ETV Bharat / state

నైపుణ్యంలేని వారు ఇంగ్లీష్​లో ఎలా బోధిస్తారు?- జగన్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 21, 2024, 7:31 AM IST

AP High Court on English Medium in Govt Schools: నైపుణ్య పరీక్షలో అర్హత సాధించని వారు ఆంగ్ల మాధ్యమంలో ఏవిధంగా పాఠాలను బోధిస్తారని జగన్ సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత రెండేళ్లపాటు నైపుణ్య తరగతులుంటాయని ప్రభుత్వం చెప్పడాన్ని ఆక్షేపించింది.

AP_High_Court_on_English_Medium_in_Govt_Schools
AP_High_Court_on_English_Medium_in_Govt_Schools

AP High Court on English Medium in Govt Schools: నైపుణ్య పరీక్షలో అర్హత సాధించని వారు ఆంగ్ల మాధ్యమంలో ఎలా పాఠాలు బోధిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అర్హత సాధించని వారిని ఎంపిక చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఆంగ్ల నైపుణ్యం లేనివారితో బోధన సరికాదని పేర్కొంది. ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత రెండేళ్లపాటు నైపుణ్య తరగతులుంటాయని ప్రభుత్వం చెప్పడాన్ని ఆక్షేపించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసింది.

డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోందని, సంబంధిత నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వ విధానప్రమైన నిర్ణయాలలో ఏకపక్షంగా జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని కౌంటర్‌ దాఖలు చేశాక పరిశీలిస్తామంది. ముందే కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

కేఏ పాల్ పిటిషన్ స్పందించిన హైకోర్టు - తగు నిర్ణయం తీసుకోవాలని సీఈవోకు ఆదేశం

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయుల్ని నియమించాలని, అన్ని బడులను సమానంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఉపాధ్యాయుల నియామకం విషయంలో ప్రభుత్వం ఈ ఏడాది జారీచేసిన జీవోలు విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.

రెసిడెన్సియల్, మోడల్, గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారన్నారు. 2019 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల పరిధిలోని ప్రభుత్వ, పంచాయతీ, మున్సిపాలిటీ, జడ్పీ తదితర పాఠశాలల్లో ఆంగ్రమాధ్యమాన్ని తప్పనిసరి చేసినట్లు చెబుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంగా మార్చామన్న సర్కారు మాట నిజమైతే వాటిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంగ్ల నైపుణ్య పరీక్షలో అర్హత సాధించిన వారినే తర్వాత ప్రక్రియకు అనుమతించాలన్నారు.

అయితే స్థానిక సంస్థల పరిధిలోని పాఠశాలల టీచర్ల నియామకంలో ఆంగ్ల నైపుణ్య పరీక్ష నిర్వహించడం లేదన్నారు. అర్హులైన టీచర్లను నియమించేలా ఆదేశించాలని కోరారు. విద్యాశాఖ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి టీచర్లుగా ఎంపికైన తర్వాత రెండేళ్లపాటు నైపుణ్య తరగతులు నిర్వహిస్తామన్నారు. దీనిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయగా కౌంటర్‌ వేయడానికి సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మే1కి వాయిదా వేసింది.

ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతి ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు

AP High Court on English Medium in Govt Schools: నైపుణ్య పరీక్షలో అర్హత సాధించని వారు ఆంగ్ల మాధ్యమంలో ఎలా పాఠాలు బోధిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అర్హత సాధించని వారిని ఎంపిక చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఆంగ్ల నైపుణ్యం లేనివారితో బోధన సరికాదని పేర్కొంది. ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత రెండేళ్లపాటు నైపుణ్య తరగతులుంటాయని ప్రభుత్వం చెప్పడాన్ని ఆక్షేపించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌కు నోటీసులు జారీచేసింది.

డీఎస్సీ ప్రక్రియ కొనసాగుతోందని, సంబంధిత నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ప్రభుత్వ విధానప్రమైన నిర్ణయాలలో ఏకపక్షంగా జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని కౌంటర్‌ దాఖలు చేశాక పరిశీలిస్తామంది. ముందే కోర్టును ఆశ్రయించి ఉండాల్సిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

కేఏ పాల్ పిటిషన్ స్పందించిన హైకోర్టు - తగు నిర్ణయం తీసుకోవాలని సీఈవోకు ఆదేశం

ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత గల ఉపాధ్యాయుల్ని నియమించాలని, అన్ని బడులను సమానంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఉపాధ్యాయుల నియామకం విషయంలో ప్రభుత్వం ఈ ఏడాది జారీచేసిన జీవోలు విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపించారు.

రెసిడెన్సియల్, మోడల్, గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్నారన్నారు. 2019 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల పరిధిలోని ప్రభుత్వ, పంచాయతీ, మున్సిపాలిటీ, జడ్పీ తదితర పాఠశాలల్లో ఆంగ్రమాధ్యమాన్ని తప్పనిసరి చేసినట్లు చెబుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంగా మార్చామన్న సర్కారు మాట నిజమైతే వాటిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆంగ్ల నైపుణ్య పరీక్షలో అర్హత సాధించిన వారినే తర్వాత ప్రక్రియకు అనుమతించాలన్నారు.

అయితే స్థానిక సంస్థల పరిధిలోని పాఠశాలల టీచర్ల నియామకంలో ఆంగ్ల నైపుణ్య పరీక్ష నిర్వహించడం లేదన్నారు. అర్హులైన టీచర్లను నియమించేలా ఆదేశించాలని కోరారు. విద్యాశాఖ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి టీచర్లుగా ఎంపికైన తర్వాత రెండేళ్లపాటు నైపుణ్య తరగతులు నిర్వహిస్తామన్నారు. దీనిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయగా కౌంటర్‌ వేయడానికి సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మే1కి వాయిదా వేసింది.

ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతి ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.