ETV Bharat / sports

అండర్ - 19 వరల్డ్​ కప్ : 'అదే మా ప్లాన్​ - అందుకే గెలిచాం'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 2:13 PM IST

U19 World Cup 2024 Uday Saharan : సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి యువ భారత్‌ అండర్ 19 వరల్డ్‌ కప్​ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఉదయ్‌ సహరన్‌ కీలక పాత్ర పోషించాడు. ఫైనల్​కు చేరుకోవడంపై ఆనంద వ్యక్తం చేశారు.

U19 World Cup 2024 Uday Saharan
U19 World Cup 2024 Uday Saharan

U19 World Cup 2024 Uday Saharan : అండర్‌-19 ప్రపంచ కప్‌లో యంగ్​ టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం సౌతాఫ్రికాతో బెనోని వేదికగా జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్​ ఫైనల్​కు చేరుకుంది. స్వల్ప వ్యవధిలోనే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయిన టీమ్​ ఇండియాను సచిన్​ దాస్​తో కలిసి కెప్టెన్ ఉదయ్ సహరన్​ గెలిపించాడు. దీంతో సహరన్​ 'ఫ్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​' అవార్డును దక్కించుకున్నాడు. అయితే అండర్-19 వరల్డ్ కప్​ ఫైనల్​కు చేరుకోవడంపై సహరన్​ ఆనందం వ్యక్తం చేశారు.

చివరి వరకూ క్రీజులో ఉండాలి : మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు చివరి వరకూ క్రీజులో ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్లు ఉదయ్ సహరన్ చెప్పాడు. " నా ఆటతీరుపై నాకు నమ్మకముంది. ఒక మంచి భాగస్వామ్యం ఉంటే చాలు గెలవడం పెద్ద కష్టం కాదని నేను నమ్ముతాను. మ్యాచ్​ను చివరి వరకూ తీసుకెళ్లాలని మనసులోనే అనుకుంటూ ఉన్నాను. కేవలం నేను ఆరు ఫోర్లు మాత్రమే కొట్టాను. అందులో నాకు ఎలాంటి బాధ లేదు. ఇలా ఆడటం మా నాన్న నుంచి నేర్చుకున్నా. అవసరమైతే చివర్లో భారీ షాట్లు కొట్టాలని భావించాను. నేను క్రీజులో ఉండటమే చాలా ముఖ్యమని తెలుసు" అని ఉదయ్ సహరన్ అంటున్నారు.

" నేను బ్యాటింగ్​కు వచ్చే సమయానికి బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది.పేసర్లకు అనకూలంగా ఉంది. అందుకే తొలుత సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాను. కొంచెం సేపు తర్వాత బ్యాటింగ్​కు అనుకూలంగా మారింది. అప్పటికీ బంతి బౌన్స్ అవుతూనే ఉంది. అయితే అప్పటికే మేం క్రీజులో కుదురుకోవటం వల్ల పెద్ద కష్టంగా అనిపించలేదు. సచిన్​ దాస్​కు ఒకటే చెప్పాను. చివరి వరకూ క్రీజులో ఉండేందుకు ప్రయత్నించు. నేను ఉంటా. అప్పుడే మ్యాచ్​ గెలవడం తేలికవుతుందని అన్నాను. అలా జరగకపోతే పరుగులు చేయటం చాలా కష్టమవుతుంది. బౌండరీ లైన్​ ఆవతల నుంచి మా కోచింగ్​ సిబ్బంది మమ్మల్ని ప్రోత్సహించారు. నా కెప్టెన్సీలో సెమీస్​లో విజయం సాధించి ఫైనల్​కు చేరడం ఆనందంగా ఉంది. అక్కడ కూడా మంచి ఆటతీరుతో ఛాంపియన్​గా నిలుస్తామని భావిస్తున్నా. అలానే ఈ సెమీస్​ మ్యాచ్​ మాకు తుది పోరుకు మంచి ప్రాక్టీస్ చేసినట్లుగా ఉంది" - ఉదయ్ సహరన్, అండర్-19 టీమ్​ఇండియా కెప్టెన్

క్లిష్ట పరిస్థితుల్లో ఉదయ్‌, సచిన్‌ దాస్‌ సూపర్ ఇన్నింగ్స్‌
టీమ్​ఇండియా టార్గెట్ 254 పరుగులు. అయితే అప్పటికే 32 పరుగలకే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ సయమంలో కెప్టెన్ ఉదయ్ సహరన్​తో కలిసి సచిన్ దాస్ ఐదో వికెట్​కు ఏకంగా 171 పరుగులు చేశారు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో పెవిలియన్​కు చేరాడు. అయినా సహరన్ నిలకడగా క్రీజులో ఉండాడు. కానీ, విజయానికి మరో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో రనౌటయ్యాడు. చివరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 48.5 ఓవర్లలో 248 పరుగులు చేసి విజయం సాధిచింది. ఫైనల్​కు చేరుకుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

అదరగొట్టిన కుర్రాళ్లు- అండర్‌-19 వరల్డ్​కప్‌ ఫైనల్‌కు టీమ్ఇండియా

భారత్​ x జింబాబ్వే టూర్​ ఫిక్స్​ - వరల్డ్​ కప్​ తర్వాత బిజీ షెడ్యూల్​

U19 World Cup 2024 Uday Saharan : అండర్‌-19 ప్రపంచ కప్‌లో యంగ్​ టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం సౌతాఫ్రికాతో బెనోని వేదికగా జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదోసారి అండర్-19 వరల్డ్ కప్​ ఫైనల్​కు చేరుకుంది. స్వల్ప వ్యవధిలోనే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయిన టీమ్​ ఇండియాను సచిన్​ దాస్​తో కలిసి కెప్టెన్ ఉదయ్ సహరన్​ గెలిపించాడు. దీంతో సహరన్​ 'ఫ్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్​' అవార్డును దక్కించుకున్నాడు. అయితే అండర్-19 వరల్డ్ కప్​ ఫైనల్​కు చేరుకోవడంపై సహరన్​ ఆనందం వ్యక్తం చేశారు.

చివరి వరకూ క్రీజులో ఉండాలి : మైదానంలోకి అడుగు పెట్టినప్పుడు చివరి వరకూ క్రీజులో ఉండాలని ముందే నిర్ణయించుకున్నట్లు ఉదయ్ సహరన్ చెప్పాడు. " నా ఆటతీరుపై నాకు నమ్మకముంది. ఒక మంచి భాగస్వామ్యం ఉంటే చాలు గెలవడం పెద్ద కష్టం కాదని నేను నమ్ముతాను. మ్యాచ్​ను చివరి వరకూ తీసుకెళ్లాలని మనసులోనే అనుకుంటూ ఉన్నాను. కేవలం నేను ఆరు ఫోర్లు మాత్రమే కొట్టాను. అందులో నాకు ఎలాంటి బాధ లేదు. ఇలా ఆడటం మా నాన్న నుంచి నేర్చుకున్నా. అవసరమైతే చివర్లో భారీ షాట్లు కొట్టాలని భావించాను. నేను క్రీజులో ఉండటమే చాలా ముఖ్యమని తెలుసు" అని ఉదయ్ సహరన్ అంటున్నారు.

" నేను బ్యాటింగ్​కు వచ్చే సమయానికి బంతి ఎక్కువగా బౌన్స్ అవుతోంది.పేసర్లకు అనకూలంగా ఉంది. అందుకే తొలుత సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాను. కొంచెం సేపు తర్వాత బ్యాటింగ్​కు అనుకూలంగా మారింది. అప్పటికీ బంతి బౌన్స్ అవుతూనే ఉంది. అయితే అప్పటికే మేం క్రీజులో కుదురుకోవటం వల్ల పెద్ద కష్టంగా అనిపించలేదు. సచిన్​ దాస్​కు ఒకటే చెప్పాను. చివరి వరకూ క్రీజులో ఉండేందుకు ప్రయత్నించు. నేను ఉంటా. అప్పుడే మ్యాచ్​ గెలవడం తేలికవుతుందని అన్నాను. అలా జరగకపోతే పరుగులు చేయటం చాలా కష్టమవుతుంది. బౌండరీ లైన్​ ఆవతల నుంచి మా కోచింగ్​ సిబ్బంది మమ్మల్ని ప్రోత్సహించారు. నా కెప్టెన్సీలో సెమీస్​లో విజయం సాధించి ఫైనల్​కు చేరడం ఆనందంగా ఉంది. అక్కడ కూడా మంచి ఆటతీరుతో ఛాంపియన్​గా నిలుస్తామని భావిస్తున్నా. అలానే ఈ సెమీస్​ మ్యాచ్​ మాకు తుది పోరుకు మంచి ప్రాక్టీస్ చేసినట్లుగా ఉంది" - ఉదయ్ సహరన్, అండర్-19 టీమ్​ఇండియా కెప్టెన్

క్లిష్ట పరిస్థితుల్లో ఉదయ్‌, సచిన్‌ దాస్‌ సూపర్ ఇన్నింగ్స్‌
టీమ్​ఇండియా టార్గెట్ 254 పరుగులు. అయితే అప్పటికే 32 పరుగలకే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆ సయమంలో కెప్టెన్ ఉదయ్ సహరన్​తో కలిసి సచిన్ దాస్ ఐదో వికెట్​కు ఏకంగా 171 పరుగులు చేశారు. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో పెవిలియన్​కు చేరాడు. అయినా సహరన్ నిలకడగా క్రీజులో ఉండాడు. కానీ, విజయానికి మరో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో రనౌటయ్యాడు. చివరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 48.5 ఓవర్లలో 248 పరుగులు చేసి విజయం సాధిచింది. ఫైనల్​కు చేరుకుంది. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

అదరగొట్టిన కుర్రాళ్లు- అండర్‌-19 వరల్డ్​కప్‌ ఫైనల్‌కు టీమ్ఇండియా

భారత్​ x జింబాబ్వే టూర్​ ఫిక్స్​ - వరల్డ్​ కప్​ తర్వాత బిజీ షెడ్యూల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.