ETV Bharat / state

సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​ వద్ద గణేశుడి నిమజ్జనాలు - క్రేన్​ ఆపరేటర్లకు 'విశ్రాంతి బస్సు' - Ganesh Immersion in hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 9:32 PM IST

Updated : Sep 17, 2024, 10:03 PM IST

Ganesh Immersion in Saroornagar : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​ వద్ద గణేశ్​ నిమజ్జనంలో పాల్గొంటున్న క్రేన్​ ఆపరేటర్లకు రెస్టు బస్సును ఏర్పాటు చేశారు. సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​ వద్ద గణేశుడి నిమజ్జనం ఘనంగా సాగుతోంది.

Ganesh Immersion in Saroornagar
Ganesh Immersion in Saroornagar (ETV Bharat)

Ganesh Immersion in Saroornagar Mini Tank Bund : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణేశుడి నిమజ్జనాలు సాగుతున్నాయి. భాగ్యనగరం గణేశుడి నిమజ్జనాల శోభతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​, ఎన్టీఆర్​ మార్గ్​, సచివాలయం, చార్మినార్​, మొజాంజాహీ మార్కెట్​, హుస్సేన్​సాగర్​ ప్రాంతాల్లో గణనాథులు నిమజ్జనానికి క్యూ కట్టారు. శివ పుత్రుని శోభాయాత్రతో ఆ ప్రాంతాలు జన కళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సరూర్​నగర్​లో కూడా గణనాథులను శోభాయాత్రగా తీసుకొచ్చి సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​ వద్ద నిమజ్జనాలకు భారీ ఏర్పాట్లు చేశారు.

క్రేన్​ డ్రైవర్లకు రెస్టు బస్సు ఏర్పాటు : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​ వద్ద గణేశ్​ నిమజ్జనంలో పాల్గొంటున్న క్రేన్​ ఆపరేటర్లకు రెస్టు బస్సును ఏర్పాటు చేసినట్లు జీహెచ్​ఎంసీ సరూర్​ నగర్​ సర్కిల్​ 5 డిప్యూటీ కమిషనర్​ సుజాత వెల్లడించారు. సరూర్​నగర్​ మినీ ట్యాంక్​ వద్ద నిమజ్జనం కోసం 8 మంది క్రేన్​ ఆపరేటర్లు, మరో నలుగురు మొబైల్​ క్రేన్​ ఆపరేటర్లు విధుల్లో ఉన్నారని అన్నారు. గణేశ్​ నిమజ్జనాలు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు.

సరూర్​నగర్​ ట్యాంక్​బండ్​లో 1500 విగ్రహాలు నిమజ్జనం : మరోవైపు సరూర్​నగర్​లో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని ఎల్బీ నగర్​ డీసీపీ ప్రవీణ్​ కుమార్​ పర్యవేక్షించారు. భక్తులు సందర్శకులు అధికారుల సూచించిన నియమాలను పాటించాలని కోరారు. అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు ఉపయోగించుకోవాలన్నారు. అలాగే భక్తులందరూ కూడా నిమజ్జన సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్​ డైవర్షన్​లకు సంబంధించి ట్రాఫిక్​ పోలీసులతో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నేడు 1500 విగ్రహాలు సరూర్​నగర్​ చెరువులో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు.

ఖైరతాబాద్​ మహాగణపతి నిమజ్జనం : ఖైరతాబాద్​ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఖైరతాబాద్​ నుంచి ట్యాంక్​బండ్​ వరకు జరిగిన శోభాయాత్రలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. ఘనంగా జరిగిన శోభాయాత్ర తర్వాత గణనాథుడు గంగమ్మ ఒడిలో సేద తీరాడు. భారీ క్రేన్​ను ఉపయోగించి హుస్సేన్​సాగర్​లో గణపతిని నిమజ్జనం చేశారు. ఈసారి 70 అడుగుల మట్టి గణపయ్యను ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడం రికార్డుగా ఉంది.

రూ.30 లక్షలు పలికిన బాలాపూర్​ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024

అయ్య బాబోయ్​ ఏంటా జనం! - గణేశ్​ నిమజ్జనానికి ట్యాంక్​బండ్​కు తరలివచ్చిన భక్తులు - ganesh immersion in hyderabad

Ganesh Immersion in Saroornagar Mini Tank Bund : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణేశుడి నిమజ్జనాలు సాగుతున్నాయి. భాగ్యనగరం గణేశుడి నిమజ్జనాల శోభతో కిటకిటలాడుతోంది. హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​, ఎన్టీఆర్​ మార్గ్​, సచివాలయం, చార్మినార్​, మొజాంజాహీ మార్కెట్​, హుస్సేన్​సాగర్​ ప్రాంతాల్లో గణనాథులు నిమజ్జనానికి క్యూ కట్టారు. శివ పుత్రుని శోభాయాత్రతో ఆ ప్రాంతాలు జన కళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సరూర్​నగర్​లో కూడా గణనాథులను శోభాయాత్రగా తీసుకొచ్చి సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​ వద్ద నిమజ్జనాలకు భారీ ఏర్పాట్లు చేశారు.

క్రేన్​ డ్రైవర్లకు రెస్టు బస్సు ఏర్పాటు : ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశాల మేరకు సరూర్​నగర్​ మినీ ట్యాంక్​బండ్​ వద్ద గణేశ్​ నిమజ్జనంలో పాల్గొంటున్న క్రేన్​ ఆపరేటర్లకు రెస్టు బస్సును ఏర్పాటు చేసినట్లు జీహెచ్​ఎంసీ సరూర్​ నగర్​ సర్కిల్​ 5 డిప్యూటీ కమిషనర్​ సుజాత వెల్లడించారు. సరూర్​నగర్​ మినీ ట్యాంక్​ వద్ద నిమజ్జనం కోసం 8 మంది క్రేన్​ ఆపరేటర్లు, మరో నలుగురు మొబైల్​ క్రేన్​ ఆపరేటర్లు విధుల్లో ఉన్నారని అన్నారు. గణేశ్​ నిమజ్జనాలు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నాయని పేర్కొన్నారు.

సరూర్​నగర్​ ట్యాంక్​బండ్​లో 1500 విగ్రహాలు నిమజ్జనం : మరోవైపు సరూర్​నగర్​లో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని ఎల్బీ నగర్​ డీసీపీ ప్రవీణ్​ కుమార్​ పర్యవేక్షించారు. భక్తులు సందర్శకులు అధికారుల సూచించిన నియమాలను పాటించాలని కోరారు. అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక వసతులు ఉపయోగించుకోవాలన్నారు. అలాగే భక్తులందరూ కూడా నిమజ్జన సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్​ డైవర్షన్​లకు సంబంధించి ట్రాఫిక్​ పోలీసులతో భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నేడు 1500 విగ్రహాలు సరూర్​నగర్​ చెరువులో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు.

ఖైరతాబాద్​ మహాగణపతి నిమజ్జనం : ఖైరతాబాద్​ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఖైరతాబాద్​ నుంచి ట్యాంక్​బండ్​ వరకు జరిగిన శోభాయాత్రలో భక్తులు అధికంగా పాల్గొన్నారు. ఘనంగా జరిగిన శోభాయాత్ర తర్వాత గణనాథుడు గంగమ్మ ఒడిలో సేద తీరాడు. భారీ క్రేన్​ను ఉపయోగించి హుస్సేన్​సాగర్​లో గణపతిని నిమజ్జనం చేశారు. ఈసారి 70 అడుగుల మట్టి గణపయ్యను ప్రతిష్ఠించారు. ప్రపంచంలోనే 70 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడం రికార్డుగా ఉంది.

రూ.30 లక్షలు పలికిన బాలాపూర్​ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024

అయ్య బాబోయ్​ ఏంటా జనం! - గణేశ్​ నిమజ్జనానికి ట్యాంక్​బండ్​కు తరలివచ్చిన భక్తులు - ganesh immersion in hyderabad

Last Updated : Sep 17, 2024, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.