ETV Bharat / state

'మీ ఫోన్​లో ఏం చేస్తున్నారు? ఇంకేం చూస్తున్నారో మాకు అన్నీ తెలుసు' - Cyber Crimes In Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2024, 12:48 PM IST

Cyber Crimes In Hyderabad : మీ ఐపీ అడ్రస్‌తో అశ్లీల వీడియోలు చూస్తున్నారు. 24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలి. లేదంటే అరెస్టు చేస్తామని కాల్స్‌ వస్తే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు సైబర్‌ క్రైమ్ పోలీసులు. రోజుకో పంథాలో నేరాలకు పాల్పడుతున్న ఈ కేటుగాళ్లు, తాజాాగా ఈ రూట్‌లో డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు.

New Trends In Cyber Crime
New Trends In Cyber Crime (ETV Bharat)

New Trends In Cyber Crime : స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజలపై ఎలా ప్రభావితం చూపుతుందో రోజూ చూస్తూనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా ఇష్టమైన వీడియోలు చూస్తున్నారు. అశ్లీల వెబ్‌సైట్లను చూసినప్పుడు ప్రైవసీ పాటించే ఆప్షన్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఉన్నఫలంగా ఫోన్‌ వచ్చి, మీ ఐపీ అడ్రస్‌తో ఏం చేస్తున్నారు? ఇంకేం చూస్తున్నారో మాకు అన్నీ తెలుసంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సప్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామాకు హెచ్చరికలు వస్తే కచ్చితంగా హడలెత్తిపోతాం. దీన్నే ఆసరాగా తీసుకొని కొత్త పంథాలో దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. బాధితులను భయపెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు.

ఈ తరహా ఫిర్యాదులు రోజూ 10 వరకు వస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులమంటూ బెదిరించి రూ.లక్షలు దోచుకుంటున్నారని వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. దిల్లీ, ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, స్టేట్‌ సైబర్‌ సెల్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల అశ్లీల వీడియోలు చూస్తున్నారని, తమ పరిశోధన విభాగం నిఘాలో మీ ఐపీ అడ్రస్‌లో వీడియోలు చూసినట్లు తేలిందని భయపెడతారు.

వృద్ధుడు నుంచి రూ.13.16 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు - దర్యాప్తులో పాన్​ ఇండియా సంబంధాలు బహిర్గతం - Stock Market Fraud In Hyderabad

దీనికి 24 గంటల్లో సమాధానం రాకుంటే, అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరిస్తారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసేలా తాము ఆదేశాలు జారీ చేస్తామని చెబుతారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు, అడిగినంత నగదును మాయగాళ్లకు ముట్టజెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర నిఘా, దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం లాంటివి చేయవని, వీడియో కాల్‌ ద్వారా విచారణ జరపటం చేయవని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులే ఫోన్ చేశామంటే ఏం చేయాలి : సికింద్రాబాద్‌కు చెందిన రిటైర్డ్ డాక్టర్‌కు సీబీఐ అధికారులమంటూ వాట్సప్ వీడియో కాల్ చేశారు. ఆమె పేరిట డ్రగ్స్‌, విదేశీ నగదు వచ్చాయని, మిమ్మల్ని అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు కావొద్దు అంటే రూ.కోటి ఇవ్వాలని నమ్మించి దోచేశారు. ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై బాధితురాలిని ప్రశ్నించగా అటు నుంచి ఫోన్‌ చేసిందే పోలీసులని చెబితే తాను ఇంకెవరిని ఆశ్రయించాలంటూ ఆమె అమాయకంగా సమాధానమిచ్చారని పోలీసు అధికారి తెలిపారు. కాల్ చేసి పోలీసులమంటేనే భయపడతారు, అది సీబీఐ, సైబర్ క్రైమ్ అధికారులంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు, వయోధికులు ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు. తమ ఆధార్, పాన్‌కార్డు, ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటిగా చెప్పేసరికి కాల్ చేసిన వ్యక్తి పోలీస్ అనుకుంటున్నారు.

పరువు పోతుందని భయపడి : వృద్ధులైతే ఈ వయసులో కేసులు, కోర్టులు తిరగటం ఎందుకని ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పడం లేదు. నగర శివారు ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి రూ.40 లక్షలు ముట్టచెప్పాడు. 3 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందోళనలో ఏం చేయాలో తెలీక ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

భారత్ పే ఎగ్జిక్యూటివ్ పేరుతో మోసం - కిరాణ యజమాని దగ్గర డబ్బులను కాజేసిన కేటుగాడు - Cyber Frud In Medak

సైబర్​ నేరాలతో రూ.3 కోట్లకు పైగా టోకరా - వరంగల్​లో తమిళనాడు దంపతుల అరెస్ట్

New Trends In Cyber Crime : స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజలపై ఎలా ప్రభావితం చూపుతుందో రోజూ చూస్తూనే ఉన్నాం. వయస్సుతో సంబంధం లేకుండా ఇష్టమైన వీడియోలు చూస్తున్నారు. అశ్లీల వెబ్‌సైట్లను చూసినప్పుడు ప్రైవసీ పాటించే ఆప్షన్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఉన్నఫలంగా ఫోన్‌ వచ్చి, మీ ఐపీ అడ్రస్‌తో ఏం చేస్తున్నారు? ఇంకేం చూస్తున్నారో మాకు అన్నీ తెలుసంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సప్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామాకు హెచ్చరికలు వస్తే కచ్చితంగా హడలెత్తిపోతాం. దీన్నే ఆసరాగా తీసుకొని కొత్త పంథాలో దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. బాధితులను భయపెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు.

ఈ తరహా ఫిర్యాదులు రోజూ 10 వరకు వస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ అధికారులమంటూ బెదిరించి రూ.లక్షలు దోచుకుంటున్నారని వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. దిల్లీ, ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, స్టేట్‌ సైబర్‌ సెల్, ఇంటెలిజెన్స్‌ బ్యూరో అంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. చిన్న పిల్లల అశ్లీల వీడియోలు చూస్తున్నారని, తమ పరిశోధన విభాగం నిఘాలో మీ ఐపీ అడ్రస్‌లో వీడియోలు చూసినట్లు తేలిందని భయపెడతారు.

వృద్ధుడు నుంచి రూ.13.16 కోట్లు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు - దర్యాప్తులో పాన్​ ఇండియా సంబంధాలు బహిర్గతం - Stock Market Fraud In Hyderabad

దీనికి 24 గంటల్లో సమాధానం రాకుంటే, అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరిస్తారు. స్థానిక పోలీసులు అరెస్ట్ చేసేలా తాము ఆదేశాలు జారీ చేస్తామని చెబుతారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు, అడిగినంత నగదును మాయగాళ్లకు ముట్టజెబుతున్నారు. రాష్ట్ర, కేంద్ర నిఘా, దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం లాంటివి చేయవని, వీడియో కాల్‌ ద్వారా విచారణ జరపటం చేయవని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు స్పష్టం చేశారు.

పోలీసులే ఫోన్ చేశామంటే ఏం చేయాలి : సికింద్రాబాద్‌కు చెందిన రిటైర్డ్ డాక్టర్‌కు సీబీఐ అధికారులమంటూ వాట్సప్ వీడియో కాల్ చేశారు. ఆమె పేరిట డ్రగ్స్‌, విదేశీ నగదు వచ్చాయని, మిమ్మల్ని అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు కావొద్దు అంటే రూ.కోటి ఇవ్వాలని నమ్మించి దోచేశారు. ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై బాధితురాలిని ప్రశ్నించగా అటు నుంచి ఫోన్‌ చేసిందే పోలీసులని చెబితే తాను ఇంకెవరిని ఆశ్రయించాలంటూ ఆమె అమాయకంగా సమాధానమిచ్చారని పోలీసు అధికారి తెలిపారు. కాల్ చేసి పోలీసులమంటేనే భయపడతారు, అది సీబీఐ, సైబర్ క్రైమ్ అధికారులంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు, వయోధికులు ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు. తమ ఆధార్, పాన్‌కార్డు, ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటిగా చెప్పేసరికి కాల్ చేసిన వ్యక్తి పోలీస్ అనుకుంటున్నారు.

పరువు పోతుందని భయపడి : వృద్ధులైతే ఈ వయసులో కేసులు, కోర్టులు తిరగటం ఎందుకని ఆందోళనకు గురవుతున్నారు. కొంతమంది విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పడం లేదు. నగర శివారు ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి రూ.40 లక్షలు ముట్టచెప్పాడు. 3 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందోళనలో ఏం చేయాలో తెలీక ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.

భారత్ పే ఎగ్జిక్యూటివ్ పేరుతో మోసం - కిరాణ యజమాని దగ్గర డబ్బులను కాజేసిన కేటుగాడు - Cyber Frud In Medak

సైబర్​ నేరాలతో రూ.3 కోట్లకు పైగా టోకరా - వరంగల్​లో తమిళనాడు దంపతుల అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.