ETV Bharat / state

ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల - జులై 2 నుంచి ఓపెన్‌కానున్న వెబ్‌సైట్‌ - AP TET NOTIFICATION 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 9:08 PM IST

Updated : Jul 1, 2024, 9:30 PM IST

Andhra Pradesh TET Notification 2024 : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. జులై 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది.

AP tet notification
AP tet notification (ETV Bharat)

Andhra Pradesh TET Notification 2024 : ఏపీలో 16 వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. మరోవైపు, మెగా డీఎస్సీకి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, షెడ్యూల్‌, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను ఖరారు చేసినట్లు పేర్కొంది.

ఇటీవల ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత ప్రభుత్వం టెట్​ను నిర్వహించింది. ఈ పరీక్షకు 2.35లక్షల మంది హాజరైతే, వారిలో 1,37,903 మంది (58.46శాతం) అర్హత సాధించారు. అయితే, కొత్త ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో భాగంగా పేపర్​-1 రాయాలంటే డీఈడీ అర్హత ఉండాలి. పేపర్​-2 రాయాలంటే డిగ్రీ, బీఈడీ చదివి ఉండాలి.

AP DSC Notification Cancelled 2024 : మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ ఈరోజు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan meeting in Gollaprolu

New Pension in AP: మీకూ పెన్షన్​ కావాలా? అయితే దరఖాస్తు చేసుకోండిలా! - HOW TO APPLY FOR NEW PENSION in AP

Andhra Pradesh TET Notification 2024 : ఏపీలో 16 వేలకు పైగా టీచర్‌ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న తరుణంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం రాత్రి టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను cse.ap.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు. మరోవైపు, మెగా డీఎస్సీకి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్‌కు 20శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, షెడ్యూల్‌, సిలబస్‌తో పాటు ఆన్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షపై అభ్యర్థులకు తగిన సూచనలు, విధివిధానాలను ఖరారు చేసినట్లు పేర్కొంది.

ఇటీవల ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6వరకు గత ప్రభుత్వం టెట్​ను నిర్వహించింది. ఈ పరీక్షకు 2.35లక్షల మంది హాజరైతే, వారిలో 1,37,903 మంది (58.46శాతం) అర్హత సాధించారు. అయితే, కొత్త ప్రభుత్వం పాత డీఎస్సీని రద్దు చేసి, కొత్తగా 16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఈడీ, డీఎడ్‌ పాసైన అభ్యర్థులతో పాటు ఇటీవల ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్‌ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. ఇందులో భాగంగా పేపర్​-1 రాయాలంటే డీఈడీ అర్హత ఉండాలి. పేపర్​-2 రాయాలంటే డిగ్రీ, బీఈడీ చదివి ఉండాలి.

AP DSC Notification Cancelled 2024 : మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ ఈరోజు విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan meeting in Gollaprolu

New Pension in AP: మీకూ పెన్షన్​ కావాలా? అయితే దరఖాస్తు చేసుకోండిలా! - HOW TO APPLY FOR NEW PENSION in AP

Last Updated : Jul 1, 2024, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.