ETV Bharat / state

ఏపీలో భానుడి భగభగలు- 268 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు - High Temperature in AP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 8:13 PM IST

High Temperature in AP: ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎండల ధాటికి ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇవాళ అత్యధికంగా పార్వతీపురం జిల్లాలో 45.8° డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 268 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి.

High Temperature in AP
High Temperature in AP

High Temperature in AP: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. నేడు పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 45.8°C డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సుమారుగా 44 °C డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా 268 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం 12 , విజయనగరం 22, పార్వతీపురంమన్యం 13, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 11, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఎన్టీఆర్ 2, పల్నాడు 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎమ్​డీ సూచించింది.

శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3, అనకాపల్లి 6, కాకినాడ 12, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 19, కృష్ణా 13, ఎన్టీఆర్ 14, గుంటూరు 17, పల్నాడు 16, బాపట్ల 12, ప్రకాశం 24, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 11, నంద్యాల 1, వైఎస్సార్ 1, తిరుపతి 7 మండలాల్లో వడగాల్పులు మెుత్తంగా 214 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.


సమ్మర్​ స్పెషల్ హెర్బల్ టీ - తాగితే బోలెడు ప్రయోజనాలు గ్యారెంటీ! - Summer Special Herbal Tea Benefits

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు అల్లూరి సీతారామరాజు జిల్లా యెర్రంపేట, పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 45.8°C, నంద్యాల జిల్లా నందవరం లో 45.6°C, విజయనగరం జిల్లా జామిలో 45.5°C, శ్రీకాకుళం జిల్లా కొవిలం, జిల్లా కొంగలవీడులో 45.4°C, తిరుపతి జిల్లా రేణిగుంట, ప్రకాశం జిల్లా దరిమడుగులో తిరుపతి జిల్లా45.3°C, పల్నాడు జిల్లా ముటుకూరులో 44.9°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, నెల్లూరు జిల్లా కసుమూరులో 44.6°C,కర్నూలు జిల్లా వగరూరు 44.2°C, అనకాపల్లి జిల్లా రావికవతం 44.1°C, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 44 °C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలో 44°Cకు పైగా ఉష్ణోగ్రతల నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం చల్లబడే పానియాలు తీసుకోవరడంతో పాటు, నీడనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

పెరుగుతున్న ఎండలు- అధికారులతో ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్- సమన్వయంతో పనిచేయాలని ఆదేశం - PM Modi On Heat wave Conditions

High Temperature in AP: వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. నేడు పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 45.8°C డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సుమారుగా 44 °C డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా 268 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఏపీ వాతావరణ శాఖ వెల్లడించింది. 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 214 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం 12 , విజయనగరం 22, పార్వతీపురంమన్యం 13, అల్లూరిసీతారామరాజు 4, అనకాపల్లి 11, కాకినాడ 3, తూర్పుగోదావరి 2, ఎన్టీఆర్ 2, పల్నాడు 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎమ్​డీ సూచించింది.

శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3, అనకాపల్లి 6, కాకినాడ 12, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 19, కృష్ణా 13, ఎన్టీఆర్ 14, గుంటూరు 17, పల్నాడు 16, బాపట్ల 12, ప్రకాశం 24, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 11, నంద్యాల 1, వైఎస్సార్ 1, తిరుపతి 7 మండలాల్లో వడగాల్పులు మెుత్తంగా 214 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.


సమ్మర్​ స్పెషల్ హెర్బల్ టీ - తాగితే బోలెడు ప్రయోజనాలు గ్యారెంటీ! - Summer Special Herbal Tea Benefits

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు అల్లూరి సీతారామరాజు జిల్లా యెర్రంపేట, పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 45.8°C, నంద్యాల జిల్లా నందవరం లో 45.6°C, విజయనగరం జిల్లా జామిలో 45.5°C, శ్రీకాకుళం జిల్లా కొవిలం, జిల్లా కొంగలవీడులో 45.4°C, తిరుపతి జిల్లా రేణిగుంట, ప్రకాశం జిల్లా దరిమడుగులో తిరుపతి జిల్లా45.3°C, పల్నాడు జిల్లా ముటుకూరులో 44.9°C, అన్నమయ్య జిల్లా కంబాలకుంట, నెల్లూరు జిల్లా కసుమూరులో 44.6°C,కర్నూలు జిల్లా వగరూరు 44.2°C, అనకాపల్లి జిల్లా రావికవతం 44.1°C, ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 44 °C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాలో 44°Cకు పైగా ఉష్ణోగ్రతల నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరం చల్లబడే పానియాలు తీసుకోవరడంతో పాటు, నీడనే ఉండేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

పెరుగుతున్న ఎండలు- అధికారులతో ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్- సమన్వయంతో పనిచేయాలని ఆదేశం - PM Modi On Heat wave Conditions

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.