ETV Bharat / state

చెరువులు, ఏటిగట్ల గండ్లను వెంటనే గుర్తించాలి- జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష - Minister Nimmal Video Conference

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 5:43 PM IST

Minister Nimmal Video Conference with Irrigation Officials: జలవనరుల శాఖ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను, వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో దెబ్బతిన్న కాలువ‌లు, డ్రెయిన్లు, చెరువులు, రిజ‌ర్వాయ‌ర్లు, ఏటిగ‌ట్లకు ప‌డ్డ గండ్లను వెంట‌నే గుర్తించాలని మంత్రి అధికారులకు సూచించారు. గోదావ‌రి ప‌రివాహక ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాలని సూచించారు.

minister_nimmal_video_conference
minister_nimmal_video_conference (ETV Bharat)

Minister Nimmal Video Conference with Irrigation Officials: వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలు డ్రెయిన్లు, చెరువులు రిజర్వాయర్లు, ఏటి గట్లకు పడిన గండ్లను తక్షణం గుర్తించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గుర్తించిన గండ్లను అత్యవసర పనులుగా పెట్టుకుని వెంటనే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఇరిగేష‌న్, సీఈ, ఎస్ఈ, ఈఈ అధికారుల‌తో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేష‌న్ స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ జీ.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంక‌టేశ్వర‌రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ చ‌రిత్రలోనే అత్యధికంగా 45,000 క్యూసెక్కుల నీరు వచ్చినా వరద నిర్వహణ సరిగా చేయడం వల్ల నష్ట స్థాయిని తగ్గించగలిగామని మంత్రి వివరించారు.

ధవళేశ్వరం నుంచి ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతున్నామని సాయంత్రానికి ఇది మరింతగా పెరిగి 10 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశముందని మంత్రి వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కొల్లేరు అవుట్ ఫ్లో పెంచేందుపకు అడ్డంకిగా ఉన్న కిక్కిస గడ్డిని పంట్లపై యంత్రాలు పెట్టి తొలగించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం వరద నీటితో రాయ‌ల‌సీమ‌కు సంబంధించి రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు అన్నీ నింపుకొని ప్రతిరోజూ నివేదిక అందించాల‌ని అధికారుల‌కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Minister Nimmal Video Conference with Irrigation Officials: వరదల కారణంగా దెబ్బతిన్న కాలువలు డ్రెయిన్లు, చెరువులు రిజర్వాయర్లు, ఏటి గట్లకు పడిన గండ్లను తక్షణం గుర్తించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. గుర్తించిన గండ్లను అత్యవసర పనులుగా పెట్టుకుని వెంటనే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఇరిగేష‌న్, సీఈ, ఎస్ఈ, ఈఈ అధికారుల‌తో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేష‌న్ స్పెష‌ల్ చీఫ్ సెక్రటరీ జీ.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంక‌టేశ్వర‌రావు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ చ‌రిత్రలోనే అత్యధికంగా 45,000 క్యూసెక్కుల నీరు వచ్చినా వరద నిర్వహణ సరిగా చేయడం వల్ల నష్ట స్థాయిని తగ్గించగలిగామని మంత్రి వివరించారు.

ధవళేశ్వరం నుంచి ప్రస్తుతం 7 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదులుతున్నామని సాయంత్రానికి ఇది మరింతగా పెరిగి 10 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశముందని మంత్రి వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. కొల్లేరు అవుట్ ఫ్లో పెంచేందుపకు అడ్డంకిగా ఉన్న కిక్కిస గడ్డిని పంట్లపై యంత్రాలు పెట్టి తొలగించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం వరద నీటితో రాయ‌ల‌సీమ‌కు సంబంధించి రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు అన్నీ నింపుకొని ప్రతిరోజూ నివేదిక అందించాల‌ని అధికారుల‌కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరాంధ్ర ఉక్కిరిబిక్కిరి- ఎడతెరిపిలేని వర్షాలతో ప్రమాదకరంగా వాగులు - Heavy rains in Uttarandhra

బ్యారేజీని కూల్చి లక్షకుపైగా జనాన్ని చంపాలన్నదే జగన్ లక్ష్యం: మంత్రి లోకేశ్ - Nara Lokesh Fire on Jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.