ETV Bharat / state

ప్రజారోగ్యానికి సవాలుగా వరద- అంటువ్యాధులకు అవకాశం- వైద్య బృందాల ఇంటింటి సర్వే - Flood Water Dangerous To Health

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 12:49 PM IST

Flood Water Dangerous To Health : విజయవాడలో వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. రోజుల తరబడి నిల్వ ఉన్న బురద నీటితో సంక్రమిత వ్యాధులు పెరిగే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బృందాలు ఇంటింటా సర్వే చేపట్టి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు.

Flood Water Dangerous To Health
Flood Water Dangerous To Health (ETV Bharat)

Flood Water Dangerous To Health : వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. అసాధారణ రీతిలో తొమ్మిది రోజుల నుంచి నిల్వ ఉన్న బురద నీటివల్ల సంక్రమిత వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పారుదల జరగకుండా ఉన్న నీటి ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వీటిని నియంత్రించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే ఇంటింటి సర్వేను చేపట్టి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. వర్షాలకు తగ్గట్లు వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికి తగ్గట్లు వరదనీటిలో జనవాసాలు ఇరుక్కోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

వరదనీటిలో మల, మూత్రాలు :
వరద ప్రాంతాల్లో కొన్ని రోజులుగా నీళ్లు నిలిచిపోవటం ఆందోళన కలిగిస్తుంది. జనవాసాలు రోజుల తరబడి నీళ్లల్లోనే నానుతున్నాయి. పారుదల జరగకుండా తొమ్మిది రోజుల నుంచి నీరు అలాగే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాలువలు నిండినందునా మురుగు వరదలో కలిసిపోయింది. పశువులు, మనుషుల మల, మూత్రాలు కూడా వరదనీటిలో కలిసిపోయాయి. వరదనీటిలోనే కొన్నిచోట్ల పశువులు సైతం కన్నుమూశాయి. నీటిలోనే మొక్కలు, చెత్తాచెదారం, ఆహార ప్యాకెట్లు వంటివి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అజిత్‌సింగ్‌నగర్, సింగ్‌నగర్, జక్కంపూడికాలనీ, ప్రకాష్‌నగర్, చిట్టినగర్, వాంబే కాలనీ, ఇతర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటివల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering

ఇంటింటా సర్వే చేపట్టిన 150 బృందాలు : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రానికి రాసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరుగురు వైద్య నిపుణులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్‌ సత్యనారాయణన్, రాజేంద్రప్రసాద్‌ రామకృష్ణ పాయ్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లతో ఏర్పాటుచేసిన 150 బృందాలు ఇప్పటికే ఇంటింటా ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి.అలాగే నిల్వ ఉన్న నీటివల్ల చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇదే నీరు శరీరంలోనికి చేరితే వ్యక్తికి లెప్టోస్పైరోసిస్‌ సంక్రమించే అవకాశం ఉంటుందన్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి. నీటిలో ఎక్కువగా తిరగడం ద్వారా పాదాలు నానే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ రకమైన వ్యాధులు సంక్రమించవచ్చు : కలుషిత నీటి ద్వారా విరేచనాలు, గ్యాస్ట్రో ఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్‌ దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా, మెదడు వాపు గాలి ద్వారా సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, స్వైన్‌ఫ్లూ, న్యుమోనియా, క్షయ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుపుతున్నారు. కలరా కేసులు కూడా బయటపడే అవకాశం ఉందని వెల్లడించారు. గోడలు తేమగా ఉన్నందువల్ల ఫంగస్‌ సంబంధిత అనారోగ్య (శ్వాసపరమైన) సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. దోమలు, ఈగలవల్ల వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సులువుగా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వివరించారు. ఒళ్లునొప్పులు, కడుపులో తిప్పడంవంటివి కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

"వర్షాల సమయంలో కొందరికి బ్యాక్టీరియాతో వచ్చే న్యూమోనియా కూడా ఎక్కువవుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, ఊబకాయులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. టైఫాయిడ్‌ జ్వరం విడవకుండా వేధిస్తుంది. వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గడం, కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం కూడా రావొచ్చు. కాచి చల్లార్చి, వడపోసిన నీటిని తాగితే మంచిది. అప్పుడే వండిన ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. నీటి గుంతలు, మురుగునీరు ఉంటే వాటిపై ఒక చుక్క కిరోసిన్‌ లేదా నూనె లాంటివి వేయాలి. దీనివల్ల దోమల వృద్ధి తగ్గుతుంది." - తేజస్విని, వైద్యురాలు

"వాడుకోవాలనుకున్న మంచినీటిలో ధూళి కణాలుఉన్నట్లు కనిపిస్తే శుభ్రమైన వస్త్రంతో ఒక పాత్రలోనికి వడపోసుకోవాలి. లేదంటే పాత్రలోనికి నేరుగా తీసుకున్న నీటిలో ధూళికణాలు అడుగుభాగంలో పేరుకుపోయే వరకు వేచి ఉండాలి. ఆ తరువాత పై భాగంలో ఉన్న శుభ్రమైన నీటిని మరో పాత్రలోనికి మార్చుకోవాలి. ఈ నీటిని రెండు, మూడు నిమిషాలపాటు మరగించి చల్లార్చాలి. ఆ తరువాత మరో శుభ్రమైన పాత్రలో నిల్వ చేయాలి సురక్షితమైన నీటిని ఉంచే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. రసాయనాలకు ఉపయోగించిన ప్లాస్టిక్‌ కంటైనర్లను వాడకూడదు. నీటిని మరగించటం వీలుకాకుంటే సురక్షిత నీటి తయారీకి క్లోరిన్‌ టాబ్లెట్స్‌ లేదా బ్లీచింగ్‌ పౌడరు వాడాలి. క్లోరిన్‌ టాబ్లెట్స్‌ను నేరుగా నీటి వనరుకు కలపవచ్చు." - శ్రీకాంత్‌, వైద్యుడు

వరద నుంచి బయటపడుతున్న కాలనీలు - 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్​ - Vijayawada Gradually Recovering

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

Flood Water Dangerous To Health : వరద నీరు ప్రజారోగ్యానికి సవాళ్లు విసురుతోంది. అసాధారణ రీతిలో తొమ్మిది రోజుల నుంచి నిల్వ ఉన్న బురద నీటివల్ల సంక్రమిత వ్యాధులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పారుదల జరగకుండా ఉన్న నీటి ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ సంబంధిత వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వీటిని నియంత్రించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందాలు ఇప్పటికే ఇంటింటి సర్వేను చేపట్టి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి. వర్షాలకు తగ్గట్లు వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికి తగ్గట్లు వరదనీటిలో జనవాసాలు ఇరుక్కోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

వరదనీటిలో మల, మూత్రాలు : వరద ప్రాంతాల్లో కొన్ని రోజులుగా నీళ్లు నిలిచిపోవటం ఆందోళన కలిగిస్తుంది. జనవాసాలు రోజుల తరబడి నీళ్లల్లోనే నానుతున్నాయి. పారుదల జరగకుండా తొమ్మిది రోజుల నుంచి నీరు అలాగే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాలువలు నిండినందునా మురుగు వరదలో కలిసిపోయింది. పశువులు, మనుషుల మల, మూత్రాలు కూడా వరదనీటిలో కలిసిపోయాయి. వరదనీటిలోనే కొన్నిచోట్ల పశువులు సైతం కన్నుమూశాయి. నీటిలోనే మొక్కలు, చెత్తాచెదారం, ఆహార ప్యాకెట్లు వంటివి కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అజిత్‌సింగ్‌నగర్, సింగ్‌నగర్, జక్కంపూడికాలనీ, ప్రకాష్‌నగర్, చిట్టినగర్, వాంబే కాలనీ, ఇతర ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటివల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering

ఇంటింటా సర్వే చేపట్టిన 150 బృందాలు : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రానికి రాసిన లేఖకు అనుగుణంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరుగురు వైద్య నిపుణులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో మంగళగిరి ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్‌ సత్యనారాయణన్, రాజేంద్రప్రసాద్‌ రామకృష్ణ పాయ్‌ కూడా సభ్యులుగా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు చెందిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లతో ఏర్పాటుచేసిన 150 బృందాలు ఇప్పటికే ఇంటింటా ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నాయి.అలాగే నిల్వ ఉన్న నీటివల్ల చర్మంపై దద్దుర్లు, ఇతర చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఇదే నీరు శరీరంలోనికి చేరితే వ్యక్తికి లెప్టోస్పైరోసిస్‌ సంక్రమించే అవకాశం ఉంటుందన్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి. నీటిలో ఎక్కువగా తిరగడం ద్వారా పాదాలు నానే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ రకమైన వ్యాధులు సంక్రమించవచ్చు : కలుషిత నీటి ద్వారా విరేచనాలు, గ్యాస్ట్రో ఎంటరైటిస్, కామెర్లు, టైఫాయిడ్‌ దోమల ద్వారా మలేరియా, డెంగీ, గన్యా, మెదడు వాపు గాలి ద్వారా సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు, స్వైన్‌ఫ్లూ, న్యుమోనియా, క్షయ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుపుతున్నారు. కలరా కేసులు కూడా బయటపడే అవకాశం ఉందని వెల్లడించారు. గోడలు తేమగా ఉన్నందువల్ల ఫంగస్‌ సంబంధిత అనారోగ్య (శ్వాసపరమైన) సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. దోమలు, ఈగలవల్ల వచ్చే వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సులువుగా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వివరించారు. ఒళ్లునొప్పులు, కడుపులో తిప్పడంవంటివి కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

"వర్షాల సమయంలో కొందరికి బ్యాక్టీరియాతో వచ్చే న్యూమోనియా కూడా ఎక్కువవుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్థమా, ఊబకాయులకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. టైఫాయిడ్‌ జ్వరం విడవకుండా వేధిస్తుంది. వాంతులు, విరేచనాలు, ఆకలి తగ్గడం, కడుపు నొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం కూడా రావొచ్చు. కాచి చల్లార్చి, వడపోసిన నీటిని తాగితే మంచిది. అప్పుడే వండిన ఆహారం తీసుకోవాలి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి. నీటి గుంతలు, మురుగునీరు ఉంటే వాటిపై ఒక చుక్క కిరోసిన్‌ లేదా నూనె లాంటివి వేయాలి. దీనివల్ల దోమల వృద్ధి తగ్గుతుంది." - తేజస్విని, వైద్యురాలు

"వాడుకోవాలనుకున్న మంచినీటిలో ధూళి కణాలుఉన్నట్లు కనిపిస్తే శుభ్రమైన వస్త్రంతో ఒక పాత్రలోనికి వడపోసుకోవాలి. లేదంటే పాత్రలోనికి నేరుగా తీసుకున్న నీటిలో ధూళికణాలు అడుగుభాగంలో పేరుకుపోయే వరకు వేచి ఉండాలి. ఆ తరువాత పై భాగంలో ఉన్న శుభ్రమైన నీటిని మరో పాత్రలోనికి మార్చుకోవాలి. ఈ నీటిని రెండు, మూడు నిమిషాలపాటు మరగించి చల్లార్చాలి. ఆ తరువాత మరో శుభ్రమైన పాత్రలో నిల్వ చేయాలి సురక్షితమైన నీటిని ఉంచే పాత్రలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. రసాయనాలకు ఉపయోగించిన ప్లాస్టిక్‌ కంటైనర్లను వాడకూడదు. నీటిని మరగించటం వీలుకాకుంటే సురక్షిత నీటి తయారీకి క్లోరిన్‌ టాబ్లెట్స్‌ లేదా బ్లీచింగ్‌ పౌడరు వాడాలి. క్లోరిన్‌ టాబ్లెట్స్‌ను నేరుగా నీటి వనరుకు కలపవచ్చు." - శ్రీకాంత్‌, వైద్యుడు

వరద నుంచి బయటపడుతున్న కాలనీలు - 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్​ - Vijayawada Gradually Recovering

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.