ETV Bharat / state

అయ్య బాబోయ్​ ఏంటా జనం! - గణేశ్​ నిమజ్జనానికి ట్యాంక్​బండ్​కు తరలివచ్చిన భక్తులు - ganesh immersion in hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 3:06 PM IST

Updated : Sep 17, 2024, 3:38 PM IST

Ganesh Immersion in Hussain Sagar : భాగ్యనగరంలో గణేశ్‌ నిమజ్జనం కన్నుల పండువగా సాగుతోంది. వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌ పరిసరాలు సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో కోలాహలం నెలకొంది.

Ganesh Immersion in Hussain Sagar
Ganesh Immersion in Hussain Sagar (ETV Bharat)

Ganesh Ongoing Immersion in Hussain Sagar : 'జై గణేశ్​ మహారాజ్​ కీ జై' అంటూ భాగ్యనగరం మొత్తం నామస్మరణ మార్మోగిపోతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కనులపండుగగా గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. ఈ క్రమంలో ట్యాంక్​ బండ్​ పరిసర ప్రాంతం గణేశుడి నిమజ్జనానికి విచ్చేసిన భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంతో సందడి నెలకొంది. అలాగే ఖైరతాబాద్​ మహాగణపతి నిమజ్జనాన్ని హుస్సేన్​సాగర్​లో కనులారా వీక్షించేందుకు భారీ తరలివచ్చారు.

Ganesh Immersion in Hussain Sagar
ఖైరతాబాద్​ గణేశుడి శోభాయాత్ర (ETV Bharat)

దీంతో హుస్సేన్​ సాగర్​ ప్రాంతాలైన ట్యాంక్​ బండ్​, ఎన్టీఆర్​ మార్గ్​, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం ఐ మ్యాక్స్​ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది గణపతులను హుస్సేన్​సాగర్​లోకి నిమజ్జనం చేస్తూ వెళ్లిరావయ్యా గణపయ్య మళ్లీ అంటూ జనాలు నీరాజనం పలుకుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Ganesh Immersion in Hussain Sagar
సచివాలయం వద్ద ఖైరతాబాద్​ గణేశుడి శోభాయాత్ర (ETV Bharat)
Ganesh Immersion in Hussain Sagar
ట్యాంక్​బండ్​ వద్ద గణేశుడి నిమజ్జనాలు (ETV Bharat)

ముగిసిన ఖైరతాబాద్​ శోభాయాత్ర : ఖైరతాబాద్​ మహాగణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. హుస్సేన్​సాగర్​లోని 4వ నెంబరు క్రేన్​ వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. ఖైరతాబాద్​ మహాగణపతిని తిలకించేందుకు భక్తులు భారీగా ట్యాంక్​బండ్​కు చేరుకున్నారు. గణపతి నామస్మరణతో ట్యాంక్​బండ్​ పరిసర ప్రాంతాల్లో మార్మోగాయి. దీంతో ఖైరతాబాద్​ మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణం అయింది. పోలీసులు భారీగా పోలీసుల భద్రతను నిర్వహించారు. గణేశుడు గంగమ్మ చెంతకు వెళ్లినప్పుడు భక్తులు తమ సెల్​ఫోన్లలో ఖైరతాబాద్​ గణేశుడి నిమజ్జన దృశ్యాలను వీడియో, సెల్ఫీల రూపంలో భద్రపరచుకున్నారు.

Ganesh Immersion in Hussain Sagar
సచివాలయం వద్ద ఖైరతాబాద్​ గణేశుడు (ETV Bharat)
Ganesh Immersion in Hussain Sagar
కిక్కిరిసిన ట్యాంక్​బండ్​ పరివాహక ప్రాంతాలు (ETV Bharat)

ఖైరతాబాద్​ మెట్రో స్టేషన్​ గేట్లు మూసివేత : గణపతి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులతో ఖైరతాబాద్​ మెట్రో స్టేషన్​కు భారీగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో మెట్రో సిబ్బంది మెట్రో స్టేషన్​ గేట్లను మూసివేశారు. పది నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు. మెట్ల వద్ద గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganesh Immersion in Hussain Sagar
గణేశుడి నిమజ్జనం (ETV Bharat)

కొనసాగుతున్న బాలాపూర్​ శోభాయాత్ర : మరోవైపు బాలాపూర్​ గణేశుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో భక్తులు నృత్యాలు చేస్తున్నారు. బాలాపూర్​ గణేశ్​ శోభాయాత్రను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్​ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాలు జరుగుతున్నాయని, దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Ganesh Immersion in Hussain Sagar
నిమజ్జన దృశ్యాలు సెల్​ఫోన్​లో బంధిస్తున్న భక్తులు (ETV Bharat)

రూ.30 లక్షలు పలికిన బాలాపూర్​ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024

బై బోలో గణేశ్​ మహరాజ్​ కీ - గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి - Khairatabad Ganesh Nimajjanam 2024

Ganesh Ongoing Immersion in Hussain Sagar : 'జై గణేశ్​ మహారాజ్​ కీ జై' అంటూ భాగ్యనగరం మొత్తం నామస్మరణ మార్మోగిపోతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు అంతా కనులపండుగగా గణేశుడిని గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. ఈ క్రమంలో ట్యాంక్​ బండ్​ పరిసర ప్రాంతం గణేశుడి నిమజ్జనానికి విచ్చేసిన భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా మారాయి. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంతో సందడి నెలకొంది. అలాగే ఖైరతాబాద్​ మహాగణపతి నిమజ్జనాన్ని హుస్సేన్​సాగర్​లో కనులారా వీక్షించేందుకు భారీ తరలివచ్చారు.

Ganesh Immersion in Hussain Sagar
ఖైరతాబాద్​ గణేశుడి శోభాయాత్ర (ETV Bharat)

దీంతో హుస్సేన్​ సాగర్​ ప్రాంతాలైన ట్యాంక్​ బండ్​, ఎన్టీఆర్​ మార్గ్​, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం ఐ మ్యాక్స్​ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేలాది గణపతులను హుస్సేన్​సాగర్​లోకి నిమజ్జనం చేస్తూ వెళ్లిరావయ్యా గణపయ్య మళ్లీ అంటూ జనాలు నీరాజనం పలుకుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Ganesh Immersion in Hussain Sagar
సచివాలయం వద్ద ఖైరతాబాద్​ గణేశుడి శోభాయాత్ర (ETV Bharat)
Ganesh Immersion in Hussain Sagar
ట్యాంక్​బండ్​ వద్ద గణేశుడి నిమజ్జనాలు (ETV Bharat)

ముగిసిన ఖైరతాబాద్​ శోభాయాత్ర : ఖైరతాబాద్​ మహాగణపతిని గంగమ్మ ఒడిలోకి చేర్చారు. హుస్సేన్​సాగర్​లోని 4వ నెంబరు క్రేన్​ వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది. ఖైరతాబాద్​ మహాగణపతిని తిలకించేందుకు భక్తులు భారీగా ట్యాంక్​బండ్​కు చేరుకున్నారు. గణపతి నామస్మరణతో ట్యాంక్​బండ్​ పరిసర ప్రాంతాల్లో మార్మోగాయి. దీంతో ఖైరతాబాద్​ మహాగణపతి నిమజ్జనం పరిపూర్ణం అయింది. పోలీసులు భారీగా పోలీసుల భద్రతను నిర్వహించారు. గణేశుడు గంగమ్మ చెంతకు వెళ్లినప్పుడు భక్తులు తమ సెల్​ఫోన్లలో ఖైరతాబాద్​ గణేశుడి నిమజ్జన దృశ్యాలను వీడియో, సెల్ఫీల రూపంలో భద్రపరచుకున్నారు.

Ganesh Immersion in Hussain Sagar
సచివాలయం వద్ద ఖైరతాబాద్​ గణేశుడు (ETV Bharat)
Ganesh Immersion in Hussain Sagar
కిక్కిరిసిన ట్యాంక్​బండ్​ పరివాహక ప్రాంతాలు (ETV Bharat)

ఖైరతాబాద్​ మెట్రో స్టేషన్​ గేట్లు మూసివేత : గణపతి శోభాయాత్రలో పాల్గొన్న భక్తులతో ఖైరతాబాద్​ మెట్రో స్టేషన్​కు భారీగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో మెట్రో సిబ్బంది మెట్రో స్టేషన్​ గేట్లను మూసివేశారు. పది నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు సిబ్బంది లోపలికి పంపిస్తున్నారు. మెట్ల వద్ద గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganesh Immersion in Hussain Sagar
గణేశుడి నిమజ్జనం (ETV Bharat)

కొనసాగుతున్న బాలాపూర్​ శోభాయాత్ర : మరోవైపు బాలాపూర్​ గణేశుడి శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో భక్తులు నృత్యాలు చేస్తున్నారు. బాలాపూర్​ గణేశ్​ శోభాయాత్రను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్​ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనాలు జరుగుతున్నాయని, దాదాపు లక్ష విగ్రహాలు నిమజ్జనాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Ganesh Immersion in Hussain Sagar
నిమజ్జన దృశ్యాలు సెల్​ఫోన్​లో బంధిస్తున్న భక్తులు (ETV Bharat)

రూ.30 లక్షలు పలికిన బాలాపూర్​ లడ్డూ - ఈసారి ఎవరికి దక్కిందంటే? - Balapur Laddu Auction 2024

బై బోలో గణేశ్​ మహరాజ్​ కీ - గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి - Khairatabad Ganesh Nimajjanam 2024

Last Updated : Sep 17, 2024, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.