ETV Bharat / state

పెద్దిరెడ్డి సేవలో ఏపీఎండీసీ మాజీ ఎండీ - అడ్డగోలుగా గ్రానైట్ ​లీజు మంజూరు - Mining lease irregularities

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 10:37 AM IST

Inquiry into Award of Sand Contracts and Mining Leases in AP : గత ప్రభుత్వ హయాంలో నాయకులు భూములు ఆక్రమించినా, ఇసుక దోపిడీ చేసినా, అక్రమ గ్రానైట్​​ తవ్వకాలు చేపట్టినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. కొంత మంది అధికారులు అయితే ఒక అడుగు ముందుకు వేసి వారు చేసిన పాపాల్లో భాగం పంచుకున్నారు. అలాంటి కోవకు చెందిన వారే ఏపీఎండీసీ సంస్థ మాజీ ఎండీ వెంకటరెడ్డి.

MINING LEASE IRREGULARITIES
MINING LEASE IRREGULARITIES (ETV Bharat)

Inquiry into Award of Sand Contracts and Mining Leases in AP : ఏ అధికారైనా తాను పని చేసే సంస్థకు మేలు చేయాలని చూస్తారు. కానీ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి గనుల శాఖ, ఏపీఎండీసీల (APMDC) బాస్‌గా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం వైఎస్సార్సీపీ పెద్దల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేశారు. చిత్తూరు జిల్లాలో గ్రానైట్‌ లీజుల విషయంలో ఏపీఎండీసీకి నష్టం జరుగుతుందని తెలిసినా సరే, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులకు మేలు చేసేందుకు వెంకటరెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్లు తాజాగా బయటపడింది.

అడ్డగోలుగా లీజు మంజూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఈశ్వరాపురంలో పాత సర్వే నంబరు 6లో ఉన్న కొండలో కలర్‌ గ్రానైట్‌ నిల్వలున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన వారితోపాటు, తమిళనాడుకి చెందినవారు 28 మంది అక్కడ లీజుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ఇక్కడ 43.450 హెక్టార్లను రిజర్వ్‌ చేయాలంటూ 2017, మే 16న ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే లీజు కేటాయింపు అనే పద్ధతి ఉండేది. ఇతర దరఖాస్తులను కాదని, ఏపీఎండీసీకి (APMDC) లీజులు కేటాయించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కూడా ఉండేది. 2019లో జగన్‌ సర్కార్​ అధికారంలోకి రావడంతో సీను మొత్తం మారిపోయింది.

పులుల సంరక్షణ చర్యలపై పవన్ కల్యాణ్ సమీక్ష- అటవీ అధికారులకు పలు సూచనలు - PK Review on Tiger Conservation

అడ్డగోలుగా పెద్దిరెడ్డి బంధువులకు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రి (Minister of Mines) అయ్యాక ఈశ్వరాపురంలోని కలర్‌ గ్రానైట్‌పై ఆయన కన్నుపడింది. దాని కోసం ఆయన తన బంధువుల పేరిట 2019 నవంబరులో దరఖాస్తు చేయించారు. తర్వాత అక్కడ లీజుల కోసం ఏపీఎండీసీ (APMDC) దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించేలా ఒత్తిడి చేశారు. దీంతో 2020లో ఏపీఎండీసీ సంస్థ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. ఏపీలో ఎండీసీ ఎక్కడెక్కడ లీజుల కోసం దరఖాస్తు చేసిందో జాబితా తయారు చేయించారు. ఇతరులు ముందే దరఖాస్తు చేసిన లీజుల నుంచి ఏపీఎండీసీ వైదొలగాలని అంటూ హుకుం జారీ చేశారు.

గుడ్​న్యూస్ చెప్పిన ప్రభుత్వం - వారందరికీ గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం - CM Chandrababu Review on Housing

దరఖాస్తుల ఉపసంహరణకు ఆదేశాలు : ఈశ్వరాపురంలో అప్పటికే కొన్నేళ్లుగా ఇతరుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అక్కడ ఏపీఎండీసీ లీజుల కోసం వేసిన దరఖాస్తులను ఉపసంహరించాలని ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ 2020 నవంబరు 4న (4-11-2024) దరఖాస్తును ఉపసంహరించుకుంది. అనంతరం అక్కడ గతంలో దరఖాస్తు చేసుకున్న 28 మందిలో ఎవరికీ లీజులు కేటాయించకుండా తెలివితేటలు ప్రదర్శించారు. పాత దరఖాస్తుదారులు అందరినీ కాదని పెద్దిరెడ్డి బంధువులకు ఏకంగా 5 గ్రానైట్​లను లీజులు కేటాయించారు.

వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయం - పూర్తి కాని జాతీయ విశ్వవిద్యాలయాల నిర్మాణాలు - National Institutes in ap

5 లీజులకు మైనింగ్‌ ప్లాన్‌ : పొన్నలూరు ప్రత్యూష యజమానిగా ఉన్న సుదర్శన్‌ గ్రానైట్స్‌కు (Sudarshan Granites) 4.540 హెక్టార్లు, అమర కమోడిటీస్‌కు (Amara Commodities) 6.553 హెక్టార్లు కేటాయించారు. పొన్నలూరు అమర్‌నాథ్‌రెడ్డి యజమానిగా ఉన్న ఉషశ్రీ కమోడిటీస్‌ అండ్‌ వెంచర్స్‌కు (Ushasree Commodities and Ventures) 3.729 హెక్టార్లు, తిక్కవరపు ప్రభాస్‌కుమార్‌రెడ్డి యజమానిగా ఉన్న అమరమ్‌ కమోడిటీస్‌ అండ్‌ వెంచర్స్‌కు 11.583 హెక్టార్లు, 1.875 హెక్టార్లు కలిపి మొత్తం 5 లీజులు మంజూరు చేశారు. వీళ్లకు కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (Capital investment) కింద ఈ లీజులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మొదట వీరికి లీజుల కేటాయింపునకు వీలుగా లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ (LOI-Letter of Indent) ఇవ్వగానే పాత దరఖాస్తుదారుల్లో కొందరు హైకోర్టులో కేసులు వేశారు. అయినా సరే 5 లీజులకు మైనింగ్‌ ప్లాన్‌ ఆమోదించి, పర్యావరణ అనుమతులిచ్చేసి లీజులు మంజూరు చేసేశారు. ఇదంతా వెంకటరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.

'భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు' - ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ - HC on Nehareddy Petition

పొన్నవోలు కార్తీక్‌రెడ్డికి కట్టబెట్టారు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అదనపు ఏజీగా పని చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కుమారుడు పొన్నవోలు కార్తీక్‌రెడ్డికి అడ్డగోలుగా గ్రానైట్‌ లీజు మంజూరు చేశారు. మదనపల్లి మండలంలోని బండకిందపల్లి వద్ద 2 హెక్టార్లలో కలర్‌ గ్రానైట్‌ లీజు (Color Granite Lease) మంజూరు చేయాలంటూ షాన్వాజ్‌ రేష్మా నవాజ్‌ గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండగానే పొన్నవోలు కార్తీక్‌రెడ్డి అదే విస్తీర్ణంలో లీజు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అడ్డగోలుగా ఆయనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. దీనిపై పాత దరఖాస్తుదారులు హైకోర్టును ఆశ్రయించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ డ్రగ్స్ కంటెయినర్​ కేసు - కన్పించని పురోగతి? - Visakhapatnam Drugs Container Case

Inquiry into Award of Sand Contracts and Mining Leases in AP : ఏ అధికారైనా తాను పని చేసే సంస్థకు మేలు చేయాలని చూస్తారు. కానీ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి వచ్చి గనుల శాఖ, ఏపీఎండీసీల (APMDC) బాస్‌గా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం వైఎస్సార్సీపీ పెద్దల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేశారు. చిత్తూరు జిల్లాలో గ్రానైట్‌ లీజుల విషయంలో ఏపీఎండీసీకి నష్టం జరుగుతుందని తెలిసినా సరే, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులకు మేలు చేసేందుకు వెంకటరెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్లు తాజాగా బయటపడింది.

అడ్డగోలుగా లీజు మంజూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఈశ్వరాపురంలో పాత సర్వే నంబరు 6లో ఉన్న కొండలో కలర్‌ గ్రానైట్‌ నిల్వలున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన వారితోపాటు, తమిళనాడుకి చెందినవారు 28 మంది అక్కడ లీజుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కూడా ఇక్కడ 43.450 హెక్టార్లను రిజర్వ్‌ చేయాలంటూ 2017, మే 16న ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే లీజు కేటాయింపు అనే పద్ధతి ఉండేది. ఇతర దరఖాస్తులను కాదని, ఏపీఎండీసీకి (APMDC) లీజులు కేటాయించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కూడా ఉండేది. 2019లో జగన్‌ సర్కార్​ అధికారంలోకి రావడంతో సీను మొత్తం మారిపోయింది.

పులుల సంరక్షణ చర్యలపై పవన్ కల్యాణ్ సమీక్ష- అటవీ అధికారులకు పలు సూచనలు - PK Review on Tiger Conservation

అడ్డగోలుగా పెద్దిరెడ్డి బంధువులకు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రి (Minister of Mines) అయ్యాక ఈశ్వరాపురంలోని కలర్‌ గ్రానైట్‌పై ఆయన కన్నుపడింది. దాని కోసం ఆయన తన బంధువుల పేరిట 2019 నవంబరులో దరఖాస్తు చేయించారు. తర్వాత అక్కడ లీజుల కోసం ఏపీఎండీసీ (APMDC) దాఖలు చేసిన దరఖాస్తును ఉపసంహరించేలా ఒత్తిడి చేశారు. దీంతో 2020లో ఏపీఎండీసీ సంస్థ ఇన్‌ఛార్జ్‌ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. ఏపీలో ఎండీసీ ఎక్కడెక్కడ లీజుల కోసం దరఖాస్తు చేసిందో జాబితా తయారు చేయించారు. ఇతరులు ముందే దరఖాస్తు చేసిన లీజుల నుంచి ఏపీఎండీసీ వైదొలగాలని అంటూ హుకుం జారీ చేశారు.

గుడ్​న్యూస్ చెప్పిన ప్రభుత్వం - వారందరికీ గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం - CM Chandrababu Review on Housing

దరఖాస్తుల ఉపసంహరణకు ఆదేశాలు : ఈశ్వరాపురంలో అప్పటికే కొన్నేళ్లుగా ఇతరుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అక్కడ ఏపీఎండీసీ లీజుల కోసం వేసిన దరఖాస్తులను ఉపసంహరించాలని ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ 2020 నవంబరు 4న (4-11-2024) దరఖాస్తును ఉపసంహరించుకుంది. అనంతరం అక్కడ గతంలో దరఖాస్తు చేసుకున్న 28 మందిలో ఎవరికీ లీజులు కేటాయించకుండా తెలివితేటలు ప్రదర్శించారు. పాత దరఖాస్తుదారులు అందరినీ కాదని పెద్దిరెడ్డి బంధువులకు ఏకంగా 5 గ్రానైట్​లను లీజులు కేటాయించారు.

వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయం - పూర్తి కాని జాతీయ విశ్వవిద్యాలయాల నిర్మాణాలు - National Institutes in ap

5 లీజులకు మైనింగ్‌ ప్లాన్‌ : పొన్నలూరు ప్రత్యూష యజమానిగా ఉన్న సుదర్శన్‌ గ్రానైట్స్‌కు (Sudarshan Granites) 4.540 హెక్టార్లు, అమర కమోడిటీస్‌కు (Amara Commodities) 6.553 హెక్టార్లు కేటాయించారు. పొన్నలూరు అమర్‌నాథ్‌రెడ్డి యజమానిగా ఉన్న ఉషశ్రీ కమోడిటీస్‌ అండ్‌ వెంచర్స్‌కు (Ushasree Commodities and Ventures) 3.729 హెక్టార్లు, తిక్కవరపు ప్రభాస్‌కుమార్‌రెడ్డి యజమానిగా ఉన్న అమరమ్‌ కమోడిటీస్‌ అండ్‌ వెంచర్స్‌కు 11.583 హెక్టార్లు, 1.875 హెక్టార్లు కలిపి మొత్తం 5 లీజులు మంజూరు చేశారు. వీళ్లకు కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (Capital investment) కింద ఈ లీజులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మొదట వీరికి లీజుల కేటాయింపునకు వీలుగా లెటర్‌ ఆఫ్‌ ఇండెంట్‌ (LOI-Letter of Indent) ఇవ్వగానే పాత దరఖాస్తుదారుల్లో కొందరు హైకోర్టులో కేసులు వేశారు. అయినా సరే 5 లీజులకు మైనింగ్‌ ప్లాన్‌ ఆమోదించి, పర్యావరణ అనుమతులిచ్చేసి లీజులు మంజూరు చేసేశారు. ఇదంతా వెంకటరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందనే రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు.

'భీమిలి బీచ్ వద్ద అక్రమ నిర్మాణాలు' - ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ - HC on Nehareddy Petition

పొన్నవోలు కార్తీక్‌రెడ్డికి కట్టబెట్టారు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అదనపు ఏజీగా పని చేసిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కుమారుడు పొన్నవోలు కార్తీక్‌రెడ్డికి అడ్డగోలుగా గ్రానైట్‌ లీజు మంజూరు చేశారు. మదనపల్లి మండలంలోని బండకిందపల్లి వద్ద 2 హెక్టార్లలో కలర్‌ గ్రానైట్‌ లీజు (Color Granite Lease) మంజూరు చేయాలంటూ షాన్వాజ్‌ రేష్మా నవాజ్‌ గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇది పెండింగ్‌లో ఉండగానే పొన్నవోలు కార్తీక్‌రెడ్డి అదే విస్తీర్ణంలో లీజు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అడ్డగోలుగా ఆయనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లీజు మంజూరు చేసింది. దీనిపై పాత దరఖాస్తుదారులు హైకోర్టును ఆశ్రయించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ డ్రగ్స్ కంటెయినర్​ కేసు - కన్పించని పురోగతి? - Visakhapatnam Drugs Container Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.