ETV Bharat / state

నల్లగా ఉందని ఊపిరాడకుండా చేసి 18 నెలల పసిబిడ్డ హత్య! - father killed daughter

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 12:52 PM IST

Father Killed Child Because She Born With Black: నల్లగా జన్మించిందని ముక్కు, నోరు మూసి ఊపిరందకుండా చేసి 18 నెలల వయసున్న కుమార్తెను దారుణంగా హత్య చేశాడో తండ్రి. పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగా ఉందని భర్త, అత్త, మామలు దగ్గరికి రానీయకుండా ఆ చిన్నారిని హింసించే వారిని తల్లి వాపోయింది. గతంలో రెండు సార్లు చిన్నారిని హతమార్చేందుకు ప్రయత్నించినట్టు ఆమె తెలిపారు.

Father_Killed_Child_Because_She_Born_With_Black_at_Palnadu
Father_Killed_Child_Because_She_Born_With_Black_at_Palnadu

నల్లగా ఉందని కుమార్తెను హత్య చేసిన తండ్రి- ఊపిరాడకుండా హింసించి ప్రాణం తీసిన ఘటన

Father Killed Child Because She Born With Black at Palnadu: కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రే కాలయముడైయ్యాడు. మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరించి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీశాడు. నల్లగా పుట్టిందనే కారణంతో ముక్కు, నోరు మూసి ఊపిరందకుండా చేసి చిన్నారిని హత్య చేశాడని చిన్నారని తల్లి ఆరోపిస్తోంది. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భార్యతో గొడవ.. కోపంలో ఏడేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి

మృతురాలి తల్లి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని పేటసన్నెగండ్లకు చెందిన మహేష్​కు మూడేళ్ల క్రితం బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన శ్రావణితో వివాహం జరిగింది. వీరికి 18 నెలల కిందట అక్షయ అనే కుమార్తె జన్మించింది. బిడ్డ నల్లగా పుట్టిందని భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు తరచూ హింసించేవారని, కనీసం ఆ పాపను దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదని శ్రావణి పేర్కొన్నారు.

అత్తింటివారు వేధింపులు గురిచేసినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని శ్రావణి తెలిపారు. గత నెల 31వ తేదీ తెల్లవారుజామున అక్షయ ముక్కు వెంట రక్తం కారుతూ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన శ్రావణి వెంటనే అప్రమత్తమైంది. భర్త మహేష్, అత్తమామలను చెప్పడంతో వెంటనే ద్విచక్రవాహనంపై చిన్నారిని తీసుకుని కారంపూడిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని శ్రావణి తెలిపారు. మృతదేహాన్ని తీసుకుని భర్తతో కలిసి ఇంటికి వస్తున్న క్రమంలో అక్షయ ఫిట్స్​తో చనిపోయినట్టు బంధువులకు చెప్పాలని లేకపోతే చంపేస్తాని భర్త హెచ్చరించినట్టు శ్రావణి తెలిపారు.

ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి

అనంతరం హడావుడిగా చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. ఇటీవల శ్రావణి తల్లి అంకాళమ్మ కూతురి దగ్గరకు వచ్చింది. భార్య శ్రావణి, అత్త అంకాళమ్మపై మహేష్, అతని కుటుంబ సభ్యులు​ నిఘా పెట్టాడు. ఫోన్​ కూడా మాట్లాడనివ్వకుండా చేశారు. ఫలితంగా శ్రావణి తల్లికి అనుమానం వచ్చి నిలదీసి పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టారు.

దీంతో శ్రావణి అసలు బుధవారం విషయం బయట పెట్టింది. బిడ్డ నల్లగా ఉందని గతంలో రెండు దఫాలుగా హతమార్చేందుకు యత్నించాడని పేర్కొంది. ఓసారి గోడకు విసిరి కొట్టి గదిలో పడేసి తాళం వేశాడని, మరోసారి నీళ్ల తొట్టెలో ముంచారని తెలిపింది. తన భర్తే బిడ్డను హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లయ్య విచారణ చేపట్టారు. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. చిన్నారి మృతిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ అప్పారావు, సభ్యురాలు పద్మావతి కిందస్థాయి అధికారులను ఆదేశించారు.

" పాప నల్లగా ఉందని అసలు దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. కనీసం పాపను ముట్టుకునేవారు కూడా కాదు. గతంలో రెండు సార్లు హత్యాయత్నానికి ప్రయత్నించారు." -చిన్నారి తల్లి శ్రావణి

కుమార్తెను హత్య చేసి సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ వీడియో పోస్టు

నల్లగా ఉందని కుమార్తెను హత్య చేసిన తండ్రి- ఊపిరాడకుండా హింసించి ప్రాణం తీసిన ఘటన

Father Killed Child Because She Born With Black at Palnadu: కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడవలసిన తండ్రే కాలయముడైయ్యాడు. మానవత్వం మరిచి కర్కశంగా వ్యవహరించి అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు తీశాడు. నల్లగా పుట్టిందనే కారణంతో ముక్కు, నోరు మూసి ఊపిరందకుండా చేసి చిన్నారిని హత్య చేశాడని చిన్నారని తల్లి ఆరోపిస్తోంది. పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భార్యతో గొడవ.. కోపంలో ఏడేళ్ల కూతురిని కడతేర్చిన తండ్రి

మృతురాలి తల్లి శ్రావణి తెలిపిన వివరాల ప్రకారం, మండలంలోని పేటసన్నెగండ్లకు చెందిన మహేష్​కు మూడేళ్ల క్రితం బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన శ్రావణితో వివాహం జరిగింది. వీరికి 18 నెలల కిందట అక్షయ అనే కుమార్తె జన్మించింది. బిడ్డ నల్లగా పుట్టిందని భర్తతో పాటు అతడి తల్లిదండ్రులు తరచూ హింసించేవారని, కనీసం ఆ పాపను దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదని శ్రావణి పేర్కొన్నారు.

అత్తింటివారు వేధింపులు గురిచేసినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని శ్రావణి తెలిపారు. గత నెల 31వ తేదీ తెల్లవారుజామున అక్షయ ముక్కు వెంట రక్తం కారుతూ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన శ్రావణి వెంటనే అప్రమత్తమైంది. భర్త మహేష్, అత్తమామలను చెప్పడంతో వెంటనే ద్విచక్రవాహనంపై చిన్నారిని తీసుకుని కారంపూడిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని శ్రావణి తెలిపారు. మృతదేహాన్ని తీసుకుని భర్తతో కలిసి ఇంటికి వస్తున్న క్రమంలో అక్షయ ఫిట్స్​తో చనిపోయినట్టు బంధువులకు చెప్పాలని లేకపోతే చంపేస్తాని భర్త హెచ్చరించినట్టు శ్రావణి తెలిపారు.

ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి

అనంతరం హడావుడిగా చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. ఇటీవల శ్రావణి తల్లి అంకాళమ్మ కూతురి దగ్గరకు వచ్చింది. భార్య శ్రావణి, అత్త అంకాళమ్మపై మహేష్, అతని కుటుంబ సభ్యులు​ నిఘా పెట్టాడు. ఫోన్​ కూడా మాట్లాడనివ్వకుండా చేశారు. ఫలితంగా శ్రావణి తల్లికి అనుమానం వచ్చి నిలదీసి పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టారు.

దీంతో శ్రావణి అసలు బుధవారం విషయం బయట పెట్టింది. బిడ్డ నల్లగా ఉందని గతంలో రెండు దఫాలుగా హతమార్చేందుకు యత్నించాడని పేర్కొంది. ఓసారి గోడకు విసిరి కొట్టి గదిలో పడేసి తాళం వేశాడని, మరోసారి నీళ్ల తొట్టెలో ముంచారని తెలిపింది. తన భర్తే బిడ్డను హత్య చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ మల్లయ్య విచారణ చేపట్టారు. శుక్రవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు. చిన్నారి మృతిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ అప్పారావు, సభ్యురాలు పద్మావతి కిందస్థాయి అధికారులను ఆదేశించారు.

" పాప నల్లగా ఉందని అసలు దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. కనీసం పాపను ముట్టుకునేవారు కూడా కాదు. గతంలో రెండు సార్లు హత్యాయత్నానికి ప్రయత్నించారు." -చిన్నారి తల్లి శ్రావణి

కుమార్తెను హత్య చేసి సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీ వీడియో పోస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.