ETV Bharat / state

రాజధాని అమరావతికిచ్చే రూ.15 వేల కోట్లు గ్రాంటే!

రాజధాని అమరావతి నిర్మాణ నిధుల విషయంలో రాష్ట్రానికి పెద్ద ఊరట

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

Central Grant Money to Amaravati Works
Central Grant Money to Amaravati Works (Etv Bharat)

15 Thousand Crores for Amaravati : రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్రానికి పెద్ద ఊరట లభించింది. అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15,000ల కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. ఆ మొత్తంలో సుమారు రూ.13,440 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి కేంద్ర ఆర్థికశాఖ రుణంగా తీసుకుని, సీఆర్​డీఏకు ఇవ్వనుంది. ఆ రెండు బ్యాంకులూ చెరో 80 కోట్ల డాలర్ల చొప్పున రుణం ఇస్తున్నాయి. రూ.15,000ల కోట్లలో బ్యాంకులు ఇచ్చేది పోగా మిగతా మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తుంది.

బ్యాంకులకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అమరావతి కేపిటల్ సిటీ డెవలప్​మెంట్​ ప్రొగ్రాం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆ రుణం ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాల్ని ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉంచింది. కేంద్ర ఆర్థికశాఖను రుణ గ్రహీతగా, సీఆర్​డీఏను ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 'ప్రొగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్ " విధానంలో రుణం సమకూరుస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన రూ.15,000ల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి రూ.15,000ల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి గ్రాంట్‌గానే వస్తోందని స్పష్టమవుతోంది.

15 Thousand Crores for Amaravati : రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో రాష్ట్రానికి పెద్ద ఊరట లభించింది. అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో ప్రకటించిన రూ.15,000ల కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చనుంది. ఆ మొత్తంలో సుమారు రూ.13,440 కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి కేంద్ర ఆర్థికశాఖ రుణంగా తీసుకుని, సీఆర్​డీఏకు ఇవ్వనుంది. ఆ రెండు బ్యాంకులూ చెరో 80 కోట్ల డాలర్ల చొప్పున రుణం ఇస్తున్నాయి. రూ.15,000ల కోట్లలో బ్యాంకులు ఇచ్చేది పోగా మిగతా మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తుంది.

బ్యాంకులకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. అమరావతి కేపిటల్ సిటీ డెవలప్​మెంట్​ ప్రొగ్రాం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఆ రుణం ఇస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాల్ని ప్రపంచ బ్యాంకు వెబ్‌సైట్‌లో ఉంచింది. కేంద్ర ఆర్థికశాఖను రుణ గ్రహీతగా, సీఆర్​డీఏను ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా ప్రపంచ బ్యాంకు పేర్కొంది. 'ప్రొగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్ " విధానంలో రుణం సమకూరుస్తున్నట్లు తెలిపింది. ఈ లెక్కన రూ.15,000ల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి రూ.15,000ల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి గ్రాంట్‌గానే వస్తోందని స్పష్టమవుతోంది.

జెట్‌ స్పీడ్‌గా అమరావతి నిర్మాణం - త్వరలోనే పోలవరం పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.