ETV Bharat / state

కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారయత్నం - బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరి అరెస్ట్ - 2 Members Arrested In Rape Case

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 4, 2024, 11:56 AM IST

Updated : Jul 4, 2024, 2:21 PM IST

Police Arrested Two People In Rape Case : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. ఉద్యోగం పేరుతో యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నించారు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది.

Rape Case
Rape Case (ETV Bharat)

2 Members Arrested For Trying To Rape A Young Woman : ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి, అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మియాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి మియాపూర్‌లోని ఓ స్థిరాస్తి సంస్థ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి ఆమెకు పరిచయమయ్యారు. తమ సంస్థలో ఉద్యోగం ఉందంటూ నమ్మించిన వారు, జూన్‌ 30న మియాపూర్‌ రావాలని సూచించారు.

30వ తేదీన యువతి సంస్థ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఉన్న ఇద్దరు సేల్స్‌మెన్‌లు సంగారెడ్డి, జనార్ధన్‌ రెడ్డి యువతిని యాదగిరిగుట్టలోని ఓ స్ధిరాస్తికి సంబంధించిన సమావేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మీటింగ్‌ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి కారులో వస్తుండగా, వారిద్దరు కారును ఓ నిర్మానుష్య ప్రాంతంలో నిలిపివేశారు. కారు మరమ్మతు కారణంగా నిలిపివేశామని ఆమెకు చెప్పారు. అనంతరం ఆమెకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చారు. మత్తులో ఆమె అచేతనంగా పడి ఉండటంతో, ఇదే అదనుగా యువతిని వివస్త్రను చేసి, అత్యాచారయత్నం చేశారు. అనంతరం యువతిని తిరిగి మియాపూర్‌ వద్ద వదిలిపెట్టి వారు వెళ్లిపోయారు.
తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం

జులై 1న బాధితురాలు అస్వస్థతకు గురి కావడంతో 2న ఉప్పల్‌ వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తర్వాత జీరో ఎఫ్‌ఐఆర్​ను మియాపూర్‌ ఠాణాకు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు జనార్దన్‌ రెడ్డి, సంగారెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

'ఏపీకి చెందిన ఓ యువతి మియాపూర్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో జున్ 30న ఉద్యోగంలో చేరింది. కంపెనీలో పని చేస్తున్న సంగారెడ్డి, జనార్దన్‌ రెడ్డిలు సైట్ చూడటానికి యువతిని యాదాద్రికి తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా అక్కడ ఆమెపై అత్యాచారయత్నం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం'- మియాపూర్‌ సీఐ

స్పందించిన జాతీయ మహిళా కమిషన్: మియాపూర్ లో యువతి పై అత్యాచారయత్నం వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీకి లేఖను పంపింది. బాధితురాలికి మెరుగైన వైద్యపరిక్షలు ఉచితంగా అందించాలని పేర్కొంది. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కోరింది.

బాత్రూమ్​లో ప్రసవించిన రేప్​ బాధితురాలు- కవర్​లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన యువతి - Newborn Found Dead on Road

2 Members Arrested For Trying To Rape A Young Woman : ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి, అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన మియాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా నగరానికి వచ్చి ఉప్పల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి మియాపూర్‌లోని ఓ స్థిరాస్తి సంస్థ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డి ఆమెకు పరిచయమయ్యారు. తమ సంస్థలో ఉద్యోగం ఉందంటూ నమ్మించిన వారు, జూన్‌ 30న మియాపూర్‌ రావాలని సూచించారు.

30వ తేదీన యువతి సంస్థ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఉన్న ఇద్దరు సేల్స్‌మెన్‌లు సంగారెడ్డి, జనార్ధన్‌ రెడ్డి యువతిని యాదగిరిగుట్టలోని ఓ స్ధిరాస్తికి సంబంధించిన సమావేశానికి తీసుకువెళ్లారు. అక్కడ మీటింగ్‌ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి కారులో వస్తుండగా, వారిద్దరు కారును ఓ నిర్మానుష్య ప్రాంతంలో నిలిపివేశారు. కారు మరమ్మతు కారణంగా నిలిపివేశామని ఆమెకు చెప్పారు. అనంతరం ఆమెకు మత్తు మందు కలిపిన శీతల పానీయం ఇచ్చారు. మత్తులో ఆమె అచేతనంగా పడి ఉండటంతో, ఇదే అదనుగా యువతిని వివస్త్రను చేసి, అత్యాచారయత్నం చేశారు. అనంతరం యువతిని తిరిగి మియాపూర్‌ వద్ద వదిలిపెట్టి వారు వెళ్లిపోయారు.
తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య - తట్టుకోలేక ప్రియుడి బలవన్మరణం

జులై 1న బాధితురాలు అస్వస్థతకు గురి కావడంతో 2న ఉప్పల్‌ వెళ్లి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తర్వాత జీరో ఎఫ్‌ఐఆర్​ను మియాపూర్‌ ఠాణాకు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు జనార్దన్‌ రెడ్డి, సంగారెడ్డిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

'ఏపీకి చెందిన ఓ యువతి మియాపూర్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలో జున్ 30న ఉద్యోగంలో చేరింది. కంపెనీలో పని చేస్తున్న సంగారెడ్డి, జనార్దన్‌ రెడ్డిలు సైట్ చూడటానికి యువతిని యాదాద్రికి తీసుకెళ్లారు. తిరిగి వస్తుండగా అక్కడ ఆమెపై అత్యాచారయత్నం చేశారు. యువతి ఫిర్యాదు మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం'- మియాపూర్‌ సీఐ

స్పందించిన జాతీయ మహిళా కమిషన్: మియాపూర్ లో యువతి పై అత్యాచారయత్నం వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని డీజీపీకి లేఖను పంపింది. బాధితురాలికి మెరుగైన వైద్యపరిక్షలు ఉచితంగా అందించాలని పేర్కొంది. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కోరింది.

బాత్రూమ్​లో ప్రసవించిన రేప్​ బాధితురాలు- కవర్​లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన యువతి - Newborn Found Dead on Road

Last Updated : Jul 4, 2024, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.