ETV Bharat / state

కృష్ణానది మహోగ్రరూపం - కరకట్ట వెంబడి ప్రమాద ఘంటికలు - flood to krishna river karakatta

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 9:31 AM IST

Flood to Krishna River Karakatta: కృష్ణానదికి రికార్డుస్థాయిలో వరదనీరు పోటెత్తింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 11.45 లక్షల క్యూసెక్కులు నీరు నదిలోకి విడుదల చేశారు. ఊహించని స్థాయిలో వరద రావడంతో కృష్ణానది కరకట్ట ప్రమాదంలో పడింది. టీడీపీ హయాంలో కరకట్ట బలోపేతం, విస్తరణ పనులను సగానికి పైగా పూర్తి చేశారు. మిగతా పనులను తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది. కనీసం నిర్వహణను పట్టించుకోకపోవటంతో చాలచోట్ల కరకట్ట బలహీనపడింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో వస్తున్న వరదతో కరకట్ట ఎక్కడ, ఎప్పుడు తెగుతుందోనని జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.

krishna river karakatta
krishna river karakatta (ETV Bharat)

Flood to Krishna River Karakatta: కృష్ణానదికి వరదలు పోటెత్తిన సమయంలో జలవనరుల శాఖ అధికారులతో పాటు, రెవెన్యూ, జెడ్పీ అధికారులు అదనపు బాధ్యతలను చేపట్టాలి. 24గంటలూ అప్రమత్తంగా ఉండేలా కరకట్ట వెంబడి బృందాలు గస్తీ నిర్వహించాలి. కృష్ణా పరిరక్షణ విభాగం, జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కృష్ణా పరిరక్షణ విభాగం డీఈ, ఏఈలు, ఇతర సిబ్బంది నదికి వచ్చే వరదనీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రెండు జిల్లాల యంత్రాంగానికి సమాచారం ఇస్తారు. రెండువైపులా కరకట్ట వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా వరదకు సంబంధించిన సన్నద్ధత సమావేశం నిర్వహించకపోవడంతో ఈ వ్యవస్థ అంతా వెంటనే అప్రమత్తం కాలేకపోయింది. వరదల సమయంలో సిద్ధంగా ఉంచుకోవాల్సిన ఖాళీ సిమెంట్ సంచులు, వెదురు కర్రలు, ఇసుక, తాళ్లు, టార్చి లైట్లు, వరద లైట్లను యంత్రాంగం అందుబాటులో ఉంచలేదు. వరద సన్నద్ధతకు సంబంధించి సరైన ప్రణాళిక లేక అప్పటికప్పుడు సామగ్రి, సిబ్బందిని సమకూర్చుకుని పనులు చేస్తున్నారు. వరద తీవ్రత నేపథ్యంలో కరకట్ట వెంబడి అదనంగా వాచర్లను నియమిస్తారు. జలవనరులు, రెవెన్యూఅధికారుల బృందాలు సంయుక్తంగా పనిచేస్తాయి. వరద సమయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారు విధుల నుంచి వెళ్లే సమయంలో వారి స్థానంలో వచ్చిన అధికారికి అప్పటివరకు ఉన్న సమాచారాన్ని అందజేసి నిర్ధారించుకున్న తర్వాతే విధుల నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

అయితే సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ పక్కాగా చేపట్టలేకపోయారు. వరద తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి 2.5 కిలోమీటర్లకు గ్రామస్థాయి సిబ్బంది ఒకరు, ప్రతి 5 కిలోమీటర్లకు వాచరు ఒకరు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. రాత్రివేళ కూడా గస్తీ నిర్వహంచేలా ఏర్పాట్లు చూసుకోవాలి. 24 గంటలూ కరకట్ట పరిశీలనకు యంత్రాంగం పనిచేయాలి. అన్ని విభాగాల యంత్రాంగం కరకట్టపై ఉన్నప్పటికీ ముందస్తు సన్నద్ధత లేకపోవడంతో సమన్వయం కొరవడింది. 2009లో అత్యధికంగా 10.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ రికార్డులు బద్దలు కొడుతూ 11.45 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు.

'మాకు ఈసారీ వరద ముప్పు తప్పేలా లేదు' - గత అనుభవాలతో బెంబేలెత్తుతున్న దివిసీమ ప్రజలు - Flood Threat in Diviseema

ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి సముద్రం వరకు వరదనీరు గ్రామాలవైపు రాకుండా రక్షణగా కరకట్ట ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 230 కిలోమీటర్ల మేర కరకట్ట ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో116.4 కిలోమీటర్ల మేర కరకట్ట ఉంటుంది. ఇందులో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 22, దిగువన 85.4 కిలోమీటర్లు, రాజుకాల్వ 9 కిలోమీటర్లు ఉంటుంది. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహణ చేపట్టకపోవడం, భారీ ఇసుక లారీలను అనుమతించడం వల్ల కరకట్ట చాలాచోట్ల కుంగిపోయింది. మరికొన్నిచోట్ల బలహీనంగా మారింది. తీరగ్రామాల ప్రజలు కరకట్టపైకి వచ్చి ఎప్పటికప్పుడు వరదను పరిశీలిస్తూ ఎక్కడైనా లీకేజీలు, గండ్లు పడే ప్రమాదం ఉందా? అని గమనిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

కృష్ణాపరిరక్షణ విభాగం అధికారులు స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని కట్టను బలోపేతం చేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెం వద్ద కట్టకు చేరువగా వరద రావడంతో గ్రామస్థులు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. వల్లభాపురం వద్ద వాగు నీరు నదిలోకి వెళ్లడానికి వీలుగా ఏర్పాటుచేసిన స్లూయిజ్‌ గేటు వద్ద లీకేజీ ఉండటంతో అధికారులు ఇసుక బస్తాలతో కట్టడి చేశారు. పిడపర్రు వద్ద మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇసుక బస్తాలు వేసి కట్ట బలోపేతం చేసే పనుల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు పెదపులివర్రు వద్ద కరకట్ట వెంట అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐదుచోట్ల కట్టపైకి నీరు రావడం స్థానికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఎవరికివారు మట్టికట్టలు, ఇసుకబస్తాలు వేసి కట్టను కాపాడుకునే ప్రయత్నం చేశారు.

బుడమేరు ప్రళయం ఎఫెక్ట్ - వరద గుప్పిట్లో అల్లాడుతున్న జనం - Vijayawada Floods

యంత్రాంగం కూడా అక్కడికి చేరుకుని లారీల్లో మట్టి, ఇసుక తెప్పించి కరకట్టను తాత్కాలికంగా ఎత్తు పెంచారు. అయినప్పటికీ వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కట్ట గండిపడుతుందేమోనని భయాందోళనలు స్థానికులను వెంటాడుతున్నాయి. దీంతో పెదపులివర్రు గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేశారు. గండి పడే ప్రమాదం ఉన్నందున గ్రామం ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో అందరూ అవసరమైన మేర సామాన్లు సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి దిగువన ఓలేరు, రావిఅనంతపురం వద్ద కూడా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.

అధికారులు కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తు చర్యలు చేపట్టారు. త్వరలో పూర్తిస్థాయిలో కరకట్ట బలోపేతం చేయటానికి అవసరమైన చర్యలు, చేయాల్సిన పనులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. కరకట్టకు గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూటా అధికారుల్ని ఉంచి గండం గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరకట్టకు ఎక్కడ గండి పడినా ఊహించని నష్టం జరుగుతుందని దివిసీమ ప్రజలు కరకట్ట బలహీనంగా ఉన్నచోట్ల తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌ కోరారు.

వరద బాధితులకు పటిష్ట సహాయ చర్యలు - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ - first time used drones in ap

Flood to Krishna River Karakatta: కృష్ణానదికి వరదలు పోటెత్తిన సమయంలో జలవనరుల శాఖ అధికారులతో పాటు, రెవెన్యూ, జెడ్పీ అధికారులు అదనపు బాధ్యతలను చేపట్టాలి. 24గంటలూ అప్రమత్తంగా ఉండేలా కరకట్ట వెంబడి బృందాలు గస్తీ నిర్వహించాలి. కృష్ణా పరిరక్షణ విభాగం, జలవనరులశాఖ కార్యనిర్వాహక ఇంజినీరు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కృష్ణా పరిరక్షణ విభాగం డీఈ, ఏఈలు, ఇతర సిబ్బంది నదికి వచ్చే వరదనీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రెండు జిల్లాల యంత్రాంగానికి సమాచారం ఇస్తారు. రెండువైపులా కరకట్ట వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.

అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా వరదకు సంబంధించిన సన్నద్ధత సమావేశం నిర్వహించకపోవడంతో ఈ వ్యవస్థ అంతా వెంటనే అప్రమత్తం కాలేకపోయింది. వరదల సమయంలో సిద్ధంగా ఉంచుకోవాల్సిన ఖాళీ సిమెంట్ సంచులు, వెదురు కర్రలు, ఇసుక, తాళ్లు, టార్చి లైట్లు, వరద లైట్లను యంత్రాంగం అందుబాటులో ఉంచలేదు. వరద సన్నద్ధతకు సంబంధించి సరైన ప్రణాళిక లేక అప్పటికప్పుడు సామగ్రి, సిబ్బందిని సమకూర్చుకుని పనులు చేస్తున్నారు. వరద తీవ్రత నేపథ్యంలో కరకట్ట వెంబడి అదనంగా వాచర్లను నియమిస్తారు. జలవనరులు, రెవెన్యూఅధికారుల బృందాలు సంయుక్తంగా పనిచేస్తాయి. వరద సమయంలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది వారు విధుల నుంచి వెళ్లే సమయంలో వారి స్థానంలో వచ్చిన అధికారికి అప్పటివరకు ఉన్న సమాచారాన్ని అందజేసి నిర్ధారించుకున్న తర్వాతే విధుల నుంచి వెళ్లాల్సి ఉంటుంది.

అయితే సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ పక్కాగా చేపట్టలేకపోయారు. వరద తీవ్రంగా ఉన్న సమయంలో ప్రతి 2.5 కిలోమీటర్లకు గ్రామస్థాయి సిబ్బంది ఒకరు, ప్రతి 5 కిలోమీటర్లకు వాచరు ఒకరు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. రాత్రివేళ కూడా గస్తీ నిర్వహంచేలా ఏర్పాట్లు చూసుకోవాలి. 24 గంటలూ కరకట్ట పరిశీలనకు యంత్రాంగం పనిచేయాలి. అన్ని విభాగాల యంత్రాంగం కరకట్టపై ఉన్నప్పటికీ ముందస్తు సన్నద్ధత లేకపోవడంతో సమన్వయం కొరవడింది. 2009లో అత్యధికంగా 10.94 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ రికార్డులు బద్దలు కొడుతూ 11.45 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు.

'మాకు ఈసారీ వరద ముప్పు తప్పేలా లేదు' - గత అనుభవాలతో బెంబేలెత్తుతున్న దివిసీమ ప్రజలు - Flood Threat in Diviseema

ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి సముద్రం వరకు వరదనీరు గ్రామాలవైపు రాకుండా రక్షణగా కరకట్ట ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 230 కిలోమీటర్ల మేర కరకట్ట ఉంటుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో116.4 కిలోమీటర్ల మేర కరకట్ట ఉంటుంది. ఇందులో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 22, దిగువన 85.4 కిలోమీటర్లు, రాజుకాల్వ 9 కిలోమీటర్లు ఉంటుంది. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహణ చేపట్టకపోవడం, భారీ ఇసుక లారీలను అనుమతించడం వల్ల కరకట్ట చాలాచోట్ల కుంగిపోయింది. మరికొన్నిచోట్ల బలహీనంగా మారింది. తీరగ్రామాల ప్రజలు కరకట్టపైకి వచ్చి ఎప్పటికప్పుడు వరదను పరిశీలిస్తూ ఎక్కడైనా లీకేజీలు, గండ్లు పడే ప్రమాదం ఉందా? అని గమనిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

కృష్ణాపరిరక్షణ విభాగం అధికారులు స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని కట్టను బలోపేతం చేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెం వద్ద కట్టకు చేరువగా వరద రావడంతో గ్రామస్థులు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. వల్లభాపురం వద్ద వాగు నీరు నదిలోకి వెళ్లడానికి వీలుగా ఏర్పాటుచేసిన స్లూయిజ్‌ గేటు వద్ద లీకేజీ ఉండటంతో అధికారులు ఇసుక బస్తాలతో కట్టడి చేశారు. పిడపర్రు వద్ద మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇసుక బస్తాలు వేసి కట్ట బలోపేతం చేసే పనుల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు పెదపులివర్రు వద్ద కరకట్ట వెంట అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఐదుచోట్ల కట్టపైకి నీరు రావడం స్థానికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఎవరికివారు మట్టికట్టలు, ఇసుకబస్తాలు వేసి కట్టను కాపాడుకునే ప్రయత్నం చేశారు.

బుడమేరు ప్రళయం ఎఫెక్ట్ - వరద గుప్పిట్లో అల్లాడుతున్న జనం - Vijayawada Floods

యంత్రాంగం కూడా అక్కడికి చేరుకుని లారీల్లో మట్టి, ఇసుక తెప్పించి కరకట్టను తాత్కాలికంగా ఎత్తు పెంచారు. అయినప్పటికీ వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో కట్ట గండిపడుతుందేమోనని భయాందోళనలు స్థానికులను వెంటాడుతున్నాయి. దీంతో పెదపులివర్రు గ్రామంలో ప్రజలను అప్రమత్తం చేశారు. గండి పడే ప్రమాదం ఉన్నందున గ్రామం ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో అందరూ అవసరమైన మేర సామాన్లు సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీనికి దిగువన ఓలేరు, రావిఅనంతపురం వద్ద కూడా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి.

అధికారులు కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తు చర్యలు చేపట్టారు. త్వరలో పూర్తిస్థాయిలో కరకట్ట బలోపేతం చేయటానికి అవసరమైన చర్యలు, చేయాల్సిన పనులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. కరకట్టకు గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాత్రిపూటా అధికారుల్ని ఉంచి గండం గట్టెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరకట్టకు ఎక్కడ గండి పడినా ఊహించని నష్టం జరుగుతుందని దివిసీమ ప్రజలు కరకట్ట బలహీనంగా ఉన్నచోట్ల తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్‌ కోరారు.

వరద బాధితులకు పటిష్ట సహాయ చర్యలు - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ - first time used drones in ap

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.