ETV Bharat / sports

'రిటైర్ అయ్యేలోపైనా పాక్​కు రండి బ్రో!'- రోహిత్, విరాట్​కు రిక్వెస్ట్ - Champions Trophy 2025

author img

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 9:19 PM IST

Rohit Virat Pakistan Visit: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్​కు ముగింపు పలికేలోపు ఒక్కసారైనా పాకిస్థాన్​కు రావాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అన్నాడు.

Rohit Virat Pakistan Visit
Rohit Virat Pakistan Visit (Source: Associated Press)

Rohit Virat Pakistan Visit: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యేలోపు పాకిస్థాన్​ను సందర్శించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆకాంక్షించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో అక్మల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ ఆటగాళ్లు అయిన రోహిత్, విరాట్​కు పాక్​లో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిని అక్మల్ అన్నాడు.

'విరాట్, రోహిత్ తమతమ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు పాకిస్థాన్​ను సందర్శిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. ప్రతీ క్రికెట్ అభిమాని వాళ్లను ఇష్టపడతాడు. వాళ్ల బ్యాటింగ్​, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్​లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ తన ప్రదర్శనతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్. ప్రస్తుత వరల్డ్ క్రికెట్​లో జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ పేసర్. ఈ ముగ్గురు ప్లేయర్లు పాకిస్థాన్​లో ఆడినప్పుడు ప్రతి అభిమానికి ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. అయితే విరాట్ అండర్- 19 సమయంలో పాకిస్థాన్ వచ్చాడు. కానీ, అప్పుడు అతడు అంత పెద్ద స్టార్ కాదు. టీమ్ఇండియా పాక్​లో ఆడితే ఈ స్టార్లు ప్రపంచంలో ఎక్కడాలేని ఫ్యాన్ బేస్​ అనుభూతిని పొందుతారు' అని అక్మల్ అన్నాడు.

అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ హోస్ట్​గా వ్యవహరించనుంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 09 దాకా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్​ నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే స్టేడియాల పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్​కు వెళ్లడం కష్టమేనని ఇప్పటికే పలుమార్లు బోర్డు పెద్దలు చెప్పారు. టీమ్ఇండియా మ్యాచ్​ల కోసం హైబ్రిడ్ మోడల్ (తటస్థ వేదికలు) అనుసరించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. కానీ, టీమ్ఇండియా మాత్రం పాకిస్థాన్​ను సందర్శించి అక్కడ క్రికెట్ ఆడాలని పాక్ మాజీలు ఇప్పటికే పలుమార్లు ఆహ్వానించారు. తమ ఆతిథ్యం గొప్పగా ఉంటుందని అన్నారు.

Rohit Virat Pakistan Visit: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యేలోపు పాకిస్థాన్​ను సందర్శించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆకాంక్షించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో అక్మల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ ఆటగాళ్లు అయిన రోహిత్, విరాట్​కు పాక్​లో కూడా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిని అక్మల్ అన్నాడు.

'విరాట్, రోహిత్ తమతమ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు పాకిస్థాన్​ను సందర్శిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. ప్రతీ క్రికెట్ అభిమాని వాళ్లను ఇష్టపడతాడు. వాళ్ల బ్యాటింగ్​, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్​లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ తన ప్రదర్శనతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్. ప్రస్తుత వరల్డ్ క్రికెట్​లో జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ పేసర్. ఈ ముగ్గురు ప్లేయర్లు పాకిస్థాన్​లో ఆడినప్పుడు ప్రతి అభిమానికి ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. అయితే విరాట్ అండర్- 19 సమయంలో పాకిస్థాన్ వచ్చాడు. కానీ, అప్పుడు అతడు అంత పెద్ద స్టార్ కాదు. టీమ్ఇండియా పాక్​లో ఆడితే ఈ స్టార్లు ప్రపంచంలో ఎక్కడాలేని ఫ్యాన్ బేస్​ అనుభూతిని పొందుతారు' అని అక్మల్ అన్నాడు.

అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ హోస్ట్​గా వ్యవహరించనుంది. 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 09 దాకా టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్​ నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే స్టేడియాల పునరుద్ధరణ పనులు ప్రారంభించింది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్​కు వెళ్లడం కష్టమేనని ఇప్పటికే పలుమార్లు బోర్డు పెద్దలు చెప్పారు. టీమ్ఇండియా మ్యాచ్​ల కోసం హైబ్రిడ్ మోడల్ (తటస్థ వేదికలు) అనుసరించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. కానీ, టీమ్ఇండియా మాత్రం పాకిస్థాన్​ను సందర్శించి అక్కడ క్రికెట్ ఆడాలని పాక్ మాజీలు ఇప్పటికే పలుమార్లు ఆహ్వానించారు. తమ ఆతిథ్యం గొప్పగా ఉంటుందని అన్నారు.

'బాత్​రూమ్​లు, సీట్లు సరిగ్గా లేవు!' పాక్ స్టేడియాల పరిస్థితిపై PCB ఛైర్మన్ - Champions Trophy 2025

టీమ్​ఇండియాను మా దగ్గరికి పంపకపోతే బీసీసీఐ అలా చేయాలి : పీసీబీ డిమాండ్​! - Champions Trophy 2025

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.