ETV Bharat / sports

టీమ్ఇండియా మా దేశం రాకూడదు- ఆటగాళ్ల భద్రతే ముఖ్యం: పాకిస్థాన్ మాజీ ప్లేయర్! - Champions Trophy 2025

author img

By ETV Bharat Sports Team

Published : Aug 30, 2024, 4:56 PM IST

Updated : Aug 30, 2024, 5:14 PM IST

Champions Trophy 2025 India: 2025 ఛాంపియన్స్​ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్ వెళ్లవద్దని ఆ దేశ మాజీ ప్లేయర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Champions Trophy 2025 India
Champions Trophy 2025 India (Source: Associated Press)

Champions Trophy 2025 India: 2025 ఛాంపియన్స్​ ట్రోఫీలో ఆడేందుకు తమ దేశానికి రావాలంటూ పాకిస్థాన్​ ప్లేయర్లు టీమ్ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలో ఆ దేశ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదంటూ ఆ దేశ మాజీ ప్లేయర్ దానిశ్ కనేరియా తాజాగా పేర్కొన్నాడు. పాకిస్థాన్​లో తాజా పరిస్థితుల దృష్యా టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచిదని కనేరియా తెలిపాడు.

'ప్రస్తుతం పాకిస్థాన్​లో పరిస్థితులను చూస్తే, టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచింది. నేను కూడా టీమ్ఇండియాను పాకిస్థాన్ వెళ్లవద్దనే చెబుతాను. దీనిపై పాకిస్థాన్ కూడా ఓసారి ఆలోచించాలి. ఆ తర్వాత ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికైనా ఆటగాళ్ల భద్రతయే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత గౌరవం అనేది రెండో ప్రాధాన్యం. ఈ విషయంలో బీసీసీఐ అద్భుతంగా వ్యవహరిస్తోంది. కానీ, ఐసీసీ తుది నిర్ణయాన్ని అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ టోర్నీ కచ్చితంగా హైబ్రిడ్ మోడల్​లో దుబాయ్​లోనే జరిగే ఛాన్స్ ఉంది' అని కనేరియా అన్నాడు.

మరికొందరు ఇలా
ఇదిలా ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్​కు గుడ్ బై చెప్పేలోపైనా పాకిస్థాన్​ను సందర్శించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఇటీవల ఆకాంక్షించాడు. 'విరాట్, రోహిత్ తమతమ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు పాకిస్థాన్​ను సందర్శిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. ప్రతీ క్రికెట్ అభిమాని వాళ్లను ఇష్టపడతాడు. వాళ్ల బ్యాటింగ్​, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్​లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ తన ప్రదర్శనతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్. ఈ స్టార్లు పాకిస్థాన్​లో ఆడితే ప్రపంచంలో ఎక్కడాలేని ఫ్యాన్ బేస్​ అనుభూతిని పొందుతారు' అని అక్మల్ రీసెంట్​గా అన్నాడు.

అయితే ఇప్పటిదాకా పలువురు పాక్ క్రికెటర్లు టీమ్ఇండియాను తమ దేశానికి ఆహ్వానించారు. భారత ప్లేయర్లు పాక్​లో ఆడితే మంచి అనుభూతి పొందుతారని అభిప్రాయపడ్డారు. ఇంతలో దానిశ్ కనేరియా తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే దేశానికి చెందిన మాజీ ప్లేయర్ స్వయంగా పాకిస్థాన్ వెళ్లవద్దు అనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

'రిటైర్ అయ్యేలోపైనా పాక్​కు రండి బ్రో!'- రోహిత్, విరాట్​కు రిక్వెస్ట్ - Champions Trophy 2025

పాక్‌కు భారత్ వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది? ప్రత్యర్థి దేశం ఆ సౌకర్యాలు కల్పించగలదా? - ICC Champions Trophy Pakistan

Champions Trophy 2025 India: 2025 ఛాంపియన్స్​ ట్రోఫీలో ఆడేందుకు తమ దేశానికి రావాలంటూ పాకిస్థాన్​ ప్లేయర్లు టీమ్ఇండియాను రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలో ఆ దేశ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్ వెళ్లకూడదంటూ ఆ దేశ మాజీ ప్లేయర్ దానిశ్ కనేరియా తాజాగా పేర్కొన్నాడు. పాకిస్థాన్​లో తాజా పరిస్థితుల దృష్యా టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచిదని కనేరియా తెలిపాడు.

'ప్రస్తుతం పాకిస్థాన్​లో పరిస్థితులను చూస్తే, టీమ్ఇండియా అక్కడకు వెళ్లకపోవడమే మంచింది. నేను కూడా టీమ్ఇండియాను పాకిస్థాన్ వెళ్లవద్దనే చెబుతాను. దీనిపై పాకిస్థాన్ కూడా ఓసారి ఆలోచించాలి. ఆ తర్వాత ఐసీసీ ఓ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికైనా ఆటగాళ్ల భద్రతయే తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత గౌరవం అనేది రెండో ప్రాధాన్యం. ఈ విషయంలో బీసీసీఐ అద్భుతంగా వ్యవహరిస్తోంది. కానీ, ఐసీసీ తుది నిర్ణయాన్ని అన్ని దేశాలు కూడా గౌరవిస్తాయని నేను అనుకుంటున్నా. నాకు తెలిసి ఈ టోర్నీ కచ్చితంగా హైబ్రిడ్ మోడల్​లో దుబాయ్​లోనే జరిగే ఛాన్స్ ఉంది' అని కనేరియా అన్నాడు.

మరికొందరు ఇలా
ఇదిలా ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కెరీర్​కు గుడ్ బై చెప్పేలోపైనా పాకిస్థాన్​ను సందర్శించాలని ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఇటీవల ఆకాంక్షించాడు. 'విరాట్, రోహిత్ తమతమ కెరీర్​కు రిటైర్మెంట్ ప్రకటించే ముందు పాకిస్థాన్​ను సందర్శిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ప్రపంచ వ్యాప్తంగా పర్యటించారు. ప్రతీ క్రికెట్ అభిమాని వాళ్లను ఇష్టపడతాడు. వాళ్ల బ్యాటింగ్​, మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్​లకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోహ్లీ తన ప్రదర్శనతో ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. రోహిత్ ఇప్పుడు వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్. ఈ స్టార్లు పాకిస్థాన్​లో ఆడితే ప్రపంచంలో ఎక్కడాలేని ఫ్యాన్ బేస్​ అనుభూతిని పొందుతారు' అని అక్మల్ రీసెంట్​గా అన్నాడు.

అయితే ఇప్పటిదాకా పలువురు పాక్ క్రికెటర్లు టీమ్ఇండియాను తమ దేశానికి ఆహ్వానించారు. భారత ప్లేయర్లు పాక్​లో ఆడితే మంచి అనుభూతి పొందుతారని అభిప్రాయపడ్డారు. ఇంతలో దానిశ్ కనేరియా తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదే దేశానికి చెందిన మాజీ ప్లేయర్ స్వయంగా పాకిస్థాన్ వెళ్లవద్దు అనడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

'రిటైర్ అయ్యేలోపైనా పాక్​కు రండి బ్రో!'- రోహిత్, విరాట్​కు రిక్వెస్ట్ - Champions Trophy 2025

పాక్‌కు భారత్ వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది? ప్రత్యర్థి దేశం ఆ సౌకర్యాలు కల్పించగలదా? - ICC Champions Trophy Pakistan

Last Updated : Aug 30, 2024, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.