ETV Bharat / state

వైఎస్సార్సీపీ పాలనలో ఒక్క బస్సైనా కొనలేదు : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి - Minister Ramprasad Fires on YSRCP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 2:21 PM IST

Ramprasad on New Buses in AP : గత వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో ఒక్క బస్సు కూడా కొనలేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నారు. జగన్ సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు.

Minister Ramprasad Fires on YSRCP
Minister Ramprasad Fires on YSRCP (ETV Bharat)

Minister Ramprasad Fires on YSRCP : ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్ల లాంటి వారని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జగన్ సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఒక్క బస్సు కూడా కొనలేదన్నారు. ఏలూరు డిపోలో ఏర్పాటు చేసిన నూతన బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Ramprasad Opening New Buses in Eluru : ఈ సందర్భంగా రాంప్రసాద్​రెడ్డి డిపోలో దూర ప్రాంతాలకు వెళ్లే 30 సూపర్ లగ్జరీ, స్టార్‌ లైనర్‌ స్లీపర్‌ బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్క నాటారు. అంతకు ముందు ఆయన దుగ్గిరాలలోని నివాసంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిశారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు 1400ల కొత్త బస్సులు కొన్నామని రాంప్రసాద్​రెడ్డి చెప్పారు ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తమ సర్కార్ ఏర్పాటయ్యక ఇప్పటికే రెండుసార్లు పింఛన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈనెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నామని రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

"కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు 1400ల కొత్త బస్సులు కొన్నాం. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్ల లాంటి వారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ప్రభుత్వం ఏర్పాటయ్యక ఇప్పటికే రెండుసార్లు పింఛన్లు ఇచ్చాం. ఈనెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం." - మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి, రవాణాశాఖ మంత్రి

మరోవైపు బుధవారం నాడు మంత్రి మండిపడ్డి రాంప్రసాద్​రెడ్డి విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో 14 బస్సులను ప్రారంభించారు. ఏపీఎస్‌ఆర్టీసీకి త్వరలో వెయ్యి కొత్త బస్సులు రాబోతున్నాయని చెప్పారు. మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నారీమణులకు తీపి కబురు చెబుతామని రాంప్రసాద్​రెడ్డి వివరించారు.

ఆర్టీసీకి మంచిరోజులు- 1400 బస్సుల కొనుగోలుకు సీఎం గ్రీన్​ సిగ్నల్​ : మంత్రి రాంప్రసాద్​రెడ్డి - new busses for apsrtc

విశాఖ నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం: మంత్రి మండిపల్లి - Ramprasad Reddy on Free Bus Scheme

Minister Ramprasad Fires on YSRCP : ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్ల లాంటి వారని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. జగన్ సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు. గత ఐదేళ్లలో ఒక్క బస్సు కూడా కొనలేదన్నారు. ఏలూరు డిపోలో ఏర్పాటు చేసిన నూతన బస్సులను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

Ramprasad Opening New Buses in Eluru : ఈ సందర్భంగా రాంప్రసాద్​రెడ్డి డిపోలో దూర ప్రాంతాలకు వెళ్లే 30 సూపర్ లగ్జరీ, స్టార్‌ లైనర్‌ స్లీపర్‌ బస్సు సర్వీసులను ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్క నాటారు. అంతకు ముందు ఆయన దుగ్గిరాలలోని నివాసంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిశారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు 1400ల కొత్త బస్సులు కొన్నామని రాంప్రసాద్​రెడ్డి చెప్పారు ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. తమ సర్కార్ ఏర్పాటయ్యక ఇప్పటికే రెండుసార్లు పింఛన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఈనెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నామని రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

"కొత్త ప్రభుత్వంలో ఇప్పటివరకు 1400ల కొత్త బస్సులు కొన్నాం. ఆర్టీసీ సంస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఆర్టీసీకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్ల లాంటి వారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. ప్రభుత్వం ఏర్పాటయ్యక ఇప్పటికే రెండుసార్లు పింఛన్లు ఇచ్చాం. ఈనెల 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నాం." - మండిపల్లి రాంప్రసాద్​రెడ్డి, రవాణాశాఖ మంత్రి

మరోవైపు బుధవారం నాడు మంత్రి మండిపడ్డి రాంప్రసాద్​రెడ్డి విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో 14 బస్సులను ప్రారంభించారు. ఏపీఎస్‌ఆర్టీసీకి త్వరలో వెయ్యి కొత్త బస్సులు రాబోతున్నాయని చెప్పారు. మహిళలకు హామీ ఇచ్చిన విధంగా ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే నారీమణులకు తీపి కబురు చెబుతామని రాంప్రసాద్​రెడ్డి వివరించారు.

ఆర్టీసీకి మంచిరోజులు- 1400 బస్సుల కొనుగోలుకు సీఎం గ్రీన్​ సిగ్నల్​ : మంత్రి రాంప్రసాద్​రెడ్డి - new busses for apsrtc

విశాఖ నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం: మంత్రి మండిపల్లి - Ramprasad Reddy on Free Bus Scheme

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.