ETV Bharat / state

ఇదెక్కడి లెక్కరా సామి - బస్సు మళ్లింపులకు సైతం మా దగ్గరే వసూలా? - Bus Ticket Extra Price Collected

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 10:46 PM IST

Extra Bus Ticket Price Collected From Passengers : హనుమకొండ నయీంనగర్ వంతెన నిర్మాణ పనులు సాగుతున్నాయ్. కరీంనగర్​కు వెళ్లే ఆర్టీసీ బస్సులను దారి మళ్లించి, కేయూ క్రాస్ రోడ్ మీదుగా నడుపుతున్నారు. అయితే ఇందుకోసం ప్రయాణికులకు అరగంట సమయం ఎక్కువే పడుతోంది. దీనితోపాటుగా పది రూపాయాల మేర అదనంగా వసూలు చేయడంతో, ఇదెక్కడి భారం అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

Bus Ticket Fare Extra Collected at Karimnagar
Extra Bus Ticket Price Collected From Passengers (ETV Bharat)

Bus Ticket Fare Extra Collected at Karimnagar : నిత్యం రద్దగీ ఉండే మార్గాల్లో హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లే మార్గం కూడా ఒకటి. వరద ముంపు ఎదుర్కొంటుండంతో, ఈ మా‌ర్గంలో హనుమకొండ నయీంనగర్ నాలా విస్తరణ పనుల్లో భాగంగా ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్​లోనే పనులు మొదలయ్యాయి. మూడు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పినా, ఇంతవరకూ పనులు పూర్తికాలేదు.

వర్షాకాలం కావడంతో పనులకు అడపాదడపా ఆటంకం కలుగుతుంది. వంతెన నిర్మాణం చేస్తుండడంతో, హనుమకొండ నుంచి కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట, హుస్నాబాద్, హూజూరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను ములుగు రోడ్ కేయూ క్రాస్ రోడ్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో నాలుగు కిటోమీటర్ల మేర దురాభారం పెరిగింది.

తక్షణమే అదనపు భారాన్ని తగ్గించాలి : ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికుల పైనే వేస్తోంది. ఆర్టీసీ లెక్కల ప్రకారమే, నాలుగు కిలోమీటర్లకు 6 రూపాయలు కాగా రౌండ్​ఫిగర్ పేరుతో పది రూపాయల ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. ఓ వైపు చుట్టూ తిరిగి వెళ్లేందుకు అరగంట సమయం వృధా కావడమే కాకుండా, అదనంగా పది రూపాయలు వసూలు చేయడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు. తక్షణమే అదనపు భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.

"గత ఆరు నెలలుగా ఆ బ్రిడ్జి నిర్మాణం అవుతూనే ఉంది. ఆ రూట్​లలో బస్సుల్లో వెళ్లే మాకు ప్రయాణ రుసుము అదనంగా వసూలు చేస్తున్నారు. రూ.10 ఎక్కువ ఛార్జి అవ్వటమే కాకుండా, సమయం కూడా వృధా అవుతుంది. ఏదేమైనా సరే ఇలా బస్సు దారి మళ్లింపునకు, మమ్మల్ని భాదితులను చేస్తూ మా దగ్గర ఎక్స్​ట్రా మనీ కలెక్ట్​ చేయడం కరెక్ట్​ కాదు." -ప్రయాణికులు

Financial Burden of Passengers : ఈ మార్గంలో రోజూ 200 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. దాదాపు పదివేల మంది, ప్రయాణికులు బస్సుల్లో తిరుగుతుంటే వీరందరిపైనా ఇప్పుడు అదనపు భారం పడుతోంది. కరీంనగర్ వైపు వెళ్లే బస్సులను, ములుగు రోడ్​ పెద్దమ్మగడ్డ, కేయూ క్రాస్ రోడ్ మీదుగా కాకుండా అంబేడ్కర్ కూడలి నుంచి కూడా మరో మార్గంలో బస్సులను నడపచ్చు.

ఇలా చేస్తే అదనపు కిలోమీటర్ల భారం ఉండనే ఉండదు కానీ ట్రాఫిక్ ఇబ్బందులనే కారణంతో, ఈ మార్గంలో బస్సులు నడిపట్లేదు. ఫలితంగా కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారంతో పాటు సమయమూ వృధా అవుతుంది. ఆర్టీసీ అధికారులు మాత్రం వంతెన నిర్మాణం పూర్తికాగానే పాత ఛార్జీలే వసూలు చేస్తామని చెపుతుంటే, అప్పటిదాకా నైనా మాకెందుకీ అదనపు భారం అని ప్రయాణికులు వాపోతున్నారు.

ఆర్టీసీ బస్సు బీభత్సం - నలుగురికి తీవ్ర గాయాలు - నిలిచిపోయిన ట్రాఫిక్ - Bus Accident in Suraram

ఆర్టీసీ బస్సులో ప్రసవం - మహిళా కండక్టర్ మానవత్వం - అభినందించిన మంత్రి పొన్నం - Woman Delivers in RTC Bus

Bus Ticket Fare Extra Collected at Karimnagar : నిత్యం రద్దగీ ఉండే మార్గాల్లో హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లే మార్గం కూడా ఒకటి. వరద ముంపు ఎదుర్కొంటుండంతో, ఈ మా‌ర్గంలో హనుమకొండ నయీంనగర్ నాలా విస్తరణ పనుల్లో భాగంగా ఇక్కడ వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్​లోనే పనులు మొదలయ్యాయి. మూడు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పినా, ఇంతవరకూ పనులు పూర్తికాలేదు.

వర్షాకాలం కావడంతో పనులకు అడపాదడపా ఆటంకం కలుగుతుంది. వంతెన నిర్మాణం చేస్తుండడంతో, హనుమకొండ నుంచి కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, వేములవాడ, సిద్దిపేట, హుస్నాబాద్, హూజూరాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ఇతర వాహనాలను ములుగు రోడ్ కేయూ క్రాస్ రోడ్ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో నాలుగు కిటోమీటర్ల మేర దురాభారం పెరిగింది.

తక్షణమే అదనపు భారాన్ని తగ్గించాలి : ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికుల పైనే వేస్తోంది. ఆర్టీసీ లెక్కల ప్రకారమే, నాలుగు కిలోమీటర్లకు 6 రూపాయలు కాగా రౌండ్​ఫిగర్ పేరుతో పది రూపాయల ఛార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేస్తోంది. ఓ వైపు చుట్టూ తిరిగి వెళ్లేందుకు అరగంట సమయం వృధా కావడమే కాకుండా, అదనంగా పది రూపాయలు వసూలు చేయడాన్ని ప్రయాణికులు తప్పుబడుతున్నారు. తక్షణమే అదనపు భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు.

"గత ఆరు నెలలుగా ఆ బ్రిడ్జి నిర్మాణం అవుతూనే ఉంది. ఆ రూట్​లలో బస్సుల్లో వెళ్లే మాకు ప్రయాణ రుసుము అదనంగా వసూలు చేస్తున్నారు. రూ.10 ఎక్కువ ఛార్జి అవ్వటమే కాకుండా, సమయం కూడా వృధా అవుతుంది. ఏదేమైనా సరే ఇలా బస్సు దారి మళ్లింపునకు, మమ్మల్ని భాదితులను చేస్తూ మా దగ్గర ఎక్స్​ట్రా మనీ కలెక్ట్​ చేయడం కరెక్ట్​ కాదు." -ప్రయాణికులు

Financial Burden of Passengers : ఈ మార్గంలో రోజూ 200 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. దాదాపు పదివేల మంది, ప్రయాణికులు బస్సుల్లో తిరుగుతుంటే వీరందరిపైనా ఇప్పుడు అదనపు భారం పడుతోంది. కరీంనగర్ వైపు వెళ్లే బస్సులను, ములుగు రోడ్​ పెద్దమ్మగడ్డ, కేయూ క్రాస్ రోడ్ మీదుగా కాకుండా అంబేడ్కర్ కూడలి నుంచి కూడా మరో మార్గంలో బస్సులను నడపచ్చు.

ఇలా చేస్తే అదనపు కిలోమీటర్ల భారం ఉండనే ఉండదు కానీ ట్రాఫిక్ ఇబ్బందులనే కారణంతో, ఈ మార్గంలో బస్సులు నడిపట్లేదు. ఫలితంగా కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారంతో పాటు సమయమూ వృధా అవుతుంది. ఆర్టీసీ అధికారులు మాత్రం వంతెన నిర్మాణం పూర్తికాగానే పాత ఛార్జీలే వసూలు చేస్తామని చెపుతుంటే, అప్పటిదాకా నైనా మాకెందుకీ అదనపు భారం అని ప్రయాణికులు వాపోతున్నారు.

ఆర్టీసీ బస్సు బీభత్సం - నలుగురికి తీవ్ర గాయాలు - నిలిచిపోయిన ట్రాఫిక్ - Bus Accident in Suraram

ఆర్టీసీ బస్సులో ప్రసవం - మహిళా కండక్టర్ మానవత్వం - అభినందించిన మంత్రి పొన్నం - Woman Delivers in RTC Bus

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.