ETV Bharat / state

రూ.కోటిన్నర లేదంటే రెండు ప్లాట్లు కోరిన సీఐ - లంచం డబ్బులు లెక్కిస్తుండగా ఏమైందంటే! - Corrupt Police

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 4:14 PM IST

Suspended CI Caught by ACB Officials in Hyderabad : స్థిరాస్తి లావాదేవీపై నమోదైన కేసులో వ్యాపారి పేరును తొలగించేందుకు రూ.కోటిన్నర నగదు లేదా రెండు ఫ్లాట్లు ఇవ్వాలని సస్పెండ్​ అయిన సీఐ డిమాండ్​ చేశాడు. దీంతో చేసేదేమీలేక స్థిరాస్తి వ్యాపారి రూ.10 లక్షలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు కావాలని ఒత్తిడి తేవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీపీ ఆ అధికారిని రెడ్​ హ్యాండెండ్​గా పట్టుకుని న్యాయస్థానంలో హాజరుపరిచింది.

corrupt_police
corrupt_police (ETV Bharat)

Suspended CI Caught by ACB Officials while Taking Bribe : హైదరాబాద్​ నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి భాగ్యనగరానికి ప్రముఖ కంపెనీలు, స్టార్టప్​లు వరుస క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ పారిశ్రామిక, ఐటీ రంగం డెవలప్​ చెందుతోంది. దీంతో హైదరాబాద్​ చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.100 కోట్ల వరకు వెళ్తుందంటేనే ఏ రేంజ్​లో ధర ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కంపెనీలు సైతం అంతే పోటాపోటీగా డబ్బులను వెచ్చిస్తున్నాయో చూడవచ్చు.

ఈ క్రమంలో రియల్​ ఎస్టేట్​ రంగం అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. స్థిరాస్తి వ్యాపారం పెరిగేకొద్దీ​ ఆ ముసుగులో అనేక దందాలు జరుగుతున్నాయి. ఈ దందాల పంచాయితీల్లో కొందరు పోలీసులు సైతం కలుగుజేసుకొని వారి జేబులకు పని చెబుతున్నారు. తాజాగా స్థిరాస్తి వ్యాపార లావాదేవీపై నమోదైన కేసులో వ్యాపారి పేరును తొలగించడానికి లంచం తీసుకుంటూ ఓ సస్పెండైన సీఐ​ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి సీసీఎస్​లో పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్​లో సాయి వెంకట కిశోర్​ ఉన్నారు. ఆయన అమీన్​పూర్​లో ఉంటున్న స్థిరాస్తి వ్యాపారి రవిగౌడ్​ను కొద్ది రోజులుగా డబ్బులివ్వాలంటూ బెదిరిస్తున్నాడు. అయితే నిరుడు కిశోర్​ అమీన్​పూర్​ సీఐగా విధులు నిర్వహించారు. అప్పుడు సంగారెడ్డి పోలీస్​ స్టేషన్​లో స్థిరాస్తి వ్యాపారికి సంబంధించి ఓ కేసు నమోదైంది. ఆ కేసులో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి రవిగౌడ్​ పేరును చేర్చారు. అప్పుడు ఆ కేసులో తన పేరును తొలగిస్తానని, అందుకు బదులుగా రూ.1.50 కోట్ల నగదు లేదంటే అమీన్​పూర్​లో రెండు ఫ్లాట్లు రాసివ్వాలని స్థిరాస్తి వ్యాపారిని కిశోర్​ డిమాండ్​ చేశాడు.

రవిగౌడ్​ను బెదిరించిన కిశోర్​ : దీంతో రవిగౌడ్​ రెండు నెలల క్రితం రూ.10 లక్షలు ఇచ్చాడు. మిగిలిన రూ.1.40 కోట్లు తొందరగా ఉవ్వాలంటూ కిశోర్​ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే కిశోర్​ సంగారెడ్డి సీసీఎస్​కు బదిలీ అయ్యాడు. అయినా రవిగౌడ్​ను సస్పెండ్​ సీఐ​ బెదిరించడం ఆపలేదు. ఇటీవల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతను సస్పెండ్​ అయ్యాడు. అయినాసరే రవిగౌడ్​ను బెదిరించడం ఆపలేదు. తన స్నేహితులైన సీఐలతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు.

దీంతో బాధితుడు చేసేదేమీలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల ప్లాన్​లో భాగంగా సోమవారం రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి మియాపూర్​లోని మయూర్​మార్గ్​ వద్దకు రావాలని కిశోర్​కు రవిగౌడ్​తో ఫోన్​ చేయించారు. అక్కడకు చేరుకున్న సస్పెండ్​ పోలీసు కిశోర్​ డబ్బులు తీసుకుని లెక్కిస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో కిశోర్​ను హాజరుపరిచారు.

ఏసీబీ ట్రాప్‌- రూ.3లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ సీఐ

'రూ.3 లక్షలిస్తే నీ ల్యాండ్​ ప్రాబ్లమ్​ సెటిల్​ చేస్తాం' - ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్సై - Kushaiguda Police SHO Caught by ACB

Suspended CI Caught by ACB Officials while Taking Bribe : హైదరాబాద్​ నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి భాగ్యనగరానికి ప్రముఖ కంపెనీలు, స్టార్టప్​లు వరుస క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ పారిశ్రామిక, ఐటీ రంగం డెవలప్​ చెందుతోంది. దీంతో హైదరాబాద్​ చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక్కడ ఎకరం భూమి రూ.100 కోట్ల వరకు వెళ్తుందంటేనే ఏ రేంజ్​లో ధర ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే కంపెనీలు సైతం అంతే పోటాపోటీగా డబ్బులను వెచ్చిస్తున్నాయో చూడవచ్చు.

ఈ క్రమంలో రియల్​ ఎస్టేట్​ రంగం అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. స్థిరాస్తి వ్యాపారం పెరిగేకొద్దీ​ ఆ ముసుగులో అనేక దందాలు జరుగుతున్నాయి. ఈ దందాల పంచాయితీల్లో కొందరు పోలీసులు సైతం కలుగుజేసుకొని వారి జేబులకు పని చెబుతున్నారు. తాజాగా స్థిరాస్తి వ్యాపార లావాదేవీపై నమోదైన కేసులో వ్యాపారి పేరును తొలగించడానికి లంచం తీసుకుంటూ ఓ సస్పెండైన సీఐ​ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డి సీసీఎస్​లో పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్​లో సాయి వెంకట కిశోర్​ ఉన్నారు. ఆయన అమీన్​పూర్​లో ఉంటున్న స్థిరాస్తి వ్యాపారి రవిగౌడ్​ను కొద్ది రోజులుగా డబ్బులివ్వాలంటూ బెదిరిస్తున్నాడు. అయితే నిరుడు కిశోర్​ అమీన్​పూర్​ సీఐగా విధులు నిర్వహించారు. అప్పుడు సంగారెడ్డి పోలీస్​ స్టేషన్​లో స్థిరాస్తి వ్యాపారికి సంబంధించి ఓ కేసు నమోదైంది. ఆ కేసులో రియల్​ ఎస్టేట్​ వ్యాపారి రవిగౌడ్​ పేరును చేర్చారు. అప్పుడు ఆ కేసులో తన పేరును తొలగిస్తానని, అందుకు బదులుగా రూ.1.50 కోట్ల నగదు లేదంటే అమీన్​పూర్​లో రెండు ఫ్లాట్లు రాసివ్వాలని స్థిరాస్తి వ్యాపారిని కిశోర్​ డిమాండ్​ చేశాడు.

రవిగౌడ్​ను బెదిరించిన కిశోర్​ : దీంతో రవిగౌడ్​ రెండు నెలల క్రితం రూ.10 లక్షలు ఇచ్చాడు. మిగిలిన రూ.1.40 కోట్లు తొందరగా ఉవ్వాలంటూ కిశోర్​ అతనిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే కిశోర్​ సంగారెడ్డి సీసీఎస్​కు బదిలీ అయ్యాడు. అయినా రవిగౌడ్​ను సస్పెండ్​ సీఐ​ బెదిరించడం ఆపలేదు. ఇటీవల క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతను సస్పెండ్​ అయ్యాడు. అయినాసరే రవిగౌడ్​ను బెదిరించడం ఆపలేదు. తన స్నేహితులైన సీఐలతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు.

దీంతో బాధితుడు చేసేదేమీలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల ప్లాన్​లో భాగంగా సోమవారం రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి మియాపూర్​లోని మయూర్​మార్గ్​ వద్దకు రావాలని కిశోర్​కు రవిగౌడ్​తో ఫోన్​ చేయించారు. అక్కడకు చేరుకున్న సస్పెండ్​ పోలీసు కిశోర్​ డబ్బులు తీసుకుని లెక్కిస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో కిశోర్​ను హాజరుపరిచారు.

ఏసీబీ ట్రాప్‌- రూ.3లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ సీఐ

'రూ.3 లక్షలిస్తే నీ ల్యాండ్​ ప్రాబ్లమ్​ సెటిల్​ చేస్తాం' - ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్సై - Kushaiguda Police SHO Caught by ACB

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.