ETV Bharat / state

ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం - పోలీసుల అదుపులో నిందితులు

శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం - ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బాధితులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

GANG RAPE CASE
TWO WOMENS GANG RAPE CASE IN SATYA SAI DISTRICT (ETV Bharat)

Arrests in Women Gang Rape Case: శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో హిందూపురానికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా పోలీసులు గుర్తించారు. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

కత్తులతో ఇద్దరు మహిళలనీ బెదిరించి మరీ ఇలా: ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి మరీ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు మహిళలపై, వారి భర్తలపై దాడికి తెగబడిన అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించి మొత్తానికి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

CM Chandrababu Phone to SP About Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో ఫోన్​లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్​మెన్, అతని కుమారుడిని కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ సీఎంకు వివరించారు. ఉపాధి కోసం వాచ్​మెన్ కుటుంబం బళ్లారి నుంచి వచ్చిందని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు.

ఉపాధి కోసం వచ్చిన వారిపై అత్యాచారం దారుణం: అత్యాచార ఘటనపై మంత్రి సవిత విచారం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖకు చెందిన వారిని సమన్వయం చేసి మరీ నేరస్థలను పట్టుకోవడంలో కీలక పాత్రను పోషించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హోంశాఖ మంత్రి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన వారిపై అత్యాచారం చేయడం క్షమించరాని నేరమని ఆమె మండిపడ్డారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఉంటుందన్నారు. ఈ అత్యాచారానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని వారు స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుపై పోలీసులు సమగ్రమైన దర్యాప్తును నిర్వహిస్తున్నారు. బాధితురాలైన మహిళలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ పునరావృతం కాకుండా కొత్త నేర చట్టాలను అవలంభించి దానికి అనుగుణంగా శిక్షలను అమలు చేస్తామని వారు వెల్లడించారు.

బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి

మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం- మనస్తాపంతో ఆత్మహత్య!

నర్సుపై గ్యాంగ్​రేప్ అటెంప్ట్- డాక్టర్ ప్రైవేట్ పార్టులను కోసేసిన బాధితురాలు - Gang Rape Attempt On Nurse

Arrests in Women Gang Rape Case: శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో హిందూపురానికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు చిల్లర దొంగతనాలు చేసే ముఠాగా పోలీసులు గుర్తించారు. నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

కత్తులతో ఇద్దరు మహిళలనీ బెదిరించి మరీ ఇలా: ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి మరీ నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు మహిళలపై, వారి భర్తలపై దాడికి తెగబడిన అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించి మొత్తానికి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

CM Chandrababu Phone to SP About Gang Rape: గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా ఎస్పీతో ఫోన్​లో మాట్లాడి ఘటనపై దర్యాప్తు వివరాలు తెలుసుకున్నారు. వాచ్​మెన్, అతని కుమారుడిని కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ సీఎంకు వివరించారు. ఉపాధి కోసం వాచ్​మెన్ కుటుంబం బళ్లారి నుంచి వచ్చిందని తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని సీఎం ఆదేశించారు.

ఉపాధి కోసం వచ్చిన వారిపై అత్యాచారం దారుణం: అత్యాచార ఘటనపై మంత్రి సవిత విచారం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖకు చెందిన వారిని సమన్వయం చేసి మరీ నేరస్థలను పట్టుకోవడంలో కీలక పాత్రను పోషించారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందిగా బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. హోంశాఖ మంత్రి నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చిన వారిపై అత్యాచారం చేయడం క్షమించరాని నేరమని ఆమె మండిపడ్డారు.

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఉంటుందన్నారు. ఈ అత్యాచారానికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని వారు స్పష్టం చేశారు. ఘటన జరిగిన తీరుపై పోలీసులు సమగ్రమైన దర్యాప్తును నిర్వహిస్తున్నారు. బాధితురాలైన మహిళలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ పునరావృతం కాకుండా కొత్త నేర చట్టాలను అవలంభించి దానికి అనుగుణంగా శిక్షలను అమలు చేస్తామని వారు వెల్లడించారు.

బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి

మద్యం మత్తులో దివ్యాంగురాలిపై అత్యాచారం- మనస్తాపంతో ఆత్మహత్య!

నర్సుపై గ్యాంగ్​రేప్ అటెంప్ట్- డాక్టర్ ప్రైవేట్ పార్టులను కోసేసిన బాధితురాలు - Gang Rape Attempt On Nurse

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.