ETV Bharat / state

రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు! - ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలు - Heavy Rains In Telangana Today

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 11:32 AM IST

Updated : Sep 8, 2024, 12:49 PM IST

Heavy Rains In Telangana Today : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Heavy Rains In Telangana
Heavy Rains In Telangana Today (ETV Bharat)

Heavy Rains In Telangana : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్ధపల్లి, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు సిద్దం అయ్యారు. ఏవైనా వరద సమస్యలు తలెత్తితే వెంటనే సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

తెలంగాణలో రేపు భారీ వర్షాలు : మరోవైపు రేపు కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పరిస్థితుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అల్పపీడనం వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడినట్లు ఐఎండీ సంచాలకులు తెలిపారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తరువాత ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజుల్లో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.

AP Weather Updates : మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జోరువాన పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ! - Heavy Rain Alert to Telangana

రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - ఆ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త! - Heavy Rain Alert to Telangana

Heavy Rains In Telangana : అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.

ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్ధపల్లి, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు సిద్దం అయ్యారు. ఏవైనా వరద సమస్యలు తలెత్తితే వెంటనే సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.

తెలంగాణలో రేపు భారీ వర్షాలు : మరోవైపు రేపు కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పరిస్థితుల ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

అల్పపీడనం వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడినట్లు ఐఎండీ సంచాలకులు తెలిపారు. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. తరువాత ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 3 రోజుల్లో గంగేటిక్ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.

AP Weather Updates : మరోవైపు రుతుపవన ద్రోణి ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో జోరువాన పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వాన కురుస్తోంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నదులు పొంగే ప్రమాదం ఉండటంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ! - Heavy Rain Alert to Telangana

రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - ఆ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త! - Heavy Rain Alert to Telangana

Last Updated : Sep 8, 2024, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.