VMC Incresing Park Fees Vijayawada : గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు ఛీ కొట్టినా తీరు మార్చుకోలేదని సీపీఎం విమర్శించింది. తాజాగా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న వైఎస్సార్సీపీ పాలక పక్షం ప్రజలపై పన్నుల భారం మోపడానికి తహతహలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్కుల్లో ప్రవేశ రుసుం వసూలు, స్టేడియాల్లో ఆడే క్రీడాకారుల నుంచి సభ్యత రుసుం పేరుతో ఫీజులు వసూలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 30 August 2024
AP News Today Live: ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Fri Aug 30 2024- ప్రజలపై వీఎంసీ మళ్లీ పన్నుల భారం - ప్రజలు ఛీ కొట్టినా వైఎస్సార్సీపీ తీరు మారలేదు: సీపీఎం - VMC Incresing park fees vijayawada
By Andhra Pradesh Live News Desk
Published : Aug 30, 2024, 9:43 AM IST
|Updated : Aug 30, 2024, 10:42 PM IST
ప్రజలపై వీఎంసీ మళ్లీ పన్నుల భారం - ప్రజలు ఛీ కొట్టినా వైఎస్సార్సీపీ తీరు మారలేదు: సీపీఎం - VMC Incresing park fees vijayawada
యమపాశాలుగా విద్యుత్ తీగలు - అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి - Electrical Accidents in AP
Many Electrical Accidents Happening in the State : రాష్ట్రంలో విద్యుత్ తీగలు కొందరికి యమ పాశాలుగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలే ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూశాయి. | Read More
రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం - ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు - Vana Mahotsavam Program
Ministers and MLAs Participated in Vana Mahotsavam Program: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలు నాటి ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో పార్కులు, గ్రీనరీ అభివృధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు తెలిపారు. | Read More
విజయవాడ సీపీ కార్యాలయానికి బాలీవుడ్ నటి - వేధింపులపై ఫిర్యాదు - Mumbai Actress Complaint to Police
Mumbai Actress Complaint to Vijayawada Police: ముంబయి సినీనటి వైఎస్సార్సీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. | Read More
అడవిలో అడుగుపెడితే అదే చివరిరోజు - ఎర్ర చందనం స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్ - Vana Mahotsava Program in AP
CM Chandrababu Participated in Vana Mahotsava Program: అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎస్కోబార్ కొలంబియాలో భీభత్సం సృష్టించిన రీతిలో మొన్నటి వరకూ ఇక్కడ జగన్ విధ్వంసం చేశాడని ధ్వజమెత్తారు. వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేశాడో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శనమన్నారు. ప్రతీ ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవటం ఎంత అవసరమో, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటటమూ అంతే ముఖ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు కోటి మొక్కలు నాటి, ప్రస్తుతం 29శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50శాతం తీసుకెళ్లే దిశగా కృషి చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. | Read More
అందుబాటులోకి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ - వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ - PM Modi Inaugurated Fishing Harbor
PM Modi Inaugurated Juvvaladinne Fishing Harbor: ప్రధాని మోదీ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్గా మత్స్యకారులు వీక్షించారు. చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. | Read More
జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - District special officers
District Special Officers Appointed : జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. | Read More
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం: మంత్రి లోకేశ్ - Nara Lokesh visit to Visakha
Minister Nara Lokesh visit to Visakha on Second Day: మంత్రి నారా లోకేశ్ పర్యటన విశాఖలో రెండో రోజు కొనసాగుతుంది. ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. | Read More
అధిక వడ్డీ ఆశచూపి కోట్లలో వసూలు చేసి ఉడాయింపు - లబోదిబోమంటున్న బాధితులు - Two Crore Fraud In Satya Sai
Two Crore Scam in Sathya Sai District : దొంగతనాలు, ఆన్లైన్ మోసాలు, వర్తకం పేరుతో, వడ్డీలు ఇస్తామని ఇలా తోచిన రీతిలో సామాన్యులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఈ తరహా మోసం సత్యసాయి జిల్లాలో జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. | Read More
పొయిట్రీ థెరపీతో రోగులకు స్వాంతన- నూరేళ్ల వయస్సులోనూ పద కవిత - Narasimha Sharma
Narasimha Sharma: ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో వందేళ్ల పాటు జీవించడం చాలా కష్టం. అందులోనూ ఆరోగ్యంగా ఉండటం మరింత అరుదు. కానీ నరసింహశర్మకు ఇది సాధ్యమైంది. ఈయన ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అలియాస్ రావిశాస్త్రికి స్వయానా సోదరుడు. | Read More
గాంజా రవాణాపై విజయనగరం పోలీసులు సీరియస్- పీడీ యాక్ట్ నమోదుకూ సిద్ధం - Police to control marijuana
Vizianagaram police raids on ganja : విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి రవాణా, నివారణపై పట్టు బిగించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితుల లింకులను చేధించటంపైనా ఎస్పీ వకుల్ జిందల్ దృష్టి సారించారు. ఆయా కేసుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారిని ఇతర రాష్ట్రాలకు పంపారు. | Read More
కేరళ తరహాలో కారవాన్ టూరిజం - పర్యాటక శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు - Officials try caravan tourism in AP
Tourism Department Tries For Caravan Project : చిత్తూరు జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి దృష్టి సారించింది. కేరళలో తరహాలో కారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 15 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే జిల్లాకు దగ్గరలో బెంగళూరు, చెన్నై ఉన్నందున పర్యాటకుల తాకిడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. | Read More
విజయవాడ చేరుకున్న ముంబయి సినీ నటి - విజయవాడ సీపీని కలిసే అవకాశం - Mumbai Actress Case
Mumbai Actress Case: పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ముంబయి సినీనటి విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం విజయవాడ పోలీసు కమిషనర్ను ఆమె కలిసే అవకాశం ఉంది. కేసు వివరాలు, ఆధారాలు విజయవాడ సీపీకి అందించనున్నారు. | Read More
మంత్రి వచ్చినా డోంట్ కేర్! - నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల కష్టాలు - Nuzvid IIIT College Food Incident
Nuzvid IIIT College Food Incident: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంత్రి పార్ధసారథి పర్యటించి మెస్ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసినా దిద్దుబాటు చర్యలు కనిపించడం లేదు. విద్యార్థులకు అదే పురుగుల అన్నం, అవే మాడిపోయిన కూరలు పెడుతున్నారు. రుచీపచీ లేని ఆహారం తినలేక విద్యార్థులు వదిలేస్తున్నారు. దీనికి తోడు అస్వస్థత బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. | Read More
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - అన్నదమ్ములను బలిగొన్న మృత్యువు, ముగ్గురి పరిస్థితి విషమం - Two Brothers Dead in Accident
Two Brothers Dead in Road Accident: అనంతపురం జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా, మరో 10 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. | Read More
హిమాయత్సాగర్ వైపు హైడ్రా బుల్డోజర్లు - ఇక కాంగ్రెస్ నేతల వంతు! - Hydra Demolitions in Himayat Sagar
Illegal Constructions in Himayat Sagar : హైడ్రా మరింత దూకుడు పెంచుతోంది. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపడుతోందని టెన్షన్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. తాజాగా ఈ బుల్డోజర్లు హిమాయత్ సాగర్ వైపు సాగనున్నాయి. జలాశయ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీల నేతల ఇళ్లు, ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఉండటంతో ఈ అంశం మరింత కాకరేపుతోంది. | Read More
సూర్యలంక బీచ్కు మహర్దశ - రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం - Suryalanka Beach Development
NDA Government Focus on Suryalanka Beach: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. సూర్యలంక పర్యాటక అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టింది. కేంద్రం నిధులు విడుదల చేయడంతో తీరానికి సమీపంలో పర్యాటక శాఖకు చెందిన ఎనిమిది ఎకరాల్లో కొత్త రిసార్ట్ల నిర్మాణం చేపట్టనున్నారు. | Read More
భారు, కృష్ణ, లిల్లీ, మంజు, జస్సు ! వీరి కథే హిడెన్ కెమెరా ప్రచారం- నిజం తేల్చిన పోలీసులు - HIDEN CEMERA STORY
HIDEN CEMERA STORY : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లుతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్లాలన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. | Read More
హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు - రాంనగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత - Hydra Demolitions in Ramnagar
Hydra Focus On Ramnagar Illegal Constructions: హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. చెరువు పరిధిలో ఉన్నా, నాలాపై ఉన్నా రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రాంనగర్లోని మణెమ్మకాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది. | Read More
ఎట్టకేలకు పట్టాలెక్కిన కేసు- మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి నోటీసులు! - Raghu Rama krishna Raju Complaint
Raghu Rama krishna Raju Complaint Leads to Case : రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. | Read More
ఇంజినీరింగ్ కాలేజీ బాలికల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు! - అర్ధరాత్రి హైడ్రామా - Hidden Cameras in Girls Hostel
Hidden Cameras in Engineering College Girls Hostel: ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బాలికల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయంపై బాలికల హాస్టళ్లలో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ‘ఎక్స్’ వేదికగా విద్యార్థుల పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. | Read More
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ - Heavy Rains in Andhra Pradesh
Heavy Rains in Andhra Pradesh State: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. | Read More
'అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది' - గిడుగు రామమూర్తి వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు - Glorious Telugu Language Day in AP
Telugu Language Day Celebration in AP: అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలుగు భాషాభిమానులు సూచించారు. రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష కోసం కృషి చేస్తున్న వారిని గిడుగు రామమూర్తి పురస్కారాలతో సత్కరించారు. తెలుగు గొప్పతనాన్ని చాటే పాటలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. | Read More
అధికారులు తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు: మంత్రి నిమ్మల - Nimmala Ramanaidu on Projects
Irrigation Minister Nimmala Ramanaidu on Projects: గడిచిన ఐదేళ్లు నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కాలువలకు గండ్లు పడుతున్న అంశంపై వివరణ కోరారు. సాగర్ కుడికాలువ ఆయకట్టుకు 15 రోజుల ముందే నీటిని విడుదల చేశామని, సాగర్ ఎడమ కాలువ జోన్-3 పరిధిలో చెరువులు నింపాలన్నారు. | Read More
ఫాగింగ్లో భారీ అవినీతి - వెలుగులోకి పాలకవర్గం దోపిడీ - Fogging Scam in Anantapur Municipal
Fogging Scam in Anantapur Municipality: దోమల నివారణకు సాయంత్రం వేళ పొగ వదలకుండానే ఫాగింగ్ పేరుతో లక్షల రూపాయలు కాజేశారు అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం. నగరపాలక సంస్థలో వెలుగుచూసిన ఫాగింగ్ అక్రమాలపై విచారణ జరిపితే మరిన్ని కుంభకోణాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఫాగింగ్ పేరుతో పాలకవర్గం, కార్పొరేషన్ అధికారులు లక్షలు దోచేశారని స్థానికులు చెబుతున్నారు. | Read More
ఏపీలో మెట్రో ప్రాజెక్టులు పరుగులు - నాలుగు కారిడార్లుగా విశాఖ, రెండు దశల్లో విజయవాడ - అమరావతి - Metro Rail Projects in AP
Visakhapatnam and Vijayawada Metro Rail Projects: ఏపీ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. గత వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మెట్రో రైలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్లు వెంటనే కేంద్రానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. | Read More
మూడు వారాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు- హర్షం వ్యక్తం చేస్తున్న నిపుణులు - Elections to irrigation societies
Irrigation Societies Elections Soon: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణపై సాగునీటి రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. | Read More
ప్రజలపై వీఎంసీ మళ్లీ పన్నుల భారం - ప్రజలు ఛీ కొట్టినా వైఎస్సార్సీపీ తీరు మారలేదు: సీపీఎం - VMC Incresing park fees vijayawada
VMC Incresing Park Fees Vijayawada : గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు ఛీ కొట్టినా తీరు మార్చుకోలేదని సీపీఎం విమర్శించింది. తాజాగా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్న వైఎస్సార్సీపీ పాలక పక్షం ప్రజలపై పన్నుల భారం మోపడానికి తహతహలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్కుల్లో ప్రవేశ రుసుం వసూలు, స్టేడియాల్లో ఆడే క్రీడాకారుల నుంచి సభ్యత రుసుం పేరుతో ఫీజులు వసూలు చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. | Read More
యమపాశాలుగా విద్యుత్ తీగలు - అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి - Electrical Accidents in AP
Many Electrical Accidents Happening in the State : రాష్ట్రంలో విద్యుత్ తీగలు కొందరికి యమ పాశాలుగా మారుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం ఎక్కడో ఒక చోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలే ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూశాయి. | Read More
రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమం - ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు - Vana Mahotsavam Program
Ministers and MLAs Participated in Vana Mahotsavam Program: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలు నాటి ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రమాణం చేశారు. రాష్ట్రంలో పార్కులు, గ్రీనరీ అభివృధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు తెలిపారు. | Read More
విజయవాడ సీపీ కార్యాలయానికి బాలీవుడ్ నటి - వేధింపులపై ఫిర్యాదు - Mumbai Actress Complaint to Police
Mumbai Actress Complaint to Vijayawada Police: ముంబయి సినీనటి వైఎస్సార్సీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. | Read More
అడవిలో అడుగుపెడితే అదే చివరిరోజు - ఎర్ర చందనం స్మగ్లర్లకు చంద్రబాబు వార్నింగ్ - Vana Mahotsava Program in AP
CM Chandrababu Participated in Vana Mahotsava Program: అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ఎస్కోబార్ కొలంబియాలో భీభత్సం సృష్టించిన రీతిలో మొన్నటి వరకూ ఇక్కడ జగన్ విధ్వంసం చేశాడని ధ్వజమెత్తారు. వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేశాడో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శనమన్నారు. ప్రతీ ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవటం ఎంత అవసరమో, ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటటమూ అంతే ముఖ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు కోటి మొక్కలు నాటి, ప్రస్తుతం 29శాతంగా ఉన్న పచ్చదనాన్ని 50శాతం తీసుకెళ్లే దిశగా కృషి చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. | Read More
అందుబాటులోకి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ - వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ - PM Modi Inaugurated Fishing Harbor
PM Modi Inaugurated Juvvaladinne Fishing Harbor: ప్రధాని మోదీ నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్గా మత్స్యకారులు వీక్షించారు. చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. | Read More
జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - District special officers
District Special Officers Appointed : జిల్లాల్లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. | Read More
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడమే లక్ష్యం: మంత్రి లోకేశ్ - Nara Lokesh visit to Visakha
Minister Nara Lokesh visit to Visakha on Second Day: మంత్రి నారా లోకేశ్ పర్యటన విశాఖలో రెండో రోజు కొనసాగుతుంది. ఈ క్రమంలో పార్టీ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి నేరుగా విజ్ఞప్తులు స్వీకరించారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. | Read More
అధిక వడ్డీ ఆశచూపి కోట్లలో వసూలు చేసి ఉడాయింపు - లబోదిబోమంటున్న బాధితులు - Two Crore Fraud In Satya Sai
Two Crore Scam in Sathya Sai District : దొంగతనాలు, ఆన్లైన్ మోసాలు, వర్తకం పేరుతో, వడ్డీలు ఇస్తామని ఇలా తోచిన రీతిలో సామాన్యులను దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఈ తరహా మోసం సత్యసాయి జిల్లాలో జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. | Read More
పొయిట్రీ థెరపీతో రోగులకు స్వాంతన- నూరేళ్ల వయస్సులోనూ పద కవిత - Narasimha Sharma
Narasimha Sharma: ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి నేపథ్యంలో వందేళ్ల పాటు జీవించడం చాలా కష్టం. అందులోనూ ఆరోగ్యంగా ఉండటం మరింత అరుదు. కానీ నరసింహశర్మకు ఇది సాధ్యమైంది. ఈయన ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అలియాస్ రావిశాస్త్రికి స్వయానా సోదరుడు. | Read More
గాంజా రవాణాపై విజయనగరం పోలీసులు సీరియస్- పీడీ యాక్ట్ నమోదుకూ సిద్ధం - Police to control marijuana
Vizianagaram police raids on ganja : విజయనగరం జిల్లా పోలీసులు గంజాయి రవాణా, నివారణపై పట్టు బిగించారు. జిల్లాలోని వివిధ పోలీసు స్టేషను పరిధిలో నమోదై, దర్యాప్తులో ఉన్న కేసుల్లో నిందితుల లింకులను చేధించటంపైనా ఎస్పీ వకుల్ జిందల్ దృష్టి సారించారు. ఆయా కేసుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, వారిని ఇతర రాష్ట్రాలకు పంపారు. | Read More
కేరళ తరహాలో కారవాన్ టూరిజం - పర్యాటక శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు - Officials try caravan tourism in AP
Tourism Department Tries For Caravan Project : చిత్తూరు జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి దృష్టి సారించింది. కేరళలో తరహాలో కారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 15 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే జిల్లాకు దగ్గరలో బెంగళూరు, చెన్నై ఉన్నందున పర్యాటకుల తాకిడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. | Read More
విజయవాడ చేరుకున్న ముంబయి సినీ నటి - విజయవాడ సీపీని కలిసే అవకాశం - Mumbai Actress Case
Mumbai Actress Case: పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేందుకు ముంబయి సినీనటి విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం విజయవాడ పోలీసు కమిషనర్ను ఆమె కలిసే అవకాశం ఉంది. కేసు వివరాలు, ఆధారాలు విజయవాడ సీపీకి అందించనున్నారు. | Read More
మంత్రి వచ్చినా డోంట్ కేర్! - నూజివీడు ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల కష్టాలు - Nuzvid IIIT College Food Incident
Nuzvid IIIT College Food Incident: నూజివీడు ట్రిపుల్ ఐటీలో మంత్రి పార్ధసారథి పర్యటించి మెస్ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసినా దిద్దుబాటు చర్యలు కనిపించడం లేదు. విద్యార్థులకు అదే పురుగుల అన్నం, అవే మాడిపోయిన కూరలు పెడుతున్నారు. రుచీపచీ లేని ఆహారం తినలేక విద్యార్థులు వదిలేస్తున్నారు. దీనికి తోడు అస్వస్థత బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. | Read More
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - అన్నదమ్ములను బలిగొన్న మృత్యువు, ముగ్గురి పరిస్థితి విషమం - Two Brothers Dead in Accident
Two Brothers Dead in Road Accident: అనంతపురం జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా, మరో 10 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. | Read More
హిమాయత్సాగర్ వైపు హైడ్రా బుల్డోజర్లు - ఇక కాంగ్రెస్ నేతల వంతు! - Hydra Demolitions in Himayat Sagar
Illegal Constructions in Himayat Sagar : హైడ్రా మరింత దూకుడు పెంచుతోంది. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపడుతోందని టెన్షన్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు రేగుతోంది. తాజాగా ఈ బుల్డోజర్లు హిమాయత్ సాగర్ వైపు సాగనున్నాయి. జలాశయ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీల నేతల ఇళ్లు, ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు ఉండటంతో ఈ అంశం మరింత కాకరేపుతోంది. | Read More
సూర్యలంక బీచ్కు మహర్దశ - రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం - Suryalanka Beach Development
NDA Government Focus on Suryalanka Beach: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. సూర్యలంక పర్యాటక అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు చేపట్టింది. కేంద్రం నిధులు విడుదల చేయడంతో తీరానికి సమీపంలో పర్యాటక శాఖకు చెందిన ఎనిమిది ఎకరాల్లో కొత్త రిసార్ట్ల నిర్మాణం చేపట్టనున్నారు. | Read More
భారు, కృష్ణ, లిల్లీ, మంజు, జస్సు ! వీరి కథే హిడెన్ కెమెరా ప్రచారం- నిజం తేల్చిన పోలీసులు - HIDEN CEMERA STORY
HIDEN CEMERA STORY : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టడంతో సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లుతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి వెళ్లాలన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. | Read More
హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు - రాంనగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత - Hydra Demolitions in Ramnagar
Hydra Focus On Ramnagar Illegal Constructions: హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. చెరువు పరిధిలో ఉన్నా, నాలాపై ఉన్నా రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రాంనగర్లోని మణెమ్మకాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది. | Read More
ఎట్టకేలకు పట్టాలెక్కిన కేసు- మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి నోటీసులు! - Raghu Rama krishna Raju Complaint
Raghu Rama krishna Raju Complaint Leads to Case : రఘురామకృష్ణరాజును సీఐడీ వేధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసి కొట్టారని గుంటూరు నగరంపాలెం పోలీసులకు రఘురామ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురికి నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. | Read More
ఇంజినీరింగ్ కాలేజీ బాలికల బాత్రూమ్లో సీక్రెట్ కెమెరాలు! - అర్ధరాత్రి హైడ్రామా - Hidden Cameras in Girls Hostel
Hidden Cameras in Engineering College Girls Hostel: ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. బాలికల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయంపై బాలికల హాస్టళ్లలో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ‘ఎక్స్’ వేదికగా విద్యార్థుల పోస్టులు పెడుతున్నారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. | Read More
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ - Heavy Rains in Andhra Pradesh
Heavy Rains in Andhra Pradesh State: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. | Read More
'అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది' - గిడుగు రామమూర్తి వేషధారణలో ఆకట్టుకున్న విద్యార్థులు - Glorious Telugu Language Day in AP
Telugu Language Day Celebration in AP: అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలుగు భాషాభిమానులు సూచించారు. రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు భాష కోసం కృషి చేస్తున్న వారిని గిడుగు రామమూర్తి పురస్కారాలతో సత్కరించారు. తెలుగు గొప్పతనాన్ని చాటే పాటలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. | Read More
అధికారులు తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవు: మంత్రి నిమ్మల - Nimmala Ramanaidu on Projects
Irrigation Minister Nimmala Ramanaidu on Projects: గడిచిన ఐదేళ్లు నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కాలువలకు గండ్లు పడుతున్న అంశంపై వివరణ కోరారు. సాగర్ కుడికాలువ ఆయకట్టుకు 15 రోజుల ముందే నీటిని విడుదల చేశామని, సాగర్ ఎడమ కాలువ జోన్-3 పరిధిలో చెరువులు నింపాలన్నారు. | Read More
ఫాగింగ్లో భారీ అవినీతి - వెలుగులోకి పాలకవర్గం దోపిడీ - Fogging Scam in Anantapur Municipal
Fogging Scam in Anantapur Municipality: దోమల నివారణకు సాయంత్రం వేళ పొగ వదలకుండానే ఫాగింగ్ పేరుతో లక్షల రూపాయలు కాజేశారు అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం. నగరపాలక సంస్థలో వెలుగుచూసిన ఫాగింగ్ అక్రమాలపై విచారణ జరిపితే మరిన్ని కుంభకోణాలు బయటకు రానున్నట్లు తెలుస్తోంది. ఫాగింగ్ పేరుతో పాలకవర్గం, కార్పొరేషన్ అధికారులు లక్షలు దోచేశారని స్థానికులు చెబుతున్నారు. | Read More
ఏపీలో మెట్రో ప్రాజెక్టులు పరుగులు - నాలుగు కారిడార్లుగా విశాఖ, రెండు దశల్లో విజయవాడ - అమరావతి - Metro Rail Projects in AP
Visakhapatnam and Vijayawada Metro Rail Projects: ఏపీ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. గత వైఎస్సార్సీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన మెట్రో రైలు ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్లు వెంటనే కేంద్రానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. | Read More
మూడు వారాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు- హర్షం వ్యక్తం చేస్తున్న నిపుణులు - Elections to irrigation societies
Irrigation Societies Elections Soon: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సాగునీటి సంఘాల ఎన్నికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు సంఘాలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహణపై సాగునీటి రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. | Read More