ETV Bharat / state

'చిరుత ఆ ప్రాంతంలోనే సంచరిస్తోంది - ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలి' - DFO ON LEOPARD ROAMING

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 10:43 PM IST

DFO Bharani on Leopard Roaming : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోందని డీఎఫ్‌వో భరణి తెలిపారు. చిరుత జాడ కనిపెట్టేందుకు 50 ట్రాప్ కెమెరాలు, నాలుగు బోన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శివారు గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

DFO Bharani on Leopard Roaming
DFO Bharani on Leopard Roaming (ETV Bharat)

DFO Bharani on Leopard Roaming : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తున్న ఫొటోలు, దృశ్యాలు, అటవీ శాఖ ట్రాప్ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. దీంతో చిరుత కదలికలపై అధికారులు మరింత నిఘా పెంచారు. చిరుత సంచరిస్తున్న శివారు ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిరుత సంచరిస్తున్న దృశ్యాలు : రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోని రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జాతీయ రహదారి- 16కు ఇరువైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నోటిలో ఓ జంతువుని పట్టుకోని చిరుత జాతీయ రహదారి దాటుతోందని అటవీ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆకాశవాణి, ప్రసారభారతి కేంద్రాల పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ చిరుత ఫొటో రికార్డయింది. దీంతో రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్థారించారు.

"రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోంది. దివాన్ చెరువు వద్ద ఆటోనగర్ గోడపై రాత్రి తిరిగినట్టు స్థానికుల నుంచి సమాచారం అందింది. ఇప్పటివరకూ చిరుత కదలికలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వర్షం కురుస్తుండటంవల్ల పాదముద్రలు కూడా చిక్కడం లేదు. అది మగ చిరుతగా గుర్తించాం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు రాత్రి వేళల్లో పొలాల్లో పడుకోవద్దు. అలాగే ఉదయాన్నే ఒంటరిగా బయటకి రావద్దు. ఇళ్ల వద్ద రాత్రి సమయంలో లైట్లు వేసుకోవాలి." - భరణి, ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో

ఆ ప్రాంతంలోనే తిష్టవేసిన చిరుత : చిరుత కదలిలకపై మరింత నిఘా పెట్టిన అటవీ సిబ్బంది 36 ట్రాప్ కెమెరాలు అమర్చారు. రెండు బోన్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర అటవీ శిక్షణా కేంద్రం, మొక్కల పరిశోధన కేంద్రం, పుష్కర నగర వనం పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 920 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. అలాగే వివిధ రకాల ఉద్యాన వనాలు, తోటలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం చిరుత ఈ పరిసరాల్లోనే తిష్టవేసింది.

చిరుత పాదముద్రల కోసం వెతుకులాట :చిరుతకి నాలుగేళ్ల వయస్సు ఉంటుందని అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎక్కడి నుంచైనా వచ్చిందా లేక స్థానికంగానే ఉందా అన్నది తేలాల్సి ఉంది. చిరుత వచ్చిన దారిలో తిరిగి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.

"ఆపరేషన్ చిరుత"- రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో అటవీశాఖ అలర్ట్ - LEOPARD SPOTTED IN RAJAHMUNDRY

రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక - Cheetah in East Godavari

DFO Bharani on Leopard Roaming : తూర్పుగోదావరి జిల్లాలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తున్న ఫొటోలు, దృశ్యాలు, అటవీ శాఖ ట్రాప్ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. దీంతో చిరుత కదలికలపై అధికారులు మరింత నిఘా పెంచారు. చిరుత సంచరిస్తున్న శివారు ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిరుత సంచరిస్తున్న దృశ్యాలు : రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోని రాజానగరం మండలం దివాన్ చెరువు పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జాతీయ రహదారి- 16కు ఇరువైపులా విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున నోటిలో ఓ జంతువుని పట్టుకోని చిరుత జాతీయ రహదారి దాటుతోందని అటవీ అధికారులకు సమాచారం అందింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న ఆకాశవాణి, ప్రసారభారతి కేంద్రాల పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు వెలుగుచూశాయి. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ చిరుత ఫొటో రికార్డయింది. దీంతో రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్థారించారు.

"రాజమహేంద్రవరం శివారు ప్రాంతంలోనే చిరుత సంచరిస్తోంది. దివాన్ చెరువు వద్ద ఆటోనగర్ గోడపై రాత్రి తిరిగినట్టు స్థానికుల నుంచి సమాచారం అందింది. ఇప్పటివరకూ చిరుత కదలికలపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. వర్షం కురుస్తుండటంవల్ల పాదముద్రలు కూడా చిక్కడం లేదు. అది మగ చిరుతగా గుర్తించాం. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతులు రాత్రి వేళల్లో పొలాల్లో పడుకోవద్దు. అలాగే ఉదయాన్నే ఒంటరిగా బయటకి రావద్దు. ఇళ్ల వద్ద రాత్రి సమయంలో లైట్లు వేసుకోవాలి." - భరణి, ఇన్‌ఛార్జి డీఎఫ్‌వో

ఆ ప్రాంతంలోనే తిష్టవేసిన చిరుత : చిరుత కదలిలకపై మరింత నిఘా పెట్టిన అటవీ సిబ్బంది 36 ట్రాప్ కెమెరాలు అమర్చారు. రెండు బోన్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర అటవీ శిక్షణా కేంద్రం, మొక్కల పరిశోధన కేంద్రం, పుష్కర నగర వనం పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా సుమారు 920 ఎకరాల్లో రిజర్వ్ ఫారెస్ట్ విస్తరించి ఉంది. అలాగే వివిధ రకాల ఉద్యాన వనాలు, తోటలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రస్తుతం చిరుత ఈ పరిసరాల్లోనే తిష్టవేసింది.

చిరుత పాదముద్రల కోసం వెతుకులాట :చిరుతకి నాలుగేళ్ల వయస్సు ఉంటుందని అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎక్కడి నుంచైనా వచ్చిందా లేక స్థానికంగానే ఉందా అన్నది తేలాల్సి ఉంది. చిరుత వచ్చిన దారిలో తిరిగి వెళ్లేలా చర్యలు చేపడుతున్నారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.

"ఆపరేషన్ చిరుత"- రాజమహేంద్రవరం శివారు ప్రాంతాల్లో అటవీశాఖ అలర్ట్ - LEOPARD SPOTTED IN RAJAHMUNDRY

రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక - Cheetah in East Godavari

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.