ETV Bharat / state

భారీ వర్షాలు, వరదలు - కొట్టుకుపోయిన వంతెనలు, రోడ్లు - Heavy Rains in Alluri District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 5:23 PM IST

Heavy Rains and Floods in Alluri District: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల కొద్ది రహదారులు దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టింది.

Heavy_Rains_in_Alluri_District
Heavy_Rains_in_Alluri_District (ETV Bharat)
భారీ వర్షాలు, వరదలకు అల్లూరి జిల్లా అతలాకుతలం - పూర్తిగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలు (ETV Bharat)

Heavy Rains and Floods in Alluri District: అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో వర్ష బీభత్సానికి గూడెం కొత్తవీధి మండలం అతలాకుతలమైంది. పిల్లిగడ్డ, మాదిగమల్లు, లంకపాకలు, చామగడ్డ వంతెనలు కొట్టుకుపోయాయి. 20 వరకు కల్వర్టులు కోతకు గురయ్యాయి. భారీగా కొండ చర్యలు విరిగిపడటంతో దారకొండ, గుమ్మరేవుల, దుప్పిలవాడ, సీలేరు, తడికొండ అమ్మవారి దారకొండ, గాలికొండ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోలాపుట్‌, బుంగాపుట్‌, లక్ష్మీపురం, బరడ పంచాయతీల్లో వంతెనలు దెబ్బతిన్నాయి.

జోలాపుట్‌ జలాశయం నుంచి 50వేల క్యూసెక్కులు నీరు విడుదల చేయడంతో వంతెన కొట్టుకుపోయింది. విషయం తెలిసుకున్న అరకు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ దొన్ను దొర కోతకు గురైన ప్రాంతాన్ని గ్రావెల్‌ మట్టితో కప్పించి పాదచారులు వెళ్లేలా మార్గం సుగమం చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ ​- నీళ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం - Panchayati Raj Funds Released in AP

వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట: జిల్లా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. జీకే మండలం, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచింగిపుట్టు, పాడేరు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట కొట్టుకుపోవడంతో గిరిజనులకు నష్టం వాటిల్లింది. చట్రాయిపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాఫీ తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చింతపల్లి నుంచి జీకే వీధి, దారకొండ, సీలేరు వెళ్లే మార్గంలో 45 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాల్లో అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టినా పూర్తిస్థాయిలో సిద్ధం చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన: గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం చంద్రబాబుకి పరిస్థితుల్ని వివరించి రోడ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఆదేశాలతో ఐటీడీఏ పీవో నేరుగా వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బాధితులకు నిత్యవసరకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ భూమిలో గ'లీజు' దందా- భారీగా పెనాల్టీ - YSRCP Leader Quarry Seized

రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్ - కేసు లేకుండానే యువకుడిపై దాడి - Guntur Police Violated Rules

భారీ వర్షాలు, వరదలకు అల్లూరి జిల్లా అతలాకుతలం - పూర్తిగా దెబ్బతిన్న రహదారులు, వంతెనలు (ETV Bharat)

Heavy Rains and Floods in Alluri District: అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రహదారులు, వంతెనలు, కల్వర్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో వర్ష బీభత్సానికి గూడెం కొత్తవీధి మండలం అతలాకుతలమైంది. పిల్లిగడ్డ, మాదిగమల్లు, లంకపాకలు, చామగడ్డ వంతెనలు కొట్టుకుపోయాయి. 20 వరకు కల్వర్టులు కోతకు గురయ్యాయి. భారీగా కొండ చర్యలు విరిగిపడటంతో దారకొండ, గుమ్మరేవుల, దుప్పిలవాడ, సీలేరు, తడికొండ అమ్మవారి దారకొండ, గాలికొండ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జోలాపుట్‌, బుంగాపుట్‌, లక్ష్మీపురం, బరడ పంచాయతీల్లో వంతెనలు దెబ్బతిన్నాయి.

జోలాపుట్‌ జలాశయం నుంచి 50వేల క్యూసెక్కులు నీరు విడుదల చేయడంతో వంతెన కొట్టుకుపోయింది. విషయం తెలిసుకున్న అరకు టీడీపీ ఇన్‌ఛార్జ్‌ దొన్ను దొర కోతకు గురైన ప్రాంతాన్ని గ్రావెల్‌ మట్టితో కప్పించి పాదచారులు వెళ్లేలా మార్గం సుగమం చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ ​- నీళ్లు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం పనులు వేగవంతం - Panchayati Raj Funds Released in AP

వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంట: జిల్లా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. జీకే మండలం, చింతపల్లి, జి.మాడుగుల, పెదబయలు, ముంచింగిపుట్టు, పాడేరు మండలాల్లో చేతికొచ్చిన వరి పంట కొట్టుకుపోవడంతో గిరిజనులకు నష్టం వాటిల్లింది. చట్రాయిపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి ఒకరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

కాఫీ తోటలు భారీగా దెబ్బతిన్నాయి. చింతపల్లి నుంచి జీకే వీధి, దారకొండ, సీలేరు వెళ్లే మార్గంలో 45 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గాల్లో అధికారులు రహదారి మరమ్మతులు చేపట్టినా పూర్తిస్థాయిలో సిద్ధం చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన: గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించారు. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సీఎం చంద్రబాబుకి పరిస్థితుల్ని వివరించి రోడ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఆదేశాలతో ఐటీడీఏ పీవో నేరుగా వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. బాధితులకు నిత్యవసరకులు పంపిణీ చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వ భూమిలో గ'లీజు' దందా- భారీగా పెనాల్టీ - YSRCP Leader Quarry Seized

రక్షించాల్సిన పోలీసులే రాంగ్ రూట్ - కేసు లేకుండానే యువకుడిపై దాడి - Guntur Police Violated Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.