ETV Bharat / state

వెన్నెముక కులాలంటూ కబుర్లు, ఐదేళ్లుగా దెబ్బమీద దెబ్బలు- బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్‌

BC Corporations in YSRCP Govt: "నా", "నా" అంటూనే బలహీన వర్గాలను దగా చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌ను మించినోళ్లు ఉండరు. ఎందుకంటే ఐదేళ్లుగా వెనకబడిన వర్గాలను దెబ్బమీద దెబ్బ కొడుతూనే ఉన్నారు. వెన్నెముక కులాలంటూ మాటల్లో వారిని పైకి ఎత్తుతూనే చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వారి వెన్నువిరిచారు. 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశామంటూ గొప్పలకేమీ తక్కువ లేదు కానీ వాటిని తన వందిమాగధులు, అనుచరులకు పదవులు కట్టబెట్టే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 11, 2024, 10:27 AM IST

BC_Corporations_in_YSRCP_Govt
BC_Corporations_in_YSRCP_Govt
వెన్నెముక కులాలంటూ కబుర్లు, ఐదేళ్లుగా దెబ్బమీద దెబ్బలు- బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్‌

BC Corporations in YSRCP Govt: పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ బీసీలను దశమార్చుతానన్న జగన్‌ అధికారం చేపట్టగానే తొలి దెబ్బను బలహీనవర్గాలకు అత్యంత కీలకమైన కార్పొరేషన్లపైనే వేశారు. ఏళ్ల తరబడి బీసీలకు అందుతున్న స్వయం ఉపాధి రాయితీ రుణాలకు తిలోదకాలిచ్చారు. బీసీలు సొంత కాళ్లపై నిల్చునేలా ఆర్థికంగా చేయూతనివ్వడం, ఉపాధి కల్పించడం బీసీ ఆర్థిక సహకార సంస్థ లక్ష్యం. బీసీల్లోని వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా వారిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు రాయితీ రుణాలు తిరుగులేని అండనిస్తాయి. సరిగ్గా ఇక్కడే జగన్‌ దెబ్బ కొట్టారు. వాటి అండ లేకుండా చేశారు.

గత పాలకులంతా స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిచ్చి, వారికి దన్నుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను నామమాత్రంగా మార్చేసింది. తన ఐదేళ్ల కాలంలో రేషన్‌ పంపిణీ వాహనాలకు 132 కోట్లు రాయితీగా ఇచ్చి మమ అనిపించింది. టీడీపీ హయాంలో నాలుగేళ్లలో ఇచ్చిన 16 వందల 26 కోట్ల రూపాయలతో పోలిస్తే వైసీపీ ఇచ్చింది 8 శాతమే. బ్యాంకు వాటాతో కలిపి మొత్తం 2 వేల 400 కోట్లతో పోలిస్తే 8.3 శాతమే. టీడీపీ ఐదేళ్ల హయాంలో 3.15 లక్షల మంది బీసీలకు సాయం అందింది. వైసీపీ ఏలుబడిలో లబ్ధి పొందిన వారి సంఖ్య 3 వేల800. తన ఐదేళ్ల పాలనలో జగన్‌ వెనకబడిన తరగతులకు చేసిందేమిటో తేటతెల్లం కావడానికి ఇంతకుమించిన గణాంకాలు ఏం కావాలి.?

బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు

కులవృత్తుల వారికి గత ప్రభుత్వాలు 20శాతం నుంచి 50శాతం వరకు రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించాయి. లక్ష నుంచి 25 లక్షల వరకు రుణాలిచ్చి స్వయం ఉపాధికి ఊతమిచ్చాయి. బీసీ యువత పెద్ద ఎత్తున వీటిని వినియోగించుకుంది. టీడీపీ హయాంలో యాదవుల అభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షల రుణం అందించింది. ఇలా 80 కోట్ల వరకు ఖర్చు చేసింది. 50శాతం రాయితీతో 25 లక్షల రుణమిచ్చి మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించింది.

ఉపాధి హామీ పథకం కింద గొర్రెలు, గేదెల షెడ్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. రజకులు, కల్లుగీత కార్మికులు, వడ్డెరలు, నాయీబ్రాహ్మణులు, వాల్మీకి, ఇతర బీసీ కులాలకు లక్ష రాయితీతో 2 లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి రుణాలు అందేలా చూసింది. ఫలితంగా వేల మందికి చేయూత లభించింది. జగన్‌ పాలనలో మాత్రం బీసీలకు అడుగడుగునా వంచనే మిగిలింది. బీసీల విషయంలో జగన్‌ ఐదేళ్లుగా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు.

మోసపూరిత మాటలతో ఓట్ల గాలం వేయడంలో ఆరితేరిన ఆయన నవరత్న పథకాల నిధులనే కార్పొరేషన్ల ద్వారా అందిస్తూ దాన్నే బీసీలకు చేసిన ప్రత్యేక సాయంగా చూపించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? చేదోడు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం పథకాల ద్వారా బీసీలకు కొంత ఆర్థికసాయం అందిస్తున్నా అది వారిని పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేసే స్థాయిలో ఉండటంలేదు. బీసీల్లో అత్యంత వెనకబడిన వర్గాల కోసం టీడీపీ ప్రభుత్వం 2016లో ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది.

సిద్దం సభలకు రూ 600 కోట్లు- ఉద్యోగాలు ఇవ్వలేకపోయి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు: షర్మిల

మిగతా వర్గాలకు 50శాతం వరకు రాయితీతో రుణాలివ్వగా ఎంబీసీలకు 90శాతం రాయితీ అందించింది. ఈ కార్పొరేషన్‌ ద్వారా గత ప్రభుత్వంలో 21 వేల 711 మంది 84 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక వీరికి మొండిచేయి చూపారు. బీసీలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్నీ వెనక్కి తీసుకుని దగా చేశారు. అన్ని కార్పొరేషన్లకు చెందిన 488 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉంటే అందులో బీసీలకు చెందినవే 200 కోట్లు.

వాటిని వైసీపీ సర్కారు తీసేసుకుంది. ఈ మొత్తం వరకైనా బీసీలకు రుణాలుగా ఇవ్వాలనే ఆలోచనైనా చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో బీసీల స్వయం ఉపాధి రుణాలకు వెయ్యి 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ మొత్తాన్ని అధికారం చేపట్టగానే జగన్‌ రద్దు చేశారు. 6.93 లక్షల దరఖాస్తులను తిరస్కరించి, వారి నోట్లో మట్టి కొట్టారు. విత్తన పొట్టేళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులనూ జగన్‌ ప్రభుత్వం ఇతరాలకు మళ్లించింది. వీటిని 100శాతం రాయితీతో బీసీలకు అందించాల్సి ఉండగా ఆ పని చేయలేదు.

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతభత్యాలకు మాత్రం జగన్‌ ఏ లోటూ లేకుండా చేశారు. నెలకు ఛైర్మన్‌కు 56 వేలు, డైరెక్టర్లకు 12 వేల చొప్పున చెల్లించారు. వాహన భత్యం కింద 65 వేలు, పీఏకు అదనంగా 12 వేలు ఇచ్చారు. ఇలా వారి జీతభత్యాలకే 50 కోట్లు ఖర్చు చేశారు. పైగా తమ సంస్థల ఆధ్వర్యంలో ఒక్క పైసా పని కూడా చేయకుండానే ఈ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలం ముగిసిపోనుండటం అసలైన విషాదం.

టీడీపీ, జనసేనతో పొత్తు సంతోషకరం - ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

వెన్నెముక కులాలంటూ కబుర్లు, ఐదేళ్లుగా దెబ్బమీద దెబ్బలు- బీసీలను నమ్మించి మోసం చేసిన జగన్‌

BC Corporations in YSRCP Govt: పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ బీసీలను దశమార్చుతానన్న జగన్‌ అధికారం చేపట్టగానే తొలి దెబ్బను బలహీనవర్గాలకు అత్యంత కీలకమైన కార్పొరేషన్లపైనే వేశారు. ఏళ్ల తరబడి బీసీలకు అందుతున్న స్వయం ఉపాధి రాయితీ రుణాలకు తిలోదకాలిచ్చారు. బీసీలు సొంత కాళ్లపై నిల్చునేలా ఆర్థికంగా చేయూతనివ్వడం, ఉపాధి కల్పించడం బీసీ ఆర్థిక సహకార సంస్థ లక్ష్యం. బీసీల్లోని వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా వారిని శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు రాయితీ రుణాలు తిరుగులేని అండనిస్తాయి. సరిగ్గా ఇక్కడే జగన్‌ దెబ్బ కొట్టారు. వాటి అండ లేకుండా చేశారు.

గత పాలకులంతా స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిచ్చి, వారికి దన్నుగా నిలిచారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను నామమాత్రంగా మార్చేసింది. తన ఐదేళ్ల కాలంలో రేషన్‌ పంపిణీ వాహనాలకు 132 కోట్లు రాయితీగా ఇచ్చి మమ అనిపించింది. టీడీపీ హయాంలో నాలుగేళ్లలో ఇచ్చిన 16 వందల 26 కోట్ల రూపాయలతో పోలిస్తే వైసీపీ ఇచ్చింది 8 శాతమే. బ్యాంకు వాటాతో కలిపి మొత్తం 2 వేల 400 కోట్లతో పోలిస్తే 8.3 శాతమే. టీడీపీ ఐదేళ్ల హయాంలో 3.15 లక్షల మంది బీసీలకు సాయం అందింది. వైసీపీ ఏలుబడిలో లబ్ధి పొందిన వారి సంఖ్య 3 వేల800. తన ఐదేళ్ల పాలనలో జగన్‌ వెనకబడిన తరగతులకు చేసిందేమిటో తేటతెల్లం కావడానికి ఇంతకుమించిన గణాంకాలు ఏం కావాలి.?

బెజవాడలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత అక్రమాలు- బూడిదతో సైతం కాసులు రాల్చుకునే ఘనుడు

కులవృత్తుల వారికి గత ప్రభుత్వాలు 20శాతం నుంచి 50శాతం వరకు రాయితీపై బ్యాంకుల ద్వారా రుణాలు అందించాయి. లక్ష నుంచి 25 లక్షల వరకు రుణాలిచ్చి స్వయం ఉపాధికి ఊతమిచ్చాయి. బీసీ యువత పెద్ద ఎత్తున వీటిని వినియోగించుకుంది. టీడీపీ హయాంలో యాదవుల అభివృద్ధికి ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక్కొక్కరికి 5 లక్షల రుణం అందించింది. ఇలా 80 కోట్ల వరకు ఖర్చు చేసింది. 50శాతం రాయితీతో 25 లక్షల రుణమిచ్చి మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించింది.

ఉపాధి హామీ పథకం కింద గొర్రెలు, గేదెల షెడ్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. రజకులు, కల్లుగీత కార్మికులు, వడ్డెరలు, నాయీబ్రాహ్మణులు, వాల్మీకి, ఇతర బీసీ కులాలకు లక్ష రాయితీతో 2 లక్షల రూపాయల వరకు స్వయం ఉపాధి రుణాలు అందేలా చూసింది. ఫలితంగా వేల మందికి చేయూత లభించింది. జగన్‌ పాలనలో మాత్రం బీసీలకు అడుగడుగునా వంచనే మిగిలింది. బీసీల విషయంలో జగన్‌ ఐదేళ్లుగా అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు.

మోసపూరిత మాటలతో ఓట్ల గాలం వేయడంలో ఆరితేరిన ఆయన నవరత్న పథకాల నిధులనే కార్పొరేషన్ల ద్వారా అందిస్తూ దాన్నే బీసీలకు చేసిన ప్రత్యేక సాయంగా చూపించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? చేదోడు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం పథకాల ద్వారా బీసీలకు కొంత ఆర్థికసాయం అందిస్తున్నా అది వారిని పేదరికం నుంచి శాశ్వతంగా బయటపడేసే స్థాయిలో ఉండటంలేదు. బీసీల్లో అత్యంత వెనకబడిన వర్గాల కోసం టీడీపీ ప్రభుత్వం 2016లో ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది.

సిద్దం సభలకు రూ 600 కోట్లు- ఉద్యోగాలు ఇవ్వలేకపోయి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు: షర్మిల

మిగతా వర్గాలకు 50శాతం వరకు రాయితీతో రుణాలివ్వగా ఎంబీసీలకు 90శాతం రాయితీ అందించింది. ఈ కార్పొరేషన్‌ ద్వారా గత ప్రభుత్వంలో 21 వేల 711 మంది 84 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారు. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక వీరికి మొండిచేయి చూపారు. బీసీలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్నీ వెనక్కి తీసుకుని దగా చేశారు. అన్ని కార్పొరేషన్లకు చెందిన 488 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉంటే అందులో బీసీలకు చెందినవే 200 కోట్లు.

వాటిని వైసీపీ సర్కారు తీసేసుకుంది. ఈ మొత్తం వరకైనా బీసీలకు రుణాలుగా ఇవ్వాలనే ఆలోచనైనా చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2018-19 సంవత్సరంలో బీసీల స్వయం ఉపాధి రుణాలకు వెయ్యి 30 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ మొత్తాన్ని అధికారం చేపట్టగానే జగన్‌ రద్దు చేశారు. 6.93 లక్షల దరఖాస్తులను తిరస్కరించి, వారి నోట్లో మట్టి కొట్టారు. విత్తన పొట్టేళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులనూ జగన్‌ ప్రభుత్వం ఇతరాలకు మళ్లించింది. వీటిని 100శాతం రాయితీతో బీసీలకు అందించాల్సి ఉండగా ఆ పని చేయలేదు.

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతభత్యాలకు మాత్రం జగన్‌ ఏ లోటూ లేకుండా చేశారు. నెలకు ఛైర్మన్‌కు 56 వేలు, డైరెక్టర్లకు 12 వేల చొప్పున చెల్లించారు. వాహన భత్యం కింద 65 వేలు, పీఏకు అదనంగా 12 వేలు ఇచ్చారు. ఇలా వారి జీతభత్యాలకే 50 కోట్లు ఖర్చు చేశారు. పైగా తమ సంస్థల ఆధ్వర్యంలో ఒక్క పైసా పని కూడా చేయకుండానే ఈ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలం ముగిసిపోనుండటం అసలైన విషాదం.

టీడీపీ, జనసేనతో పొత్తు సంతోషకరం - ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.