ETV Bharat / state

జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల - 100 పర్సంటైల్​తో సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 2:18 PM IST

JEE Mains Results Released : జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 23 మందికి వంద పర్సంటైల్ వచ్చినట్లు ఎన్​టీఏ పేర్కొంది. వీరిలో 10 మంది ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.

Etv Bharat
Etv Bharat

JEE Mains Results Released : జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 23 మందికి వంద పర్సంటైల్ రాగా, వీరిలో 10 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం విశేషం. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించినట్టు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(NTA) స్ఫష్టం చేసింది. తెలంగాణ నుంచి రిషీ శేఖర్ శుక్లా, రోషన్ సాయి పబ్బ, ముత్తవరపు అనూప్, హందేకర్ దివిత్, వెంకట సాయి తేజ మాదినేని, శ్రీయాసాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేశ్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించారు. ఏపీ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్​సైట్​లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని ఎన్​టీఏ పేర్కొంది. జేఈఈ మెయిన్స్​కి సంబంధించిన కీ సోమవారం విడుదల కాగా, తాజాగా ఎన్​టీఏ ఫలితాలను వెల్లడించిది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగిన సెషన్- 1 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల 70వేల 36మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక జేఈఈ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్టు ఎన్​టీఏ ప్రకటించింది. ఫలితాలకు ఈ లింక్​ను (https://jeemain.nta.ac.in/) క్లిక్​ చేయండి.

JEE Mains Results Released : జేఈఈ మెయిన్స్ సెషన్-1 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 23 మందికి వంద పర్సంటైల్ రాగా, వీరిలో 10 మంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం విశేషం. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి ముగ్గురు విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించినట్టు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ(NTA) స్ఫష్టం చేసింది. తెలంగాణ నుంచి రిషీ శేఖర్ శుక్లా, రోషన్ సాయి పబ్బ, ముత్తవరపు అనూప్, హందేకర్ దివిత్, వెంకట సాయి తేజ మాదినేని, శ్రీయాసాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేశ్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించారు. ఏపీ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తిక్, అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించిన వారిలో ఉన్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్​సైట్​లో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని ఎన్​టీఏ పేర్కొంది. జేఈఈ మెయిన్స్​కి సంబంధించిన కీ సోమవారం విడుదల కాగా, తాజాగా ఎన్​టీఏ ఫలితాలను వెల్లడించిది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగిన సెషన్- 1 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల 70వేల 36మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక జేఈఈ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్టు ఎన్​టీఏ ప్రకటించింది. ఫలితాలకు ఈ లింక్​ను (https://jeemain.nta.ac.in/) క్లిక్​ చేయండి.

Top Entrance Exams 2024 Schedule : దేశంలో 2024లో జరిగే టాప్ ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ ఇవే.. మీ పరీక్ష ఎప్పుడో చూసుకోండి..!

టీఎస్ లాసెట్, ఈసెట్2024 షెడ్యూల్​ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.