ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు బలైపోయాం - న్యాయం చేయండి - జనసేన కార్యాలయానికి క్యూ కట్టిన బాధితులు - YSRCP VICTIMS IN JANASENA Office

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 10:36 PM IST

Huge Number of YSRCP Victims Came to Janasena Public Grievance : వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు బలైపోయిన బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. రాజధాని పేరు చెప్పి విశాఖ కేంద్రంగా వైఎస్సార్సీపీ నాయకులు సాగించిన భూ దందాలు, అరాచకాలపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

Huge Number of YSRCP Victims Came to Janasena Public Grievance
Huge Number of YSRCP Victims Came to Janasena Public Grievance (ETV Bharat)

Huge Number of YSRCP Victims Came to Janasena Public Grievance : వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు బలైపోయిన బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు, ఆక్రమణలతో మోసపోయామని బాధితులు వాపోయారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్కొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

రాజధాని పేరు చెప్పి విశాఖ కేంద్రంగా వైఎస్సార్సీపీ నాయకులు సాగించిన భూ దందాలు, అరాచకాలపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. విశాఖలో పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు జనసేన నేతలని కోరారు.

జనసేన కార్యాలయానికి పోటెత్తిన వైఎస్సార్సీపీ బాధితులు - Public Grievance at JSP Office

యలమంచిలో వైఎస్సార్సీపీ నాయకులు దాడి నాయుడు, శివ, యల్లపు నాగరాజు, అడారి శీనులు తన భూమిని ఆక్రమించుకున్నారని మల్లిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. పెందుర్తి మండలం పురుషోత్తపురంలో కుటుంబ సభ్యులతో కలసి 1982లో 2500 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశామని తెలిపారు. అయితే గత ప్రభుత్వంలోని వైఎస్సార్సీపీ నాయకుల అండతో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.సీతారామయ్య ఆ స్థాలాన్ని కబ్జా చేసి గోడ నిర్మించారని వాపోయారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాలో తాను కొనుగోలు చేసిన భూమి తనకు రిజిస్ట్రేషన్ కాకుండా స్థానిక వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఉమ్మడి విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన మంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి వాపోయాడు. తనకు న్యాయం చేయాలని జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తన భూమిని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని అచ్యుత రామకోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్‌- పెద్దఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ బాధితులు - Public Grievance

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో సంచలనం సృష్టించిన గొడ్డలి దాడి కేసు బాధిత మహిళ జనసేన కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆస్తుల కోసం తన సోదరుడే తమ కుటుంబ సభ్యుల్ని చంపేందుకు ప్రయత్నించాడని, ప్రస్తుతం జైల్లో ఉన్న అతను బెయిల్​పై వచ్చి చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఎస్.కె. మెహబూబి ఫిర్యాదు చేశారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. వాటన్నింటినీ సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మాకు న్యాయం చేయండి - టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైఎస్సార్సీపీ బాధితులు - TDP Grievance Program

Huge Number of YSRCP Victims Came to Janasena Public Grievance : వైఎస్సార్సీపీ నేతల అక్రమాలకు బలైపోయిన బాధితులు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి వినతులు సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు, ఆక్రమణలతో మోసపోయామని బాధితులు వాపోయారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్కొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు.

రాజధాని పేరు చెప్పి విశాఖ కేంద్రంగా వైఎస్సార్సీపీ నాయకులు సాగించిన భూ దందాలు, అరాచకాలపై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. విశాఖలో పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూములను గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు జనసేన నేతలని కోరారు.

జనసేన కార్యాలయానికి పోటెత్తిన వైఎస్సార్సీపీ బాధితులు - Public Grievance at JSP Office

యలమంచిలో వైఎస్సార్సీపీ నాయకులు దాడి నాయుడు, శివ, యల్లపు నాగరాజు, అడారి శీనులు తన భూమిని ఆక్రమించుకున్నారని మల్లిబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. పెందుర్తి మండలం పురుషోత్తపురంలో కుటుంబ సభ్యులతో కలసి 1982లో 2500 చదరపు గజాల స్థలం కొనుగోలు చేశామని తెలిపారు. అయితే గత ప్రభుత్వంలోని వైఎస్సార్సీపీ నాయకుల అండతో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎం.సీతారామయ్య ఆ స్థాలాన్ని కబ్జా చేసి గోడ నిర్మించారని వాపోయారు.

అలాగే శ్రీకాకుళం జిల్లాలో తాను కొనుగోలు చేసిన భూమి తనకు రిజిస్ట్రేషన్ కాకుండా స్థానిక వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకుంటున్నారని ఉమ్మడి విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన మంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి వాపోయాడు. తనకు న్యాయం చేయాలని జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తన భూమిని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారని అచ్యుత రామకోటయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్‌- పెద్దఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ బాధితులు - Public Grievance

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో సంచలనం సృష్టించిన గొడ్డలి దాడి కేసు బాధిత మహిళ జనసేన కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆస్తుల కోసం తన సోదరుడే తమ కుటుంబ సభ్యుల్ని చంపేందుకు ప్రయత్నించాడని, ప్రస్తుతం జైల్లో ఉన్న అతను బెయిల్​పై వచ్చి చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధిత మహిళ ఎస్.కె. మెహబూబి ఫిర్యాదు చేశారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఫిర్యాదులు స్వీకరించారు. వాటన్నింటినీ సంబంధిత శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మాకు న్యాయం చేయండి - టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైఎస్సార్సీపీ బాధితులు - TDP Grievance Program

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.