆవేదన వెలిబుచ్చాడు.

దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి ఓ గిరిజనుడిని చొక్కా విప్పదీసి రెండు గంటలపాటు నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గిరిజనుడిని నిలబెట్టిన సమయంలో హోంగార్డు సహకారం ఉందని సంబంధిత హెచ్ఎం హోంగార్డుపై చర్యలు తీసుకోవాలన్నారు.

'గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండకూడదు'- ఆర్టీసీ కొత్త బస్సులను ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి - Hundred Bed Hospital in Salur

18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్థిక సాయం-'మహాశక్తి'ని త్వరలోనే ప్రారంభిస్తాం: మంత్రి సంధ్యారాణి - Discussion on Mahashakti scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.