ETV Bharat / state

కుండపోత వర్షంతో కృష్ణా జిల్లా గజగజ - చెరువులను తలపిస్తోన్న పంటపొలాలు - Heavy Rains in Krishna District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 6:47 AM IST

Heavy Rains in Krishna District : కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లంకగ్రామాలు, లోతట్లు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. పంటపొలాలు చెరువుల్లా మారాయి. చేపలు, రొయ్యల చెరువులకు భారీగా నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు.

Heavy Rains in Krishna District
Heavy Rains in Krishna District (ETV Bharat)

Krishna District Rains 2024 : మచిలీపట్నంతో పాటు, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పలు చోట్ల చెరువుల గండిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద రామిలేదరు వాగు, ముస్తాబాద వద్ద కళింగ చెరువు, ఏలూరు-బుడమేరు పంట కాలువల మధ్య ఉండే మార్గంలో బుడమేరు కాలువకు భారీగా వరద నీరు చేరింది.

Heavy Rains in AP : ఏలూరు- బుడమేరు పంట కాలువల మధ్య ఉండే జక్కులనెక్కలం గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. గన్నవరం పోలీస్​స్టేషన్‌లోకి కూడా వరద చేరడంతో విధులకు ఇబ్బంది తప్పలేదు. కృష్ణా నదికి విపరీతంగా వరదనీరు చేరటంతో దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 72,000ల ఎకరాలు నీటమునిగాయి. తోట్లవల్లూరు మండలంలో పలు మంపు ప్రాంతాలను ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా, జాయింట్‌ కలెక్టర్‌ గీంతాంజలి శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఉమ్మడి జిల్లాలో పాల కొరత : తోడేళ్లదిబ్బ, కలింగదిబ్బ, తుమ్మలపచ్చిక, పములలంక, పిల్లివానిలంక, పొట్టిదిబ్బలలంక, కనిగిరిలంక, ములకపల్లిలంక గ్రామాల్లోని ప్రజలను బోట్లు, పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. బుడమేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చిట్టినగర్‌లో ఉన్న విజయ డెయిరీ యూనిట్‌కి వరద ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వరద పెరగడంతో విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు, పాల ట్యాంకర్లు, పాల ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించే వాహనాలు లోపలే ఇరుక్కున్నాయి. ఫ్యాక్టరీ లోపల 1.50 లక్షల పాల ప్యాకెట్లు, లక్ష కిలోల పెరుగు సహా సుమారు రూ.65 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు దాదాపు పాడైనట్లు డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరరావు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పాల కొరత ఏర్పడింది.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద ఉన్న రామిలేరు ఉప్పొంగింది. దీంతో బొమ్ములూరు వద్ద చెన్నె-కోల్‌కతా జాతీయ రహదారి జలదిగ్భందమైంది. రామిలేరుకు ఆనుకొని ఉన్న 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం కూడా ముంపునకు గురికావడంతో కరెంట్ సరఫరా నిలిపేశారు. కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోందని జిల్లా ప్రజలను కలెక్టర్‌ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు. జిల్లాలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు 400 మంది అక్కడికి చేరుకున్నారని తెలిపారు. నది కరకట్టపై గండ్లు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.

వరదలతో అతలాకుతలమైన విజయవాడ - బుడమేరు ఉద్ధృతికి ప్రజల తీవ్ర ఇబ్బందులు - Floods in Vijayawada

సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఎన్టీఆర్​ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటా:చంద్రబాబు - Chandrababu Inspected Flood Areas

Krishna District Rains 2024 : మచిలీపట్నంతో పాటు, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పలు చోట్ల చెరువుల గండిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద రామిలేదరు వాగు, ముస్తాబాద వద్ద కళింగ చెరువు, ఏలూరు-బుడమేరు పంట కాలువల మధ్య ఉండే మార్గంలో బుడమేరు కాలువకు భారీగా వరద నీరు చేరింది.

Heavy Rains in AP : ఏలూరు- బుడమేరు పంట కాలువల మధ్య ఉండే జక్కులనెక్కలం గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. గన్నవరం పోలీస్​స్టేషన్‌లోకి కూడా వరద చేరడంతో విధులకు ఇబ్బంది తప్పలేదు. కృష్ణా నదికి విపరీతంగా వరదనీరు చేరటంతో దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 72,000ల ఎకరాలు నీటమునిగాయి. తోట్లవల్లూరు మండలంలో పలు మంపు ప్రాంతాలను ఎమ్మెల్యే వర్ల కుమార్‌ రాజా, జాయింట్‌ కలెక్టర్‌ గీంతాంజలి శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు.

ఉమ్మడి జిల్లాలో పాల కొరత : తోడేళ్లదిబ్బ, కలింగదిబ్బ, తుమ్మలపచ్చిక, పములలంక, పిల్లివానిలంక, పొట్టిదిబ్బలలంక, కనిగిరిలంక, ములకపల్లిలంక గ్రామాల్లోని ప్రజలను బోట్లు, పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. బుడమేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చిట్టినగర్‌లో ఉన్న విజయ డెయిరీ యూనిట్‌కి వరద ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వరద పెరగడంతో విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు, పాల ట్యాంకర్లు, పాల ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించే వాహనాలు లోపలే ఇరుక్కున్నాయి. ఫ్యాక్టరీ లోపల 1.50 లక్షల పాల ప్యాకెట్లు, లక్ష కిలోల పెరుగు సహా సుమారు రూ.65 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు దాదాపు పాడైనట్లు డెయిరీ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరరావు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పాల కొరత ఏర్పడింది.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద ఉన్న రామిలేరు ఉప్పొంగింది. దీంతో బొమ్ములూరు వద్ద చెన్నె-కోల్‌కతా జాతీయ రహదారి జలదిగ్భందమైంది. రామిలేరుకు ఆనుకొని ఉన్న 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం కూడా ముంపునకు గురికావడంతో కరెంట్ సరఫరా నిలిపేశారు. కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తోందని జిల్లా ప్రజలను కలెక్టర్‌ డీకే బాలాజీ అప్రమత్తం చేశారు. లంక గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావాలన్నారు. జిల్లాలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సుమారు 400 మంది అక్కడికి చేరుకున్నారని తెలిపారు. నది కరకట్టపై గండ్లు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టామని ఆయన వివరించారు.

వరదలతో అతలాకుతలమైన విజయవాడ - బుడమేరు ఉద్ధృతికి ప్రజల తీవ్ర ఇబ్బందులు - Floods in Vijayawada

సాధారణ పరిస్థితి వచ్చే వరకూ ఎన్టీఆర్​ జిల్లా కలెక్టరేట్‌లోనే ఉంటా:చంద్రబాబు - Chandrababu Inspected Flood Areas

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.