ETV Bharat / state

నాసిరకం భోజనంతో వెల్దండ ఆదర్శ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత - Students fell ill in nagar kurnool

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 4:36 PM IST

Students Fell Ill in Nagar Kurnool : నాసిరకం భోజనంతో నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఆదర్శ బాలికల పాఠశాల 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో పురుగుల అన్నం, నాసిరకం కూరలతో ఆహారం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. హస్టల్​లో తాగడానికి శుద్ధి చేసిన మంచినీళ్లు కూడా లేవని వాపోతున్నారు.

Students Sick with Poor Quality Food
Students Fell Ill in Nagar Kurnool (ETV Bharat)

Students Sick with Poor Quality Food : వసతి గృహంలో సరైన భోజనం లేక 20 మంది బాలికలు అస్వస్థతకు గురయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఆదర్శ బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా వసతిగృహంలో ఉడికీ ఉడకని అన్నం, నాసిరకం కూరలు, నాణ్యత లేని భోజనం పెడుతుండటంతో సరిగా భోజనం చేయడం లేదని విద్యార్థినులు పేర్కొంటున్నారు. గడిచిన 2 రోజుల నుంచి విద్యార్థులు భోజనం చేయకపోవడంతో ఇవాళ తీవ్ర కడుపునొప్పితో వెల్దండ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చేరారు.

నాసిరకం భోజనంతో వెల్దండ ఆదర్శ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత (ETV Bharat)

మంచినీటి గోస : మరి కొంతమంది విద్యార్థినులను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పీడీఎస్​యూ, ఎన్​ఎస్​యూ విద్యార్థి సంఘాల నాయకులు వసతి గృహానికి చేరుకొని బాలికల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్​లో వండుతున్న భోజనం అస్సలు బాగోలేదని పురుగుల అన్నం, నాసిరకం కూరలతో ఆహారం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఆహారం మాత్రమే కాదు, హస్టల్​లో తాగడానికి శుద్ధి చేసిన మంచినీళ్లు కూడా లేవని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం నీటి సమస్య ఉందని పేర్కొన్నారు.

వసతుల లేమి : హాస్టల్లో భోజనం బాగోలేక అస్వస్థతకు గురైతే ప్రభుత్వాసుపత్రి కూడా దగ్గరలో లేదని, ప్రైవేటు ఆసుపత్రులను వెళ్లాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోయారు. హస్టల్​లోనే వైద్యం అందించేందుకు స్టాఫ్ నర్సు ఉండాలని, అత్యవసరమైతే వెంటనే వెళ్లడానికి వాహన సౌకర్యం కావాలని విద్యార్థినులు కోరుతున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లకు సరైన తలుపులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టల్​లో ఇవాళ ఉదయం, మధ్యాహ్నం వండిన ఆహారాన్ని తినేందుకు విద్యార్థినులు ససేమిరా అన్నారు. చివరకు వైస్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ సొంత డబ్బులు ఖర్చుపెట్టి విద్యార్థినులకు అల్పాహారం సమకూర్చాడు. అధికారులు తక్షణమే హస్టల్ విద్యార్ధుల సమస్యలపై స్పందించాలని, ఉన్నతాధికారులు స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు.

"హాస్టల్​లో వండుతున్న భోజనం అస్సలు బాగోలేదు. పురుగుల అన్నం, నాసిరకం కూరలతో ఆహారం పెడుతున్నారు. హాస్టల్​లో తాగడానికి శుద్ధి చేసిన మంచినీళ్లు కూడా లేవు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం నీటి సమస్య ఉంది. మా వసతి గృహం సమస్యలను పరిష్కరించాలి". - విద్యార్థిని, వెల్దండ ఆదర్శ పాఠశాల

పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థుల ధర్నా - స్పందించిన అధికారులు - Kasturba Students Protest on Food

అనారోగ్యాల బారిన పడుతున్న గురుకుల విద్యార్థులు - ఒక్క రోజులోనే ముగ్గురికి అస్వస్థత - Gurukul Students illnesses

Students Sick with Poor Quality Food : వసతి గృహంలో సరైన భోజనం లేక 20 మంది బాలికలు అస్వస్థతకు గురయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఆదర్శ బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా వసతిగృహంలో ఉడికీ ఉడకని అన్నం, నాసిరకం కూరలు, నాణ్యత లేని భోజనం పెడుతుండటంతో సరిగా భోజనం చేయడం లేదని విద్యార్థినులు పేర్కొంటున్నారు. గడిచిన 2 రోజుల నుంచి విద్యార్థులు భోజనం చేయకపోవడంతో ఇవాళ తీవ్ర కడుపునొప్పితో వెల్దండ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చేరారు.

నాసిరకం భోజనంతో వెల్దండ ఆదర్శ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత (ETV Bharat)

మంచినీటి గోస : మరి కొంతమంది విద్యార్థినులను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పీడీఎస్​యూ, ఎన్​ఎస్​యూ విద్యార్థి సంఘాల నాయకులు వసతి గృహానికి చేరుకొని బాలికల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్​లో వండుతున్న భోజనం అస్సలు బాగోలేదని పురుగుల అన్నం, నాసిరకం కూరలతో ఆహారం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఆహారం మాత్రమే కాదు, హస్టల్​లో తాగడానికి శుద్ధి చేసిన మంచినీళ్లు కూడా లేవని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం నీటి సమస్య ఉందని పేర్కొన్నారు.

వసతుల లేమి : హాస్టల్లో భోజనం బాగోలేక అస్వస్థతకు గురైతే ప్రభుత్వాసుపత్రి కూడా దగ్గరలో లేదని, ప్రైవేటు ఆసుపత్రులను వెళ్లాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోయారు. హస్టల్​లోనే వైద్యం అందించేందుకు స్టాఫ్ నర్సు ఉండాలని, అత్యవసరమైతే వెంటనే వెళ్లడానికి వాహన సౌకర్యం కావాలని విద్యార్థినులు కోరుతున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లకు సరైన తలుపులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టల్​లో ఇవాళ ఉదయం, మధ్యాహ్నం వండిన ఆహారాన్ని తినేందుకు విద్యార్థినులు ససేమిరా అన్నారు. చివరకు వైస్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ సొంత డబ్బులు ఖర్చుపెట్టి విద్యార్థినులకు అల్పాహారం సమకూర్చాడు. అధికారులు తక్షణమే హస్టల్ విద్యార్ధుల సమస్యలపై స్పందించాలని, ఉన్నతాధికారులు స్పందించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు.

"హాస్టల్​లో వండుతున్న భోజనం అస్సలు బాగోలేదు. పురుగుల అన్నం, నాసిరకం కూరలతో ఆహారం పెడుతున్నారు. హాస్టల్​లో తాగడానికి శుద్ధి చేసిన మంచినీళ్లు కూడా లేవు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం నీటి సమస్య ఉంది. మా వసతి గృహం సమస్యలను పరిష్కరించాలి". - విద్యార్థిని, వెల్దండ ఆదర్శ పాఠశాల

పురుగులున్న ఆహారాన్ని పెడుతున్నారని విద్యార్థుల ధర్నా - స్పందించిన అధికారులు - Kasturba Students Protest on Food

అనారోగ్యాల బారిన పడుతున్న గురుకుల విద్యార్థులు - ఒక్క రోజులోనే ముగ్గురికి అస్వస్థత - Gurukul Students illnesses

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.