ETV Bharat / state

CBSE సిలబస్​ ఎఫెక్ట్​ - ఇంగ్లీష్​లో 77%, మ్యాథ్స్​లో 72% మంది ఫెయిల్‌ - AP CBSE STUDENTS PROBLEMS

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2024, 12:37 PM IST

AP CBSE Students Failed : జగన్‌ అనాలోచిత నిర్ణయాలు నేటి విద్యార్ధులకు శాపంగా మారాయి. కనీస అవగాహన లేకుండా ఒకేసారి 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ పరీక్షా విధానం ప్రవేశపెట్టిన తీరు ప్రచార ఆర్భాటం తప్ప, విద్యార్థులకు ఎంత మాత్రం ఉపయోగపడలేదన్నది తేలిపోయింది. ఈ పరీక్షా విధానంలో బోధించే ఉపాధ్యాయులు లేకుండానే తీసుకున్న నిర్ణయాల ఫలితం అంతర్గత మదింపు పరీక్షల్లో వెలుగుచూసింది.

CBSE Students Problems in AP
Majority CBSE Students Fail In Internal Assessment Exam (ETV Bharat)

CBSE Internal Assessment Exam Result in AP : విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశలో కన్పిస్తున్నాయి. గతంలో నాటి సీఎం జగన్‌ హడావిడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యవసానాలకు ఓ తరం స్టూడెంట్స్​ బలి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

సీబీఎస్‌ఈ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు ఎగ్జామ్స్​ నిర్వహించింది. ఇప్పటివరకు బోధించిన సిలబస్‌ నుంచి 50 మల్టిపుల్​ ఛాయిస్ ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున కేటాయించారు. దీన్నే 100 మార్కులకు లెక్కకట్టారు. ఇందుకు 80,000ల ట్యాబ్‌లు వినియోగించారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు ఈ పరీక్షలు​ రాశారు.

అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు : వారిలో ఇంగ్లిషులో 59,518 (76.81 %), గణితంలో 56,213 (72.55 %), సామాన్య శాస్త్రంలో 49,410 (63.77 %), సోషల్​ స్టడీస్​లో 48,766 (62.94 %) మంది ఫెయిల్‌ అయ్యారు. ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది పాస్​ కాలేదు. ఈ రిజల్ట్స్​ను చూసి అధికారులు విస్మయానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఈ ఏడాది 1000 పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తాజా మదింపు ఫలితాలే జరగబోయే పబ్లిక్‌ పరీక్షల్లోనూ పునరావృతమైతే పరిస్థితి ఏంటని వారు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో? : సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసే స్టూడెంట్స్​కు 20 ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయి. ఇవి ఆయా పాఠశాలల టీచర్లు వేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ సుమారు 20 మార్కులు వేయొచ్చని, మరో 20 మార్కులు అదనంగా తెచ్చుకుంటే పాస్‌ అయిపోతారంటూ గత సర్కార్ ఆలోచించిందని అధికారులు ఇటీవల సమీక్షలో లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. వాస్తవానికి విద్యార్థులందరికీ అంతర్గత మార్కులు గరిష్ఠంగా 20 మార్కులు వేయడానికి నిబంధనలు ఒప్పుకోవని కూడా వారే మంత్రికి తెలిపారు.

అంతా విన్న మంత్రి లోకేశ్‌, ఇది విద్యార్థుల భవిష్యత్​కు సంబంధించిన విషయమని, ఇలాంటి వాటిని తాను అంగీకరించనన్నారు. సీబీఎస్‌ఈ పరీక్షలు రాసి, విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్‌ అయితే, అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వారు ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతి నిర్ణయమూ లోతుగా ఆలోచించి తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

ప్రణాళిక లేకుండా సీబీఎస్​ఈని రుద్దిన పర్యవసానం : ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు స్టేట్‌ విధానంలో పబ్లిక్‌ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా టీచింగ్​లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటికి తోడు తాజాగా ఇంటర్నల్​ ఎగ్జామ్స్​ రిజల్ట్స్​ విద్యాశాఖను నివ్వెరపరిచాయి.

మొత్తంగా సీబీఎస్‌ఈ పరీక్షా విధానంలోకి మారేముందే ఉపాధ్యాయులకు ప్రోపర్​ ట్రైనింగ్ ఇవాల్సి ఉండేదని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో పాటు విద్యార్థులకు దిగువస్థాయి తరగతుల నుంచే కెపాసిటీ బిల్డింగ్‌పై తగిన కసరత్తు చేసి ఉండాల్సిందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ ఏడాదికిగానూ సీబీఎస్‌ఈ పరీక్షా విధానం లేనట్టేనని తెలుస్తోంది. సీబీఎస్‌ఈలోకి మారిన వెయ్యి పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు స్టేట్​ బోర్డు పరీక్షలే నిర్వహించే అవకాశం ఉంది.

విద్యార్థుల్లో కలవరపాటు : రాష్ట్ర బోర్డు పరీక్షలకు, సీబీఎస్‌ఈ పరీక్షా విధానానికి తేడా ఉంటుంది. ఉపాధ్యాయులు ఈ విధానంలో బోధించాలంటే కావల్సిన శిక్షణ పొంది ఉండాలి. విద్యార్థులను ఫౌండేషన్‌ లెవల్​ నుంచే సన్నద్ధం చేయాలి. గత వైఎస్సార్సీపీ సర్కార్ కసరత్తు లేకుండా ఒకేసారి 1-6 తరగతులను ఇంగ్లీశ్​ మీడియంలోకి మార్చింది. అదే సమయంలో 1000 పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. దీని ప్రకారం ఈ సంవత్సరం ఆయా బడుల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులందరూ సీబీఎస్‌ఈ విధానంలోనే ఎగ్జామ్స్​ రాయాల్సి ఉంది.

'ప్రైవేట్ పాఠశాల వద్దు సర్కారు బడి ముద్దు' - వినూత్నంగా విద్యాబుద్దులు నేర్పుతున్న ఉపాధ్యాయుడు - Teacher Teaching Innovative Way

10th,12th పరీక్షల్లో 65లక్షల మంది విద్యార్థులు ఫెయిల్- స్టేట్ బోర్డుల్లోనే ఎక్కువ! - Board Exams Failure Rate

CBSE Internal Assessment Exam Result in AP : విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా, ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీబీఎస్‌ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశలో కన్పిస్తున్నాయి. గతంలో నాటి సీఎం జగన్‌ హడావిడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యవసానాలకు ఓ తరం స్టూడెంట్స్​ బలి కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

సీబీఎస్‌ఈ అమలవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల సామర్థ్యాలను అంచనా వేసేందుకు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మదింపు ఎగ్జామ్స్​ నిర్వహించింది. ఇప్పటివరకు బోధించిన సిలబస్‌ నుంచి 50 మల్టిపుల్​ ఛాయిస్ ప్రశ్నలకు 50 మార్కుల చొప్పున కేటాయించారు. దీన్నే 100 మార్కులకు లెక్కకట్టారు. ఇందుకు 80,000ల ట్యాబ్‌లు వినియోగించారు. మొత్తం 77,478 మంది విద్యార్థులు ఈ పరీక్షలు​ రాశారు.

అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు : వారిలో ఇంగ్లిషులో 59,518 (76.81 %), గణితంలో 56,213 (72.55 %), సామాన్య శాస్త్రంలో 49,410 (63.77 %), సోషల్​ స్టడీస్​లో 48,766 (62.94 %) మంది ఫెయిల్‌ అయ్యారు. ఏ సబ్జెక్టులోనూ కనీసం సగం మంది పాస్​ కాలేదు. ఈ రిజల్ట్స్​ను చూసి అధికారులు విస్మయానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఈ ఏడాది 1000 పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలోనే పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే తాజా మదింపు ఫలితాలే జరగబోయే పబ్లిక్‌ పరీక్షల్లోనూ పునరావృతమైతే పరిస్థితి ఏంటని వారు ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో? : సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాసే స్టూడెంట్స్​కు 20 ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయి. ఇవి ఆయా పాఠశాలల టీచర్లు వేస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ సుమారు 20 మార్కులు వేయొచ్చని, మరో 20 మార్కులు అదనంగా తెచ్చుకుంటే పాస్‌ అయిపోతారంటూ గత సర్కార్ ఆలోచించిందని అధికారులు ఇటీవల సమీక్షలో లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. వాస్తవానికి విద్యార్థులందరికీ అంతర్గత మార్కులు గరిష్ఠంగా 20 మార్కులు వేయడానికి నిబంధనలు ఒప్పుకోవని కూడా వారే మంత్రికి తెలిపారు.

అంతా విన్న మంత్రి లోకేశ్‌, ఇది విద్యార్థుల భవిష్యత్​కు సంబంధించిన విషయమని, ఇలాంటి వాటిని తాను అంగీకరించనన్నారు. సీబీఎస్‌ఈ పరీక్షలు రాసి, విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్‌ అయితే, అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వారు ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతి నిర్ణయమూ లోతుగా ఆలోచించి తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు.

ప్రణాళిక లేకుండా సీబీఎస్​ఈని రుద్దిన పర్యవసానం : ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు స్టేట్‌ విధానంలో పబ్లిక్‌ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని అధికారులు కోరుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయులు కూడా టీచింగ్​లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటికి తోడు తాజాగా ఇంటర్నల్​ ఎగ్జామ్స్​ రిజల్ట్స్​ విద్యాశాఖను నివ్వెరపరిచాయి.

మొత్తంగా సీబీఎస్‌ఈ పరీక్షా విధానంలోకి మారేముందే ఉపాధ్యాయులకు ప్రోపర్​ ట్రైనింగ్ ఇవాల్సి ఉండేదని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డట్లు సమాచారం. దీంతో పాటు విద్యార్థులకు దిగువస్థాయి తరగతుల నుంచే కెపాసిటీ బిల్డింగ్‌పై తగిన కసరత్తు చేసి ఉండాల్సిందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ ఏడాదికిగానూ సీబీఎస్‌ఈ పరీక్షా విధానం లేనట్టేనని తెలుస్తోంది. సీబీఎస్‌ఈలోకి మారిన వెయ్యి పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు స్టేట్​ బోర్డు పరీక్షలే నిర్వహించే అవకాశం ఉంది.

విద్యార్థుల్లో కలవరపాటు : రాష్ట్ర బోర్డు పరీక్షలకు, సీబీఎస్‌ఈ పరీక్షా విధానానికి తేడా ఉంటుంది. ఉపాధ్యాయులు ఈ విధానంలో బోధించాలంటే కావల్సిన శిక్షణ పొంది ఉండాలి. విద్యార్థులను ఫౌండేషన్‌ లెవల్​ నుంచే సన్నద్ధం చేయాలి. గత వైఎస్సార్సీపీ సర్కార్ కసరత్తు లేకుండా ఒకేసారి 1-6 తరగతులను ఇంగ్లీశ్​ మీడియంలోకి మార్చింది. అదే సమయంలో 1000 పాఠశాలలకు సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు తీసుకుంది. దీని ప్రకారం ఈ సంవత్సరం ఆయా బడుల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులందరూ సీబీఎస్‌ఈ విధానంలోనే ఎగ్జామ్స్​ రాయాల్సి ఉంది.

'ప్రైవేట్ పాఠశాల వద్దు సర్కారు బడి ముద్దు' - వినూత్నంగా విద్యాబుద్దులు నేర్పుతున్న ఉపాధ్యాయుడు - Teacher Teaching Innovative Way

10th,12th పరీక్షల్లో 65లక్షల మంది విద్యార్థులు ఫెయిల్- స్టేట్ బోర్డుల్లోనే ఎక్కువ! - Board Exams Failure Rate

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.