ETV Bharat / state

విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ కోసం లంచం డిమాండ్​ - ఏసీబీకి చిక్కిన ఏఈ

Employee Caught Red Handed to Authorities while Taking Bribe: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఒక అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కుకుంది. విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్​ కోసం అప్లై చేసుకున్న రైతు నుండి గురువారం రాత్రి గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వేదికగా లంచం తీసుకుంటుండగా కాపు కాసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 3:17 PM IST

Employee_Caught_Red_Handed_to_Authorities_while_Taking_Bribe
Employee_Caught_Red_Handed_to_Authorities_while_Taking_Bribe

Electricity AE Caught-red-handed-to-acb : ప్రజల నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందించాల్సిన అధికారి డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పటం జగనన్న ప్రభుత్వంలో కామన్ అయిపోయింది. ప్రజలు పని జరగటం కోసం మరో మార్గం లేక అధికారులు డిమాండ్ చేసినంత లంచం ఇచ్చి కొందరు పని చేయించుకుంటున్నారు. మరికొందరు అధికారులు డిమాండ్ చేసినంత చెల్లించుకోలేక నిరాశతో వెనుతిరుగుతున్నారు. తాజాగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఒక అధికారి లంచం (Bribing) తీసుకుంటూ ఏసీబీ అధికారుల (ACB Officers)కు గురువారం పట్టుబట్టాడు. అధికారులు నిందితుని వద్ద నుంచి ఇరవై వేల రూపాయిలు స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో సబ్ ఇంజినీర్ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న అధికారులు

Anantapur Electricity Department Officer Demanded Bribe: ఏసీబీ అధికారి వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేయించారు. విద్యుత్ సప్లై కోసం వజ్రకరూరు విద్యుత్ శాఖలో ట్రాన్స్​ఫార్మర్​ కోసం ఏడాది క్రితం అప్లై చేశారు. ట్రాన్స్​ఫార్మర్​తో పాటు మెటీరియల్ మంజూరు అయినప్పటికీ విద్యుత్ శాఖ ఏఈ (Assistant Engineer) చంద్రశేఖర్ రైతు ఆనంద్​ను రూ. 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రైతు నేను అంత ఇచ్చుకోలేనని రూ.20 వేల రూపాయలు ఇచ్చే విధంగా భేరసారాలు కుదుర్చుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దర్శి ఎస్ఐ రామకృష్ణ

చంద్రశేఖర్​కు లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతు ఈ విషయం ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద లంచం ఇవ్వడానికి చంద్రశేఖర్​తో ఒప్పందం కుదుర్చుకున్నామని రైతు ఏసీబీ అధికారులకు తెలియజేయటంతో కాపు కాశారు. ఈ తరుణంలో రైతు ఆనంద్ లంచం ఇస్తుండగా ముందుగా అక్కడే కాపు కాచిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా చంద్రశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ. 20 వేల నగదును స్వాధీనం చేసుకొని గుత్తి పట్టణంలోని ఏపీఎస్​పీడీసీఎల్ ​(AP Southern Power Distribution Company Limited) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయానికి నిందితున్ని తరలించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరిపి అనంతరం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారి వెంకటాద్రి వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారి ఎవరైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే టోల్​ఫ్రీ నెంబర్ 14400 డయిల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారి సూచించారు.

విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ కోసం లంచం డిమాండ్​ - ఏసీబీకి చిక్కిన ఏఈ

లంచం తీసుకునేందుకు కింది స్థాయి ఉద్యోగిని నియమించిన అధికారిణి- ఏసీబీకి రెడ్ హ్యాండ్​గా పట్టుబడిన వైనం

Electricity AE Caught-red-handed-to-acb : ప్రజల నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందించాల్సిన అధికారి డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పటం జగనన్న ప్రభుత్వంలో కామన్ అయిపోయింది. ప్రజలు పని జరగటం కోసం మరో మార్గం లేక అధికారులు డిమాండ్ చేసినంత లంచం ఇచ్చి కొందరు పని చేయించుకుంటున్నారు. మరికొందరు అధికారులు డిమాండ్ చేసినంత చెల్లించుకోలేక నిరాశతో వెనుతిరుగుతున్నారు. తాజాగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఒక అధికారి లంచం (Bribing) తీసుకుంటూ ఏసీబీ అధికారుల (ACB Officers)కు గురువారం పట్టుబట్టాడు. అధికారులు నిందితుని వద్ద నుంచి ఇరవై వేల రూపాయిలు స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో సబ్ ఇంజినీర్ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న అధికారులు

Anantapur Electricity Department Officer Demanded Bribe: ఏసీబీ అధికారి వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేయించారు. విద్యుత్ సప్లై కోసం వజ్రకరూరు విద్యుత్ శాఖలో ట్రాన్స్​ఫార్మర్​ కోసం ఏడాది క్రితం అప్లై చేశారు. ట్రాన్స్​ఫార్మర్​తో పాటు మెటీరియల్ మంజూరు అయినప్పటికీ విద్యుత్ శాఖ ఏఈ (Assistant Engineer) చంద్రశేఖర్ రైతు ఆనంద్​ను రూ. 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రైతు నేను అంత ఇచ్చుకోలేనని రూ.20 వేల రూపాయలు ఇచ్చే విధంగా భేరసారాలు కుదుర్చుకున్నారు.

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దర్శి ఎస్ఐ రామకృష్ణ

చంద్రశేఖర్​కు లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతు ఈ విషయం ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద లంచం ఇవ్వడానికి చంద్రశేఖర్​తో ఒప్పందం కుదుర్చుకున్నామని రైతు ఏసీబీ అధికారులకు తెలియజేయటంతో కాపు కాశారు. ఈ తరుణంలో రైతు ఆనంద్ లంచం ఇస్తుండగా ముందుగా అక్కడే కాపు కాచిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా చంద్రశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ. 20 వేల నగదును స్వాధీనం చేసుకొని గుత్తి పట్టణంలోని ఏపీఎస్​పీడీసీఎల్ ​(AP Southern Power Distribution Company Limited) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయానికి నిందితున్ని తరలించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరిపి అనంతరం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారి వెంకటాద్రి వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారి ఎవరైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే టోల్​ఫ్రీ నెంబర్ 14400 డయిల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారి సూచించారు.

విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ కోసం లంచం డిమాండ్​ - ఏసీబీకి చిక్కిన ఏఈ

లంచం తీసుకునేందుకు కింది స్థాయి ఉద్యోగిని నియమించిన అధికారిణి- ఏసీబీకి రెడ్ హ్యాండ్​గా పట్టుబడిన వైనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.