ETV Bharat / state

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్​ సెయిల్‌లో విలీనం? కేంద్రం మదిలో ఇదే ఉందా? - vizag steel plant Merge With sail

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

VIZAG STEEL PLANT MERGE WITH SAIL: వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్​ను సెయిల్‌లో విలీనం చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్టీల్‌ ప్లాంట్ మనుగడకు, మూలధనం అందించేందుకు దీన్నొక ప్రత్యామ్నాయంగా భావిస్తోంది. అదే విధంగా ఎన్‌ఎండీసీకి భూమి విక్రయించడం, బ్యాంకు రుణాల అంశాలను సైతం పరిశీలిస్తున్నారు.

VIZAG STEEL PLANT MERGE WITH SAIL
VIZAG STEEL PLANT MERGE WITH SAIL (ETV Bharat)

VIZAG STEEL PLANT MERGE WITH SAIL: వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్​ ప్లాంట్​ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్​లో (SAIL) విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను (Rashtriya Ispat Nigam Limited) మరో ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థకి (National Mineral Development Corporation) భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

స్టీల్ ప్లాంట్​కు చెందిన 1500 నుంచి 2 వేల ఎకరాలను NMDCకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు.. ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అటు బ్యాంకు రుణాలపైనా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కుశాఖ కార్యదర్శి ఎస్‌బీఐకు (State Bank of India) చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్టు వెల్లడించాయి.

నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పని చేస్తుండటమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ మనుగడ కోసం సెయిల్‌లో విలీన అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డ్​ - 100 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి

విశాఖ స్టీల్​కు రూ.620 కోట్లు - కేంద్ర పన్నుల్లో పెరిగిన ఏపీ వాటా - budget funds to vizag steel plant

VIZAG STEEL PLANT MERGE WITH SAIL: వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ మేరకు వైజాగ్ స్టీల్​ ప్లాంట్​ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్​లో (SAIL) విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను (Rashtriya Ispat Nigam Limited) మరో ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్యకలాపాల కొనసాగింపు కోసం మూలధనాన్ని అందించడానికి జాతీయ ఖనిజ వనరుల అభివృద్ధి సంస్థకి (National Mineral Development Corporation) భూములు విక్రయించాలనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

స్టీల్ ప్లాంట్​కు చెందిన 1500 నుంచి 2 వేల ఎకరాలను NMDCకి విక్రయించి అందులో పెల్లెట్ ప్లాంట్​ను ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలను కొనసాగించేందుకు.. ఆర్థిక సాయాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించాయి. అటు బ్యాంకు రుణాలపైనా ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన అధికారులు, ఉక్కుశాఖ కార్యదర్శి ఎస్‌బీఐకు (State Bank of India) చెందిన అధికారులతో చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. విశాఖ స్టీల్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశలోనే ఈ ప్రయత్నాలు సాగుతున్నట్టు వెల్లడించాయి.

నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పని చేస్తుండటమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం అంచనాకు వచ్చింది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ మనుగడ కోసం సెయిల్‌లో విలీన అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డ్​ - 100 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి

విశాఖ స్టీల్​కు రూ.620 కోట్లు - కేంద్ర పన్నుల్లో పెరిగిన ఏపీ వాటా - budget funds to vizag steel plant

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.