ETV Bharat / state

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద స్పల్పంగా తగ్గిన వరద ఉద్ధృతి - 11.14 లక్షల క్యూసెక్కులకు తగ్గిన ఇన్​ఫ్లో - WATER FLOW IN PRAKASAM BARRAGE

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2024, 9:05 PM IST

Updated : Sep 2, 2024, 9:19 PM IST

Flood Flow Increasing in Vijayawada Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి స్పల్పంగా తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. బ్యారేజ్‌ వద్ద వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. బ్యారేజ్‌ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడు ప్రకాశం బ్యారేజీ వద్ద పరిశీలించారు.

krishna flood
krishna flood (ETV Bharat)

Flood Flow Increasing in Vijayawada Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి స్పల్పంగా తగ్గింది. బ్యారేజీ మొత్తం 70 గేట్లు ఎత్తి 11.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 24.7 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. బ్యారేజ్‌ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గేట్ల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు.

ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. పెరుగుతున్న కృష్ణా నది ఉద్ధృతితో పరీవాహక ప్రాంతం ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ వైపు వచ్చే మార్గాల్లో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బ్యారేజ్‌ వద్ద బోటు ఢీకొనడంతో 69వ పిల్లర్‌ దెబ్బతినగా 67, 68, 69 పిల్లర్ల మధ్య ఐదు ఇసుక బోట్లు కొట్టుకొచ్చాయి.

ప్రకాశం బ్యారేజ్​కు అడ్డంగా నిలిచిన బోట్లు- దెబ్బతిన్న పిల్లర్​ను పరిశీలించనున్న కన్నయ్య నాయుడు - Prakasam Barrage

నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువచ్చారు. ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను ఆయన పరిశీలించారు. కన్నయనాయుడు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రకాశం బ్యారేజ్‌కు 4 బోట్లు కొట్టుకురావటం వెనుక వైఎస్సార్సీపీ కుట్ర ఉండొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు అంత దుర్మార్గం చేయగల ఘనులేనని విమర్శించారు. గేట్ల నిపుణుడు కన్నయనాయుడు సలహాతో రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మరమ్మతు పనులు చేస్తారన్నారు. బుడమేరుకు పడిన 3 గండ్లను ఈ రాత్రికి పూడ్చే ప్రయత్నం చేస్తామన్నారు.

అమరావతిపై ఫేక్ న్యూస్ నమ్మెద్దు- అదంతా పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్ల దుష్ప్రచారం : మంత్రి నిమ్మల

అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి నీటి విడుదలతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. యనమలకుదురు సమీపంలో రక్షణగోడకు సమాతరంగా వరద ప్రవహిస్తోంది. రక్షణగోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.

మొద్దు నిద్ర వీడకుంటే ఎలా? - అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - Chandrababu Reviews on Floods

Flood Flow Increasing in Vijayawada Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి స్పల్పంగా తగ్గింది. బ్యారేజీ మొత్తం 70 గేట్లు ఎత్తి 11.27 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 24.7 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. బ్యారేజ్‌ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గేట్ల మరమ్మతులకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు.

ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. గేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారడంతో నీరంతా నిలిచిపోయింది. పెరుగుతున్న కృష్ణా నది ఉద్ధృతితో పరీవాహక ప్రాంతం ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ వైపు వచ్చే మార్గాల్లో రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. బ్యారేజ్‌ వద్ద బోటు ఢీకొనడంతో 69వ పిల్లర్‌ దెబ్బతినగా 67, 68, 69 పిల్లర్ల మధ్య ఐదు ఇసుక బోట్లు కొట్టుకొచ్చాయి.

ప్రకాశం బ్యారేజ్​కు అడ్డంగా నిలిచిన బోట్లు- దెబ్బతిన్న పిల్లర్​ను పరిశీలించనున్న కన్నయ్య నాయుడు - Prakasam Barrage

నదిలో ఉన్న బోట్లను తీసే సాధ్యసాధ్యాలపై, అలాగే బ్యారేజీ పటిష్టత గురించి తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడుని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు తీసుకువచ్చారు. ఇరుక్కుపోయిన బోట్లు, బ్యారేజి పటిష్టతను ఆయన పరిశీలించారు. కన్నయనాయుడు సలహా మేరకు బోట్లు తీసే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

ప్రకాశం బ్యారేజ్‌కు 4 బోట్లు కొట్టుకురావటం వెనుక వైఎస్సార్సీపీ కుట్ర ఉండొచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు అంత దుర్మార్గం చేయగల ఘనులేనని విమర్శించారు. గేట్ల నిపుణుడు కన్నయనాయుడు సలహాతో రాత్రికి ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మరమ్మతు పనులు చేస్తారన్నారు. బుడమేరుకు పడిన 3 గండ్లను ఈ రాత్రికి పూడ్చే ప్రయత్నం చేస్తామన్నారు.

అమరావతిపై ఫేక్ న్యూస్ నమ్మెద్దు- అదంతా పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్ల దుష్ప్రచారం : మంత్రి నిమ్మల

అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బ్యారేజీ నుంచి నీటి విడుదలతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. యనమలకుదురు సమీపంలో రక్షణగోడకు సమాతరంగా వరద ప్రవహిస్తోంది. రక్షణగోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీట మునిగే ప్రమాదం ఉంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.

మొద్దు నిద్ర వీడకుంటే ఎలా? - అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం - Chandrababu Reviews on Floods

Last Updated : Sep 2, 2024, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.