ETV Bharat / state

రామోజీరావు కీర్తి అజరామరం: చంద్రబాబు - Chandrababu On Ramoji Rao Demise

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 8, 2024, 9:15 AM IST

Updated : Jun 8, 2024, 10:46 AM IST

Chandrababu On Ramoji Rao Demise : మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు తనను ఆయనకు ఎంతో దగ్గర చేసిందని అన్నారు. సమస్యలపై పోరాటంలో ఆయన తను ఒక స్ఫూర్తి అని కొనియాడారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు.

chandrababu_on_ramoji_rao_demise
chandrababu_on_ramoji_rao_demise (ETV Bharat)

Chandrababu On Ramoji Rao Demise : రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.

Nara Lokesh Condolences: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు అందరికీ మార్గదర్శి అని వ్యాఖ్యానించిన లోకేశ్ ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారని తెలిపారు.

MP Rammohan Naidu Condolences: రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి తెలియజేశారు. ప్రతి తెలుగింటితో రామోజీరావుకి అనుబంధం విడదీయలేనిదని కోనియాడారు. ప్రతి తెలుగు గడప ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.

LIVE UPDATES: అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు - RAMOJI RAO PASSED AWAY

TDP leaders Condolences: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మరణంతో తెలుగుజాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయిందని మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. పట్టుదల, దృఢదీక్ష, మనో నిబ్బరంతో సామాన్య స్థితి నుంచి అసమాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం భావితరాలకు మార్గదర్శకమన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట MLA బగ్గు రమణమూర్తి తన కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు.

రామోజీరావు లేని లోటు పత్రిక రంగానికి తీరనిదని రమణమూర్తి అన్నారు. రామోజీరావు మృతి యావత్ భారత దేశానికి తీరని లోటు అని కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయంపై మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు దేశాభివృద్ధికి కృషి చేశారని ఆయన సమిష్ఠ శక్తికి నిదర్శనమని కొనియాడారు. రామోజీరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - Ramoji Rao Services to Telugu Media

మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు - ramoji rao success in MEDIA field

Chandrababu On Ramoji Rao Demise : రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు, ఆయన మృతి తీరని లోటన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించానని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పాలసీలు అందించే విషయంలో రామోజీ సూచనలు, సలహాలు తాను తీసుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. రామోజీ అస్తమయంపై కుటుంబ సభ్యులకు, ఈనాడు గ్రూపు సంస్థల సిబ్బందికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.

Nara Lokesh Condolences: రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు గారు అందరికీ మార్గదర్శి అని వ్యాఖ్యానించిన లోకేశ్ ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తితో పని చేశారని తెలిపారు.

MP Rammohan Naidu Condolences: రామోజీరావు మృతి పట్ల తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి తెలియజేశారు. ప్రతి తెలుగింటితో రామోజీరావుకి అనుబంధం విడదీయలేనిదని కోనియాడారు. ప్రతి తెలుగు గడప ఒక కుటుంబ సభ్యున్ని కోల్పోయిందన్నారు. రామోజీరావు ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.

LIVE UPDATES: అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు - RAMOJI RAO PASSED AWAY

TDP leaders Condolences: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మరణంతో తెలుగుజాతి ఒక మహోన్నత దిగ్గజాన్ని కోల్పోయిందని మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. పట్టుదల, దృఢదీక్ష, మనో నిబ్బరంతో సామాన్య స్థితి నుంచి అసమాన్య స్థితికి ఎదిగిన ఆయన జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం భావితరాలకు మార్గదర్శకమన్నారు. రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట MLA బగ్గు రమణమూర్తి తన కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు.

రామోజీరావు లేని లోటు పత్రిక రంగానికి తీరనిదని రమణమూర్తి అన్నారు. రామోజీరావు మృతి యావత్ భారత దేశానికి తీరని లోటు అని కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయంపై మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు దేశాభివృద్ధికి కృషి చేశారని ఆయన సమిష్ఠ శక్తికి నిదర్శనమని కొనియాడారు. రామోజీరావు కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

తెలుగు పత్రికారంగంలో చెరగని ముద్ర వేసిన రామోజీరావు - Ramoji Rao Services to Telugu Media

మీడియా రంగంలో తెలుగు కీర్తి పతాక రామోజీరావు - ramoji rao success in MEDIA field

Last Updated : Jun 8, 2024, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.