ETV Bharat / sports

సుహాస్ యతిరాజ్: ఈ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్​ బ్యాక్​గ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే! - Suhas Yathiraj Paralympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Sep 3, 2024, 1:52 PM IST

Suhas Yathiraj Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత అద్భుతమైన ప్రదర్శన కొనసాగుతోంది. సోమవారం జరిగిన బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతక పోరులో భారత ఆటగాడు సుహాస్ రజిత పతకాన్ని సొంతం చేసుకున్నారు. అయితే సుహాస్​ బ్యాక్​గ్రౌండ్​ తెలిస్తే మీరు కచ్చితంగా షాకవ్వాల్సిందే. ఇంతకీ ఆయన ఏం చేస్తుంటారంటే?

Suhas Yathiraj Paralympics 2024
Suhas Yathiraj (Associated Press)

Suhas Yathiraj Paralympics 2024: పారిస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్​లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​​లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్​లో లుకస్ మజుర్ (ఫ్రాన్స్​) చేతిలో 9-21, 13-21 తేడాతో ఓడి సిల్వర్​తో సరిపెట్టుకున్నాడు. ఇక టోక్యోలో కూడా సిల్వర్ సాధించిన యతిరాజ్, తాజాగా పారిస్​లోనూ రజతంతో మెరిశాడు. దీంతో బ్యాడ్మింటన్​లో రెండు పతకాలు సాధించిన భారత తొలి పారా అథ్లెట్​గా రికార్డు సృష్టించాడు. ఇక విశ్వ వేదికపై రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సుహాస్ యతిరాజ్​పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. అతడి ఆటతీరును కొనియాడుతూ చాలా మంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు.

అయితే ఈయన బ్యాక్​గ్రౌండ్​ తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకుంటే ఆయన కేవలం బ్యాడ్మింటన్​ ప్లేయర్ మాత్రమే కాదు ఉత్తర్​ప్రదేశ్ ఐఏఎస్ అధికారి కూడా. ఆ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ అధికారిగానూ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, సుహాస్ భార్య రీతూ సుహాస్ కూడా ఐఏఎస్ అధికారిణే. ఆమె అర్బన్ డెవలప్‌మెంట్ ఫీల్డ్​లో విధులు నిర్వహిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రీతూ 2019లో మిసెస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు.

సోమవారం పతకాల జోరు
కాగా, సోమవారం భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. ఒక్క రోజే ఆయా క్రీడాంశాల్లో భారత్​కు స్వర్ణం సహా 7 పతకాలు దక్కాయి. అందులో 2 పసిడి, 3 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.

  • పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో SL3లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్​ దక్కించుకున్నాడు. ఫైనల్​ మ్యాచ్​లో నితేశ్ 21-14, 18- 21, 23-21 తేడాతో నెగ్గాడు.
  • మెన్స్ జావెలిన్ త్రో F64లో సుమిత్ అంతిల్ స్వర్ణ పతకాన్ని సాధించాడు
  • యోగేశ్ కుతునియా డిస్కస్ త్రోవర్ విభాగంలో రజతం దక్కించుకున్నాడు
  • తులసీమతి మురుగేశన్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ (SU5) ఈవెంట్​లో రజతంతో సత్తా చాటింది
  • ఆర్చరీ మిక్స్​డ్ టీమ్​ కాంపౌండ్ ఓపెన్​లో పారా ఆర్చర్ జోడీ శీతల్​ దేవీ, రాకేశ్ కూమార్ కాంస్య పతకాన్ని సాధించారు.

పారాలింపిక్స్​లో భారత్ జోరు- ఒక్కరోజే గోల్డ్ సహా 7 పతకాలు- మొత్తం ఎన్నంటే? - Paris Paralympics India 2024

పుట్టుకతో వైకల్యం, చేతులు లేకున్నా చెదరని సంకల్పం! - పారా ఆర్చర్ శీతల్ దేవీ గురించి తెలుసా? - Sheetal Devi Paralympics 2024

Suhas Yathiraj Paralympics 2024: పారిస్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న పారాలింపిక్స్​లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​​లో సుహాస్ యతిరాజ్ రజతం దక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్​లో లుకస్ మజుర్ (ఫ్రాన్స్​) చేతిలో 9-21, 13-21 తేడాతో ఓడి సిల్వర్​తో సరిపెట్టుకున్నాడు. ఇక టోక్యోలో కూడా సిల్వర్ సాధించిన యతిరాజ్, తాజాగా పారిస్​లోనూ రజతంతో మెరిశాడు. దీంతో బ్యాడ్మింటన్​లో రెండు పతకాలు సాధించిన భారత తొలి పారా అథ్లెట్​గా రికార్డు సృష్టించాడు. ఇక విశ్వ వేదికపై రజత పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సుహాస్ యతిరాజ్​పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. అతడి ఆటతీరును కొనియాడుతూ చాలా మంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు.

అయితే ఈయన బ్యాక్​గ్రౌండ్​ తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకుంటే ఆయన కేవలం బ్యాడ్మింటన్​ ప్లేయర్ మాత్రమే కాదు ఉత్తర్​ప్రదేశ్ ఐఏఎస్ అధికారి కూడా. ఆ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ అధికారిగానూ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, సుహాస్ భార్య రీతూ సుహాస్ కూడా ఐఏఎస్ అధికారిణే. ఆమె అర్బన్ డెవలప్‌మెంట్ ఫీల్డ్​లో విధులు నిర్వహిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రీతూ 2019లో మిసెస్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నారు.

సోమవారం పతకాల జోరు
కాగా, సోమవారం భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. ఒక్క రోజే ఆయా క్రీడాంశాల్లో భారత్​కు స్వర్ణం సహా 7 పతకాలు దక్కాయి. అందులో 2 పసిడి, 3 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి.

  • పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్​లో SL3లో నితేశ్ కుమార్ గోల్డ్ మెడల్​ దక్కించుకున్నాడు. ఫైనల్​ మ్యాచ్​లో నితేశ్ 21-14, 18- 21, 23-21 తేడాతో నెగ్గాడు.
  • మెన్స్ జావెలిన్ త్రో F64లో సుమిత్ అంతిల్ స్వర్ణ పతకాన్ని సాధించాడు
  • యోగేశ్ కుతునియా డిస్కస్ త్రోవర్ విభాగంలో రజతం దక్కించుకున్నాడు
  • తులసీమతి మురుగేశన్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ (SU5) ఈవెంట్​లో రజతంతో సత్తా చాటింది
  • ఆర్చరీ మిక్స్​డ్ టీమ్​ కాంపౌండ్ ఓపెన్​లో పారా ఆర్చర్ జోడీ శీతల్​ దేవీ, రాకేశ్ కూమార్ కాంస్య పతకాన్ని సాధించారు.

పారాలింపిక్స్​లో భారత్ జోరు- ఒక్కరోజే గోల్డ్ సహా 7 పతకాలు- మొత్తం ఎన్నంటే? - Paris Paralympics India 2024

పుట్టుకతో వైకల్యం, చేతులు లేకున్నా చెదరని సంకల్పం! - పారా ఆర్చర్ శీతల్ దేవీ గురించి తెలుసా? - Sheetal Devi Paralympics 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.