ETV Bharat / state

పెద్దవాగు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం - ప్రాజెక్టు కొట్టుకుపోయినా మంత్రులకు తీరకలేదా? : హరీశ్​ రావు - Harish Rao Tweet on Peddavagu

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 20, 2024, 9:19 PM IST

Harish Rao Tweet Peddavagu Project Broken : పెద్దవాగు కొట్టుకుపోయి రెండు రోజులైన మంత్రులకు తీరిక దొరకలేదా అంటూ ఎక్స్​ వేదికగా మాజీ మంత్రి హరీశ్​ రావు ప్రశ్నించారు. అధికారులు అప్రమత్తమై ఉంటే రూ.100 కోట్లు నష్టం జరిగేది కాదని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని హరీశ్​ రావు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

Harish Rao Tweet Peddavagu Project Broken
Harish Rao Tweet Peddavagu Project Broken (ETV Bharat)

BRS Leader Harish Rao on Peddavagu Issue : పెద్దవాగుకు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు ఆరోపించారు. సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదని ధ్వజమెత్తారు. ఏపీ నుంచి హెలికాప్టర్లు రాకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన చెందారు. ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అంటూ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఒరగబెట్టింది ఏమిటని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుక ఎకరాకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని హరీశ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్​, ఇరిగేషన్​ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే రూ.100 కోట్ల నష్టం జరిగేది కాదన్నారు. కట్ట మీద నుంచి నాలుగైదు గంటల పాటు నీళ్లు పొంగిపొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారన్నారు. మూడు గేట్లుంటే రెండు గేట్లే ఎత్తడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. పెద్దవాగు ప్రాజెక్టు బద్దలై గుమ్మడివల్లి గ్రామాన్ని ముంచేసి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.

అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శించి వందల మంది గిరిజల బిడ్డల ప్రాణాలు ఫణంగా పెట్టారని హరీశ్​ రావు ఆగ్రహించారు. పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలోనే ఉందని పర్యవేక్షణ చేస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులేనని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు గండి పడటం వల్ల గుమ్మడివల్లి, రంగాపురం, కోయరంగాపురం, బుచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల్లో తీవ్రనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలతో పాటు పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందన్నారు.

పెద్దవాగు ప్రాజెక్టు ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని హరీశ్​ రావు విమర్శించారు. రక్షించడని అధికారులకు ఫోన్​ చేసినా కనీస స్పందన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి హెలికాప్టర్లు సరైన కాలంలో రాకుంటే ఆ రోజు వరదలో చిక్కుకున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు దారుణమని, ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అన్నారు. ముగ్గురు మంత్రులుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒరగబెట్టింది ఏంటని నిలదీశారు.

ఇసుకమేట వేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని, పశువులు కోల్పోయిన రైతులకు ప్రకృతి వైఫరీత్యం నిధి నుంచి ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై కారణాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

పెద్దవాగు ఉద్ధృతితో అశ్వారావుపేట అతలాకుతలం - స్తంభించిన జనజీవనం, ముంపు ప్రాంతాల్లో చిమ్మచీకట్లు - Heavy Floods In Bhadradri

పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి - 250 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట - జలదిగ్బంధంలో 14 గ్రామాలు - PEDDAVAGU PROJECT LATEST NEWS

BRS Leader Harish Rao on Peddavagu Issue : పెద్దవాగుకు గండికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు ఆరోపించారు. సకాలంలో ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటే ప్రమాదం తప్పేదని ధ్వజమెత్తారు. ఏపీ నుంచి హెలికాప్టర్లు రాకుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆందోళన చెందారు. ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అంటూ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఒరగబెట్టింది ఏమిటని అన్నారు. నష్టపోయిన ప్రతి రైతుక ఎకరాకు రూ.25 వేలు చొప్పున చెల్లించాలని హరీశ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్లే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని బీఆర్​ఎస్​ నేత హరీశ్​రావు మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్​, ఇరిగేషన్​ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే రూ.100 కోట్ల నష్టం జరిగేది కాదన్నారు. కట్ట మీద నుంచి నాలుగైదు గంటల పాటు నీళ్లు పొంగిపొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారన్నారు. మూడు గేట్లుంటే రెండు గేట్లే ఎత్తడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. పెద్దవాగు ప్రాజెక్టు బద్దలై గుమ్మడివల్లి గ్రామాన్ని ముంచేసి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.

అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శించి వందల మంది గిరిజల బిడ్డల ప్రాణాలు ఫణంగా పెట్టారని హరీశ్​ రావు ఆగ్రహించారు. పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలోనే ఉందని పర్యవేక్షణ చేస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులేనని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు గండి పడటం వల్ల గుమ్మడివల్లి, రంగాపురం, కోయరంగాపురం, బుచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల్లో తీవ్రనష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలతో పాటు పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందన్నారు.

పెద్దవాగు ప్రాజెక్టు ఘటన ముమ్మాటికీ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని హరీశ్​ రావు విమర్శించారు. రక్షించడని అధికారులకు ఫోన్​ చేసినా కనీస స్పందన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి హెలికాప్టర్లు సరైన కాలంలో రాకుంటే ఆ రోజు వరదలో చిక్కుకున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు దారుణమని, ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా అన్నారు. ముగ్గురు మంత్రులుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒరగబెట్టింది ఏంటని నిలదీశారు.

ఇసుకమేట వేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం కింద ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని, పశువులు కోల్పోయిన రైతులకు ప్రకృతి వైఫరీత్యం నిధి నుంచి ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై కారణాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

పెద్దవాగు ఉద్ధృతితో అశ్వారావుపేట అతలాకుతలం - స్తంభించిన జనజీవనం, ముంపు ప్రాంతాల్లో చిమ్మచీకట్లు - Heavy Floods In Bhadradri

పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి - 250 మీటర్ల పొడవున కొట్టుకుపోయిన ఆనకట్ట - జలదిగ్బంధంలో 14 గ్రామాలు - PEDDAVAGU PROJECT LATEST NEWS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.