ETV Bharat / state

నాన్నా.. హాస్టల్లో ఉండలేనంటూ తిరిగిరాని లోకాలకు - Student Died Electric Shock in Hyd

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 4:52 PM IST

Updated : Jun 22, 2024, 5:52 PM IST

Inter Student Died Electric Shock in Hyderabad : నాన్నా హాస్టల్​లో ఉండలేకపోతున్నా. ఇంటికి వచ్చేస్తా తీసుకెళ్లండని కుమారుడు ఆ తల్లిదండ్రులతో ప్రాధేయపడ్డాడు. సరే అలాగే వద్దువులే. మరో రెండు రోజులు చూడు. అప్పుడూ బాగోకపోతే వచ్చెయ్​ అని వారు చెప్పారు. అంతలోనే విగతా జీవిగా పడి ఉన్న పుత్రుడిన చూసి వారు తల్లడిల్లిపోయారు. ఈ ఘటన తెలంగాణలోని హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది.

Inter Student Died Electric Shock in Hyderabad
Inter Student Died Electric Shock in Hyderabad (ETV Bharat)

Student Died Due to Electric Shock at Hostel in Telangana : ఆ యువకుడు పదో తరగతి పాసయ్యాడు. ఇంటర్​ చదువుల కోసమని చెప్పి కుమారుడిని తల్లిదండ్రులు కార్పొరేట్​ కళాశాలలో జాయిన్​ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే తాను అక్కడ ఉండలేనంటూ అమ్మానాన్నల వద్ద బోరుమన్నాడు. అయితే మరో రెండు రోజులు చూడాలని, అప్పటికీ కాలేజీ నచ్చకపోతే తామే వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. అప్పటి వరకు ఆగని ఆ విద్యార్థి, ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని హాస్టల్​ ప్రహరీ గోడ దూకే క్రమంలో విద్యుత్​ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad Inter Student Died : వివరాల్లోకి వెళ్తే ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కర్రీ విజయ్​కుమార్​, చాముండేశ్వరి దంపతులు హైదరాబాద్​ నగరానికి వచ్చి ఈస్ట్ ​మారేడుపల్లిలోని టీచర్స్​ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. కుమారుడు గిరీష్​​కుమార్​ అరవంత్​ పదో తరగతి పూర్తి కావడంతో ఈ నెల 12న హయత్​నగర్​ సమీపంలోని కోహెడ నారాయణ రెసిడెన్షియల్​ జూనియర్​ కళాశాలలో ఇంటర్​ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు.

ఈ నెల 16న ఆదివారం గిరీష్​కుమార్​ అమ్మానాన్న, అక్క కలిసి హాస్టల్​కు వెళ్లాడు. తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని వారితో చెప్పాడు. దీంతో ఆ తల్లిదండ్రులు మరో రెండు రోజులు చూడాలని, నచ్చకపోతే తీసుకెళ్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో హాస్టల్​లో ఉండడం ఇష్టం లేని గిరీష్​ కుమార్​, ఈ నెల 19న బుధవారం అర్ధరాత్రి తర్వాత 1:52 గంటల సమయంలో హాస్టల్​ భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దిగాడు. అక్కడ కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఉంది. దానిపై ఫెన్సింగ్​ ఉంది.

గోడ ఎక్కే క్రమంలో విద్యుత్​ తీగలు తగిలి​ షాక్​ : కళాశాల ప్రాంగణంలోని గేటుకు ఎడమవైపున ట్రాన్స్​ఫార్మర్​ పక్కన ఉన్న ప్రహరీ ఎక్కి కిందకు దిగేందుకు గిరీష్​కుమార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్​ తీగలు తగిలి, కరెంట్ షాక్​కు గురయ్యాడు. అక్కడే కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో గిరీష్​ కనిపించడం లేదంటూ విద్యార్థి తల్లిదండ్రులకు జూన్​ 20న హాస్టల్​ సిబ్బంది ఫోన్​ చేసి చెప్పారు. దీంతో వారు కళాశాలకు చేరుకుని అన్ని చోట్లా ఆరా తీసినా ప్రయోజనం లేదు.

చివరికి బాలుడి తల్లి హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హాస్టల్​కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా, గిరీష్​ హాస్టల్​ నుంచి కిందకు దిగుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అర్ధరాత్రి కళాశాల ప్రాంగణం ప్రహరీ వెంబడి గాలిస్తుండగా విద్యార్థి​ మృతదేహం చెట్ల పొదల్లో కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయారని ఆరోపించారు.

ప్రకాశం జిల్లాలో దారుణం - విద్యుత్ షాక్​కు గురై ఉద్యోగి మృతి

పారిశుధ్య విధుల్లో బాలుడు, విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ షాక్ కొట్టి మృతి

Student Died Due to Electric Shock at Hostel in Telangana : ఆ యువకుడు పదో తరగతి పాసయ్యాడు. ఇంటర్​ చదువుల కోసమని చెప్పి కుమారుడిని తల్లిదండ్రులు కార్పొరేట్​ కళాశాలలో జాయిన్​ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే తాను అక్కడ ఉండలేనంటూ అమ్మానాన్నల వద్ద బోరుమన్నాడు. అయితే మరో రెండు రోజులు చూడాలని, అప్పటికీ కాలేజీ నచ్చకపోతే తామే వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. అప్పటి వరకు ఆగని ఆ విద్యార్థి, ఎలాగైనా ఇంటికి వెళ్లిపోవాలని హాస్టల్​ ప్రహరీ గోడ దూకే క్రమంలో విద్యుత్​ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని హయత్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Hyderabad Inter Student Died : వివరాల్లోకి వెళ్తే ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కర్రీ విజయ్​కుమార్​, చాముండేశ్వరి దంపతులు హైదరాబాద్​ నగరానికి వచ్చి ఈస్ట్ ​మారేడుపల్లిలోని టీచర్స్​ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. కుమారుడు గిరీష్​​కుమార్​ అరవంత్​ పదో తరగతి పూర్తి కావడంతో ఈ నెల 12న హయత్​నగర్​ సమీపంలోని కోహెడ నారాయణ రెసిడెన్షియల్​ జూనియర్​ కళాశాలలో ఇంటర్​ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు.

ఈ నెల 16న ఆదివారం గిరీష్​కుమార్​ అమ్మానాన్న, అక్క కలిసి హాస్టల్​కు వెళ్లాడు. తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని వారితో చెప్పాడు. దీంతో ఆ తల్లిదండ్రులు మరో రెండు రోజులు చూడాలని, నచ్చకపోతే తీసుకెళ్తామని చెప్పి వెళ్లిపోయారు. ఈ క్రమంలో హాస్టల్​లో ఉండడం ఇష్టం లేని గిరీష్​ కుమార్​, ఈ నెల 19న బుధవారం అర్ధరాత్రి తర్వాత 1:52 గంటల సమయంలో హాస్టల్​ భవనం ఐదో అంతస్తు నుంచి కిందకు దిగాడు. అక్కడ కళాశాల ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఉంది. దానిపై ఫెన్సింగ్​ ఉంది.

గోడ ఎక్కే క్రమంలో విద్యుత్​ తీగలు తగిలి​ షాక్​ : కళాశాల ప్రాంగణంలోని గేటుకు ఎడమవైపున ట్రాన్స్​ఫార్మర్​ పక్కన ఉన్న ప్రహరీ ఎక్కి కిందకు దిగేందుకు గిరీష్​కుమార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్​ తీగలు తగిలి, కరెంట్ షాక్​కు గురయ్యాడు. అక్కడే కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో గిరీష్​ కనిపించడం లేదంటూ విద్యార్థి తల్లిదండ్రులకు జూన్​ 20న హాస్టల్​ సిబ్బంది ఫోన్​ చేసి చెప్పారు. దీంతో వారు కళాశాలకు చేరుకుని అన్ని చోట్లా ఆరా తీసినా ప్రయోజనం లేదు.

చివరికి బాలుడి తల్లి హయత్​నగర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హాస్టల్​కు చేరుకున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా, గిరీష్​ హాస్టల్​ నుంచి కిందకు దిగుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అర్ధరాత్రి కళాశాల ప్రాంగణం ప్రహరీ వెంబడి గాలిస్తుండగా విద్యార్థి​ మృతదేహం చెట్ల పొదల్లో కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయారని ఆరోపించారు.

ప్రకాశం జిల్లాలో దారుణం - విద్యుత్ షాక్​కు గురై ఉద్యోగి మృతి

పారిశుధ్య విధుల్లో బాలుడు, విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ షాక్ కొట్టి మృతి

Last Updated : Jun 22, 2024, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.