ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ- తమ సమస్యలపైనా దృష్టి పెట్టాలంటున్న లారీ యజమానులు - Lorry Association Permit Issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 4:46 PM IST

Lorry Owners Association Permits Issue: తెలుగు రాష్ట్రాల సీఎం ల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదేళ్లుగా విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై ఇరు ముఖ్యమంత్రులు దృష్టి పెట్టాలనే విజ్ఞప్తులు మిన్నంటుతున్నాయి. తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో పదేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నామని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Lorry Owners Association Permits Issue
Lorry Owners Association Permits Issue (ETV Bharat)

Lorry Owners Association Permits Issue : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రాంతాల సరకు రవాణా వాహనాలు పైసా పన్ను లేకుండా సరకు తరలించేవి. రోజూ వేలాది సరకు రవాణా వాహనాలు మూడు ప్రాంతాల మధ్య తిరుగుతూ రవాణా చేసేవి. ఫలితంగా లారీ యజమానులకు, రైతులు, వ్యాపారులకూ లాభాల పంట పండేది.

Lorry Owners Permit Problems : రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉచిత రాకపోకలకు తెరపడుతుందని, ఇది తమకు తీవ్ర నష్టం కల్గిస్తుందని ఏపీ, తెలంగాణలోని లారీ యజమానులు సైతం అప్పట్లో ఆందోళనకు దిగారు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానాన్ని రెండు రాష్ట్రాలూ అమలు చేయాలని ఆదేశించింది. విభజన చట్టంలోనూ ఈ అంశాన్ని చేర్చింది. నామ మాత్రపు ఖర్చుతో సరకు రవాణా వాహనాలు తిప్పుకునే అవకాశం కల్పించాలని సూచించింది. దీనివల్ల తమకు కష్టాలు ఉండవని రెండు రాష్ట్రాల్లోని లారీ యజమానులు భావించారు.

'మీరే మమ్మల్ని గట్టెక్కించాలి'- మంత్రిని కలిసిన లారీ యజమానుల సంఘం - LORRY OWNERS MEET MINISTER

రాష్ట్ర విభజన చేసి పదేళ్లయినా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ ప్రారంభానికి నోచుకోలేదు. తొలి ఐదేళ్లు చంద్రబాబు ప్రయత్నించినా అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డగా తర్వాత ఐదేళ్లు తెలంగాణ సర్కారు సానుకూలత తెలిపినా ఏపీలోని జగన్ సర్కారు మోకాలడ్డింది. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానాన్ని 2 రాష్ట్రాలూ అమలు చేయాలని పదేళ్లుగా వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నది లారీ యజమానుల ఆవేదన.

కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లతో ఇరు రాష్ట్రాల్లోని వేలమంది లారీ యజమానులకే కాదు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకీ ఆదాయం పెరుగుతుందని లారీ ఓనర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ , తెలంగాణ మధ్య తిరిగేందుకు ఒక్కో లారి ఏడాదికి 16500 చెల్లించి నేషనల్ పర్మిట్లు తీసుకుంటున్నామని అంటున్నారు. నేషనల్ పర్మిట్లు కన్నా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌ ద్వారా 2 రాష్ట్రాలకు రాబడి వస్తుందని అంటున్నారు.

పర్మిట్ల జారీపై చంద్రబాబు సానుకూలంగా ఉండటం, ఈ నెల 6 న తెలంగాణ సీఎంతో ఆయన సమావేశం కానుండంతో లారీ యజమానుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి పర్మిట్లు జారీ చేయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం చంద్రబాబు తమ కష్టాలు తీర్చాలని, వెంటనే కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేసేలా ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీతో సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు కొంత ఊరట వస్తుందని, పదేళ్ల పోరాటం ఫలిస్తుందని లారీ యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డీజిల్‌ రేట్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి : లారీ అసోసియేషన్ ప్రతినిధులు - Lorry Unions met Transport Minister

Lorry Owners Association Permits Issue : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ప్రాంతాల సరకు రవాణా వాహనాలు పైసా పన్ను లేకుండా సరకు తరలించేవి. రోజూ వేలాది సరకు రవాణా వాహనాలు మూడు ప్రాంతాల మధ్య తిరుగుతూ రవాణా చేసేవి. ఫలితంగా లారీ యజమానులకు, రైతులు, వ్యాపారులకూ లాభాల పంట పండేది.

Lorry Owners Permit Problems : రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉచిత రాకపోకలకు తెరపడుతుందని, ఇది తమకు తీవ్ర నష్టం కల్గిస్తుందని ఏపీ, తెలంగాణలోని లారీ యజమానులు సైతం అప్పట్లో ఆందోళనకు దిగారు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానాన్ని రెండు రాష్ట్రాలూ అమలు చేయాలని ఆదేశించింది. విభజన చట్టంలోనూ ఈ అంశాన్ని చేర్చింది. నామ మాత్రపు ఖర్చుతో సరకు రవాణా వాహనాలు తిప్పుకునే అవకాశం కల్పించాలని సూచించింది. దీనివల్ల తమకు కష్టాలు ఉండవని రెండు రాష్ట్రాల్లోని లారీ యజమానులు భావించారు.

'మీరే మమ్మల్ని గట్టెక్కించాలి'- మంత్రిని కలిసిన లారీ యజమానుల సంఘం - LORRY OWNERS MEET MINISTER

రాష్ట్ర విభజన చేసి పదేళ్లయినా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ ప్రారంభానికి నోచుకోలేదు. తొలి ఐదేళ్లు చంద్రబాబు ప్రయత్నించినా అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డగా తర్వాత ఐదేళ్లు తెలంగాణ సర్కారు సానుకూలత తెలిపినా ఏపీలోని జగన్ సర్కారు మోకాలడ్డింది. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ విధానాన్ని 2 రాష్ట్రాలూ అమలు చేయాలని పదేళ్లుగా వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నది లారీ యజమానుల ఆవేదన.

కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లతో ఇరు రాష్ట్రాల్లోని వేలమంది లారీ యజమానులకే కాదు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకీ ఆదాయం పెరుగుతుందని లారీ ఓనర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీ , తెలంగాణ మధ్య తిరిగేందుకు ఒక్కో లారి ఏడాదికి 16500 చెల్లించి నేషనల్ పర్మిట్లు తీసుకుంటున్నామని అంటున్నారు. నేషనల్ పర్మిట్లు కన్నా కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌ ద్వారా 2 రాష్ట్రాలకు రాబడి వస్తుందని అంటున్నారు.

పర్మిట్ల జారీపై చంద్రబాబు సానుకూలంగా ఉండటం, ఈ నెల 6 న తెలంగాణ సీఎంతో ఆయన సమావేశం కానుండంతో లారీ యజమానుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించి పర్మిట్లు జారీ చేయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సీఎం చంద్రబాబు తమ కష్టాలు తీర్చాలని, వెంటనే కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేసేలా ఈ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాలని లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీతో సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు కొంత ఊరట వస్తుందని, పదేళ్ల పోరాటం ఫలిస్తుందని లారీ యజమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డీజిల్‌ రేట్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకురండి : లారీ అసోసియేషన్ ప్రతినిధులు - Lorry Unions met Transport Minister

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.