ETV Bharat / state

శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ స్కామ్​లో నిజాలు వెలుగు చూసేనా? - PARAKAMANI SCAM IN TIRUMALA

శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీలో కొత్త కోణం - నిందితుడు గతంలో చేసిన చోరీపై రాజీకి ఒత్తిడి - పూర్తిస్థాయి దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం

Parakamani Scam In Tirumala
Parakamani Scam In Tirumala (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2024, 4:00 PM IST

Parakamani Scam In Tirumala : దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు తర్వాత కోర్టులో శిక్ష విధించి జైలుకు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నం. ఏళ్లతరబడి శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైనటువంటి రవికుమార్‌తో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజీ చేసుకోవాలని పోలీసు అధికారి ఒకరు అప్పటి విజిలెన్స్‌ ఏవీఎస్‌ఓపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారుతోంది. ఆ పోలీసు అధికారిని వెనకుండి నడిపించిందెవరనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి.

అసలింతకీ ఏం జరిగింది? : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలోని పెద్దజీయంగారి మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నటువంటి సి.వి.రవికుమార్‌ పరకామణి లెక్కింపు సమయంలో మఠం ప్రతినిధిగా వ్యవహరించారు. 2023 ఏప్రిల్‌ 29న అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి చంద్ర అనే వ్యక్తి రవికుమార్‌పై అనుమానంతో అక్కడే ఉన్న ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో సతీష్‌కుమార్‌తో పాటు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరాజు, ఇతర సిబ్బంది రవికుమార్‌ను తనిఖీ చేసి 100 డాలర్లను అక్రమంగా తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు.

30 ఏళ్లుగా ఉన్న తాను మొదటిసారి తప్పు చేశానని, వదిలేయాలని ఆయన అధికారులను వేడుకున్నారు. దీనిపై అదే రోజున పరకామణి ఏవీఎస్‌ఓ తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

కేసును నీరుగార్చి : ఏవీఎస్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాడు కేసు నమోదైంది. 2023 మే 30న తిరుపతి 2వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు ఛార్జిషీటును దాఖలు చేశారు. ఈ సమయంలోనే నాటి పోలీసులు కేసును పక్కదారి పట్టించి నీరుగార్చారు. నిందితుడిని అరెస్టుచేసి ఎంక్వైరీ చేయకుండా నాటి ఏవీఎస్‌ఓతో లోక్‌ అదాలత్‌లో రాజీ చేయించారు. ఆ తర్వాత రవికుమార్, అతని భార్య తమ ఆస్తులను స్వామి పేరిట రాసిచ్చారు.

అంతా తానై నడిపిన అధికారి : ఈ వ్యవహారంపై శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి లేఖను రాశారు. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారి గిరిధర్‌రావు సీవీఎస్‌ఓకు ఒక నివేదిక అందించారు. ఆ రిపోర్టులో నాటి పోలీసు అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడం వల్లే రాజీ కుదుర్చుకున్నట్లుగా అప్పటి పరకామణి ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాడు తిరుమలలో పనిచేసినటువంటి ఓ పోలీసు అధికారి ఎస్పీ కంటే కూడా శక్తిమంతుడిగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ నాటి శాసనసభ్యుడి వాహనంలో ప్రయాణించారన్నటువంటి ఆరోపణలున్నాయి. అప్పటి టీటీడీ ఉన్నతాధికారి, ఛైర్మన్‌ సైతం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ వ్యవహారంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని వినిపిస్తున్నాయి.

తిరుమల హుండీలో విదేశీ కరెన్సీ స్వాహా! - పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - టీటీడీ కీలక ఏర్పాట్లు ఇవే

Parakamani Scam In Tirumala : దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు తర్వాత కోర్టులో శిక్ష విధించి జైలుకు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నం. ఏళ్లతరబడి శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైనటువంటి రవికుమార్‌తో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాజీ చేసుకోవాలని పోలీసు అధికారి ఒకరు అప్పటి విజిలెన్స్‌ ఏవీఎస్‌ఓపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారుతోంది. ఆ పోలీసు అధికారిని వెనకుండి నడిపించిందెవరనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి.

అసలింతకీ ఏం జరిగింది? : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలోని పెద్దజీయంగారి మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నటువంటి సి.వి.రవికుమార్‌ పరకామణి లెక్కింపు సమయంలో మఠం ప్రతినిధిగా వ్యవహరించారు. 2023 ఏప్రిల్‌ 29న అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి చంద్ర అనే వ్యక్తి రవికుమార్‌పై అనుమానంతో అక్కడే ఉన్న ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో సతీష్‌కుమార్‌తో పాటు విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరాజు, ఇతర సిబ్బంది రవికుమార్‌ను తనిఖీ చేసి 100 డాలర్లను అక్రమంగా తీసుకెళ్తున్నట్లుగా గుర్తించారు.

30 ఏళ్లుగా ఉన్న తాను మొదటిసారి తప్పు చేశానని, వదిలేయాలని ఆయన అధికారులను వేడుకున్నారు. దీనిపై అదే రోజున పరకామణి ఏవీఎస్‌ఓ తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

కేసును నీరుగార్చి : ఏవీఎస్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాడు కేసు నమోదైంది. 2023 మే 30న తిరుపతి 2వ అదనపు ఫస్ట్‌క్లాస్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు ఛార్జిషీటును దాఖలు చేశారు. ఈ సమయంలోనే నాటి పోలీసులు కేసును పక్కదారి పట్టించి నీరుగార్చారు. నిందితుడిని అరెస్టుచేసి ఎంక్వైరీ చేయకుండా నాటి ఏవీఎస్‌ఓతో లోక్‌ అదాలత్‌లో రాజీ చేయించారు. ఆ తర్వాత రవికుమార్, అతని భార్య తమ ఆస్తులను స్వామి పేరిట రాసిచ్చారు.

అంతా తానై నడిపిన అధికారి : ఈ వ్యవహారంపై శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డికి లేఖను రాశారు. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారి గిరిధర్‌రావు సీవీఎస్‌ఓకు ఒక నివేదిక అందించారు. ఆ రిపోర్టులో నాటి పోలీసు అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడం వల్లే రాజీ కుదుర్చుకున్నట్లుగా అప్పటి పరకామణి ఏవీఎస్‌ఓ సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. నాడు తిరుమలలో పనిచేసినటువంటి ఓ పోలీసు అధికారి ఎస్పీ కంటే కూడా శక్తిమంతుడిగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ నాటి శాసనసభ్యుడి వాహనంలో ప్రయాణించారన్నటువంటి ఆరోపణలున్నాయి. అప్పటి టీటీడీ ఉన్నతాధికారి, ఛైర్మన్‌ సైతం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ వ్యవహారంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని వినిపిస్తున్నాయి.

తిరుమల హుండీలో విదేశీ కరెన్సీ స్వాహా! - పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం - టీటీడీ కీలక ఏర్పాట్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.