ETV Bharat / state

హైదరాబాద్‌లో కరెంట్​ కోతలు విద్యుత్​ నిర్వహణ లోపానికి నిదర్శనం : హరీశ్ రావు - Harish Rao on Power Cuts

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 10, 2024, 4:37 PM IST

Harish Rao on Power Cuts in Hyderabad : హైదరాబాద్‌లో కరెంట్​ కోతలు విద్యుత్​ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. విద్యుత్‌ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్‌, మాసబ్‌ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు విద్యుత్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఎక్స్​ వేదికగా ఆయన మండిపడ్డారు. మరోవైపు ఓయూలో జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును హరీశ్​రావు ఖండించారు.

Harish Rao about Power Cuts in Telangana
Harish Rao on Power Cuts in Hyderabad (ETV Bharat)

Harish Rao about Power Cuts in Telangana : రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో కరెంట్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. విద్యుత్ కోతల అంశంపై ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్‌, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంట్ పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరవయ్యారని ఆక్షేపించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్​రావు కోరారు.

జర్నలిస్టులను అరెస్టు- మీడియా హక్కును కాలరాయడమే : మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థుల దగ్గరకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీశ్​రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ఆయన పోస్టు చేశారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహిణలో భాగంగా ఆ వార్తలు కవర్​ చేయడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు.

జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్​కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా : పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు పరిణితి లేనివని హరీశ్​రావు అన్నారు. గతంలో గ్రూప్​ 2, టెట్​ ఎగ్జామ్స్​ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దుతుగా ఉండలేదా అని సీఎం రేవంత్​ను ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేశారని ఆక్షేపించారు.

'అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా?' - సీఎం రేవంత్​పై హరీశ్ రావు ఫైర్ - HARISH RAO SLAMS REVANTH COMMENTS

విద్యా వ్యవస్థలో సమస్యలే లేవని విద్యాశాఖ ప్రకటించడం సరికాదు : హరీశ్‌రావు - Harish Comments on Education Dept

Harish Rao about Power Cuts in Telangana : రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లో కరెంట్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. విద్యుత్ కోతల అంశంపై ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్‌, మాసాబ్ ట్యాంక్‌లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంట్ పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడితే పట్టించుకునే వారే కరవయ్యారని ఆక్షేపించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్​రావు కోరారు.

జర్నలిస్టులను అరెస్టు- మీడియా హక్కును కాలరాయడమే : మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థుల దగ్గరకు వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును మాజీ మంత్రి హరీశ్​రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎక్స్​ వేదికగా ఆయన పోస్టు చేశారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహిణలో భాగంగా ఆ వార్తలు కవర్​ చేయడమే వారు చేసిన తప్పా అని ప్రశ్నించారు.

జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్​కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా : పరీక్షల వాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వ్యాఖ్యలు పరిణితి లేనివని హరీశ్​రావు అన్నారు. గతంలో గ్రూప్​ 2, టెట్​ ఎగ్జామ్స్​ వాయిదా వేయాలని అభ్యర్థులు అడిగితే మద్దుతుగా ఉండలేదా అని సీఎం రేవంత్​ను ఉద్దేశించి ప్రశ్నించారు. అప్పుడు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, ఇప్పుడెందుకు సానుకూలంగా ఆలోచించడం లేదని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరొక మాటనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరితే, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశయాలతో, జీవితాలతో రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాక వారి ఆకాంక్షలను పక్కనపెట్టి, నడి రోడ్డున పడేలా చేశారని ఆక్షేపించారు.

'అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా?' - సీఎం రేవంత్​పై హరీశ్ రావు ఫైర్ - HARISH RAO SLAMS REVANTH COMMENTS

విద్యా వ్యవస్థలో సమస్యలే లేవని విద్యాశాఖ ప్రకటించడం సరికాదు : హరీశ్‌రావు - Harish Comments on Education Dept

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.