Bhumana Came to Tirumala to Take oath on Laddu Adulteration: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో హంగామా చేశారు. లడ్డూ కల్తీపై ప్రమాణం చేస్తానంటూ కొండపైకి వెళ్లిన భూమన పుష్కరిణిలో మునిగి మాఢవీధుల్లో ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. అనంతరం రాజకీయ విమర్శలు చేసే ప్రయత్నం చేయబోగా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు అడ్డుకున్నారు. కొండపైన రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని భూమనకు నోటీసులు ఇచ్చారు. ప్రమాణం చేయకుండానే తిరుమల నుంచి భూమన వెనుదిరిగారు.
'అచ్చుతప్పులు, అభూత కల్పనలు'- సినీ నటి కేసులో కీలక సూత్రధారులపై విచారణ - Kandambari Jethwani case